Team India: పర్లేదు..! భారత బ్యాట్స్మెన్ పరుగుల వరద పారిస్తారు చూస్తుండండి!
పరుగులు చేయడం ఫామ్ కోల్పోవడం ఆటలో భాగమేనని టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ అన్నారు. ఆటగాళ్లు త్వరలోనే పరుగుల వరద పారిస్తారని ధీమా వ్యక్తం చేశారు....
లండన్: పరుగులు చేయడం.. ఫామ్ కోల్పోవడం ఆటలో భాగమేనని టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ అన్నారు. ఆటగాళ్లు త్వరలోనే పరుగుల వరద పారిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పొరపాట్లు తగ్గించుకొనేందుకు, సునాయాసంగా ఆడేందుకు కుర్రాళ్లు నెట్స్లో విపరీతంగా శ్రమిస్తున్నారని వెల్లడించారు. నాలుగోరోజు ఆట ముగిశాక ఆయన మాట్లాడారు.
విదేశాల్లో బ్యాట్స్మెన్ పదేపదే విఫలమవ్వడం తనపై ఒత్తిడి పెంచుతోందా అని ప్రశ్నించగా రాఠోడ్ లేదని జవాబిచ్చారు. ‘కానీ.. మేం చాలా శ్రమిస్తున్నాం. కుర్రాళ్లతో కలిసి కఠినంగా కృషి చేస్తున్నాం. మెరుగ్గా సాధన చేస్తుంటే, అత్యుత్తమంగా ఆడుతుంటే ఫలితాలు వాటంతటవే వస్తాయి. మంచి రోజులూ వస్తాయి’ అని ఆయన తెలిపారు.
‘క్రికెట్లో బ్యాట్స్మెన్కు అప్పుడప్పుడు గడ్డు దశ ఎదురవుతుంటుంది. ఎవరైనా సరే వాటిని అనుభవించి తీరాల్సిందే. తీవ్రంగా కృషి చేస్తూ ప్రక్రియపై దృష్టిసారిస్తే సహాయ సిబ్బంది సహకారంతో దాన్నుంచి బయటపడొచ్చు. మాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. ఎవరైనా కష్టపడ్డా, విఫలమైనా మేమూ వారి బాధను అర్థం చేసుకుంటాం. మా బ్యాట్స్మెన్పై నమ్మకముంది. వారు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. కష్టపడుతున్నారు. త్వరలోనే పరుగుల వరద పారుతుంది’ అని రాఠోడ్ అన్నారు.
కుర్రాళ్లపై వ్యక్తిగతంగానూ దృష్టిసారిస్తామని రాఠోడ్ తెలిపారు. పుల్షాట్ను మరింత నిక్కచ్చిగా ఎంపిక చేసుకోవాలని రోహిత్కు సూచించామన్నారు. ‘విశ్లేషణ చేస్తాం. ఔటైన ప్రతిసారీ మాట్లాడతాం. అప్పుడెలా ఆలోచించారు? ఎలాంటి షాట్ ఆడాలనుకున్నారో తెలుసుకుంటాం. ఉదాహరణకు పుల్షాట్ ద్వారా రోహిత్ ఎక్కువ పరుగులు చేస్తాడు. కానీ ఎక్కువ సార్లు ఔటయ్యేదీ అదే షాట్కు. అందుకే మరింత స్పష్టతతో ఆ షాట్ ఆడాలని అతడికి సూచించాం. ఇక విరాట్ కోహ్లీ ఏకాగ్రత కోల్పోవడంతోనే రెండో ఇన్నింగ్స్లో ఔటయ్యాడు. మరేం సమస్యలు లేవు. ఐదోరోజు బంతి ఎలా స్పందిస్తుందో చూడాలి! 200+ లక్ష్యం నిర్దేశిస్తే ఇంగ్లాండ్కు ఆఖరి రోజు కష్టమే’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
ద్రవిడ్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఇంపాక్ట్ రూల్పైనా మాట్లాడారు. -
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం