IPL 2021: ధోనీని ‘కింగ్ కాంగ్’ అని పిలవొచ్చు: రవిశాస్త్రి
టీమ్ఇండియా సారథిగా మహేంద్రసింగ్ ధోనీ అత్యున్నత శిఖరాలు అధిరోహించాడు. తన నాయకత్వంతో టీమ్ఇండియాకు ఎన్నో అపురూప విజయాలు అందిచడమే కాకుండా మేటి జట్టుగా తీర్చిదిద్దాడు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా సారథిగా మహేంద్రసింగ్ ధోనీ అత్యున్నత శిఖరాలు అధిరోహించాడు. తన నాయకత్వంతో టీమ్ఇండియాకు ఎన్నో అపురూప విజయాలు అందిచడమే కాకుండా మేటి జట్టుగా తీర్చిదిద్దాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఏ సారథికీ సాధ్యం కాని విధంగా అన్ని ఐసీసీ ట్రోఫీలు గెలుపొందిన కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. మరోవైపు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ను అత్యుత్తమ జట్లలో ఒకటిగానూ నిలిపాడు. ఈ రికార్డులన్నీ అందరికీ తెలిసినవే. తాజాగా భారత హెడ్కోచ్ రవిశాస్త్రి సైతం ధోనీని మెచ్చుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోనీ దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరన్నాడు. అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘పరిమిత ఓవర్ల క్రికెట్లో మహీ చిరస్థాయిగా నిలిచిపోయే సారథి. ఐసీసీ టోర్నమెంట్లలో అతడి రికార్డులు చూస్తేనే ఈ విషయం స్పష్టమవుతుంది. అతడు సాధించలేనిది ఏముంది? మూడుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు, ఛాంపియన్స్ లీగులు, మూడు ఐసీసీ ట్రోఫీలు. ఇవన్నీ మహీ సామర్థ్యాన్ని తెలియజేస్తున్నాయి. అతడికి చేరువలో కూడా ఎవరూ లేరు. అతడెప్పటికీ ఇలాగే ఉండాలి. మీరు అతడిని ‘కింగ్ కాంగ్’ అని కూడా పిలవచ్చు. ఎందుకంటే అతడు కెప్టెన్సీ చేపట్టేటప్పుడు మ్యాచ్ మొత్తం అతడి ఆధీనంలో ఉంటుంది. పరిస్థితులు అన్ని అదుపులో ఉంటాయి. మరోవైపు బ్యాటింగ్లోనూ సిక్సులు, ఫోర్లతో అలరిస్తాడు’ అని శాస్త్రి పొగడ్తల వర్షం కురిపించాడు. ఇదిలా ఉండగా.. గతేడాది ప్లేఆఫ్స్ చేరకుండా ఇంటిముఖం పట్టిన చెన్నై జట్టును ధోనీ.. ఈసారి అందరికన్నా ముందు టాప్లో ప్లేఆఫ్స్కు చేర్చాడు. మరోవైపు ఈ ఐపీఎల్ తర్వాత టీ20 ప్రపంచకప్లోనూ భారత జట్టు మెంటార్గా కొనసాగనున్నాడు. దీంతో ధోనీ పర్యవేక్షణలో కోహ్లీసేన మరో పొట్టి కప్ సాధిస్తుందేమో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు