T20 World Cup: టీమ్ఇండియా కప్ కొట్టాలంటే ఈ జట్లతోనే ప్రమాదం..!
టీమ్ఇండియా ఈ టీ20 ప్రపంచకప్లో బలంగా కనిపిస్తున్నా మనవాళ్లకు గట్టి పోటీనిచ్చే, కప్పు గెలిచే సామర్థ్యం ఉన్న జట్లు మూడున్నాయి....
ముప్పు ఆ మూడింటితోనే..
ఇంటర్నెట్డెస్క్: ఈ టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా బలంగా కనిపిస్తున్నా మనవాళ్లకు గట్టి పోటీనిచ్చే, కప్పు గెలిచే సామర్థ్యం ఉన్న జట్లు మూడున్నాయి. అవే ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్. అయితే, సూపర్-12లో భారత్, న్యూజిలాండ్ ఒకే గ్రూప్లో ఉండటంతో తొలి ప్రమాదం కివీస్ నుంచే పొంచి ఉంది. ఒకవేళ ఇక్కడ ఓడినా భారత్ పాకిస్థాన్, అఫ్గాన్, స్కాట్లాండ్, నమీబియా జట్లపై గెలుపొంది సెమీస్కు చేరే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు మరో గ్రూప్లో ఉండటంతో టీమ్ఇండియాతో సెమీస్లో పోటీపడే అవకాశం ఉంది. దీంతో కోహ్లీసేనకు నాకౌట్లోనే అసలు ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం ఆ మూడు జట్లు ఎలా ఉన్నాయి.. ఆటగాళ్లు ఎలా ఉన్నారు.. ఇదివరకు వారి ప్రదర్శన ఎలా ఉంది..?
వన్డే ప్రపంచకప్ గెలిచిన జోష్లో ఇంగ్లాండ్..
(Photo: England Cricket Twitter)
ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇంగ్లాండ్ జట్టు గురించే. 2015 వన్డే ప్రపంచకప్లో ఘోర వైఫల్యం తర్వాత ఈ జట్టు ఆటే మారిపోయింది. టెస్టు జట్టుగా ఉన్న ముద్రను పోగొట్టుకుంటూ దూకుడైన ఆటతో వన్డేలు, టీ20ల్లో మేటి జట్టుగా ఎదిగింది. ఈ క్రమంలోనే 2019 వన్డే ప్రపంచకప్ను గెలిచి చరిత్ర సృష్టించింది. బట్లర్, రాయ్, మలన్, బెయిర్స్టో లాంటి విధ్వంసకారులు.. మొయిన్ అలీ, లివింగ్స్టోన్, సామ్ కరన్ లాంటి ఆల్రౌండర్లతో ఆ జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. అవసరమైతే జోర్డాన్, వోక్స్, విల్లీ లాంటి బౌలర్లూ బ్యాటుతో రాణించగలరు. సమతూకంతో, ఎంతో ప్రమాదకరంగా కనిపిస్తున్న ఇంగ్లాండ్ను భారత్ ఎదుర్కొంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
విండీస్ ప్రమాదకరమే..
(Photo: West Indies Cricket Twitter)
మరోవైపు టీ20ల్లో వెస్టిండీస్ ఎంత ప్రమాదకరమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టీ20 ప్రపంచకప్ను రెండుసార్లు గెలిచిన ఏకైక జట్టు అదే. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ల్లో ఎక్కువ మ్యాచ్లాడి ఈ ఫార్మాట్లో రాటుదేలిపోయారు విండీస్ వీరులు. లూయిస్, సిమన్స్, ఫ్లెచర్, పొలార్డ్, గేల్, రసెల్ లాంటి విధ్వంసకర బ్యాట్స్మెన్ ఆ జట్టు సొంతం. ఆల్రౌండర్లకూ కొదవలేదు. లోతైన బ్యాటింగ్ విండీస్కు మరో బలం. ఏ స్థితిలోనైనా ఫలితాలను మార్చేసే ఆటగాళ్లు కరీబియన్ జట్టులో మెండుగా ఉన్నారు.
కివీస్ తక్కువేమీ కాదు..
(Photo: Blackcaps Twitter)
ఇక కప్పు వేటలో అండర్ డాగ్గా బరిలో ఉన్నది న్యూజిలాండ్ జట్టు. వన్డే, టీ20 ప్రపంచకప్ రెండింట్లోనూ కివీస్ను ఎప్పుడూ ఫేవరెట్గా పరిగణించరు కానీ.. ఎంతో నిలకడగా ఆడే జట్టది. వార్మప్ మ్యాచ్లు రెండింట్లోనూ ఓడిపోయినా, ఇటీవలి ఫామ్ ఏమంత బాగా లేకున్నా కివీస్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కివీస్కు ఎప్పుడూ ఆల్రౌండర్ల అండ ఉంటుంది. ఈసారి నీషమ్, మిచెల్, శాంట్నర్, ఉన్నారు. వీరికి తోడు బ్యాటింగ్లో విలియమ్సన్, గప్తిల్, కాన్వాయ్, ఫిలిప్స్.. బౌలింగ్లో బౌల్ట్, సౌథీ, జేమీసన్, ఫెర్గూసన్, ఇష్ సోధి లాంటి నాణ్యమైన ఆటగాళ్లతో కివీస్ బలంగా కనిపిస్తోంది. సెమీస్కు భారత్తో పాటుగా పై మూడు జట్లే వచ్చే అవకాశముంది. వీటిని దాటితేనే భారత్కు కప్పు దక్కే ఛాన్సుంది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల అవకాశాలనూ కొట్టిపారేయలేం కానీ.. వాటి నుంచి భారత్కు ముప్పు తక్కువే.
టీమ్ ఇండియాలో కీలక ఆటగాళ్లు : కోహ్లి, రోహిత్, రాహుల్, బుమ్రా, షమి, జడేజా.
భారత జట్టు: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, జడేజా, అశ్విన్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్, షమి, బుమ్రా, భువనేశ్వర్, శార్దూల్ ఠాకూర్.
స్టాండ్బైలు: శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం