Tokyo Olympics: షాట్పుట్ ఫైనల్స్కు చేరలేకపోయిన తజిందర్పాల్ సింగ్
ఒలింపిక్స్లో భారత్కు మరో చేదు అనుభవం ఎదురైంది. పురుషుల షాట్పుట్ విభాగంలో తజిందర్పాల్ సింగ్ ఫైనల్స్కు చేరలేకపోయాడు. ఒలింపిక్స్లో పదకొండో రోజు షాట్పుట్ విభాగంలో పోటీపడిన అతడు గంటలోనే ఇంటిముఖం పట్టాడు...
టోక్యో: ఒలింపిక్స్లో భారత్కు మరో చేదు అనుభవం ఎదురైంది. పురుషుల షాట్పుట్ విభాగంలో తజిందర్పాల్ సింగ్ ఫైనల్స్కు చేరలేకపోయాడు. ఒలింపిక్స్లో పదకొండో రోజు షాట్పుట్ విభాగంలో పోటీపడిన అతడు గంటలోనే ఇంటిముఖం పట్టాడు. మొత్తం 15 మంది పోటీపడిన ఈ ఈవెంట్లో తజిందర్ తొలి ప్రయత్నంలో 19.99 మీటర్ల ప్రదర్శన చేశాడు. తర్వాతి రెండు ప్రయత్నాల్లో అతడు ఫౌల్ కావడంతో చివరికి 13వ స్థానంలో నిలిచాడు. దాంతో ఈ విభాగంలో పెట్టుకున్న అంచనాలు కూడా తలకిందులయ్యాయి. తొలి ప్రయత్నంలో మంచి ప్రదర్శన చేసిన అతడు తర్వాత ఫౌల్స్ వేయడంతో ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఫైనల్స్కు చేరలేకపోయాడు.
కాగా, తజిందర్ ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రి ఈవెంట్లో 21.49 మీటర్ల ప్రదర్శన చేసి జాతీయ రికార్డు నెలకొల్పాడు. ఆ ప్రదర్శనతోనే అతడు ఈ ఒలింపిక్స్కు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఒలింపిక్స్ ఫైనల్ పోటీలకు చేరే క్రమంలో తజిందర్ విఫలమయ్యాడు. కాగా, ఈ ఈవెంట్లో బ్రెజిల్కు చెందిన డార్లాన్ రోమాని రెండో ప్రయత్నంలో 21.31 మీటర్ల ప్రదర్శన చేయడంతో అతడు అత్యుత్తమ ప్రదర్శన కింద నేరుగా ఫైనల్కు చేరాడు. ఈ షాట్పుట్ ఈవెంట్లో అథ్లెట్లు ఎవరైతే 21.20 మీటర్లను చేరుకుంటే వాళ్లు నేరుగా తుదిపోరుకు అర్హత సాధిస్తారు. కాగా, తజిందర్ వైఫల్యంతో భారత్ మంగళవారం మూడు పెద్ద అవకాశాలు కోల్పోయింది. తొలుత భారత పురుషుల హాకీ జట్టు సెమీస్లో ఓటమిపాలవ్వగా.. ఆపై రెజ్లర్ సోనమ్ మాలిక్ ఓపెనింగ్ రౌండ్లోనే విఫలమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.