Sourav Ganguly : కోహ్లీ.. టెస్టుల్లోనూ దూకుడుగా ఆడు : గంగూలీ
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli).. ఇటీవల సెంచరీలతో చెలరేగుతున్నాడు. దీంతో టెస్టుల్లోనూ అతడు ఇలాంటి మంచి ప్రదర్శనే చేయాలని గంగూలీ(Sourav Ganguly) కోరాడు.
ఇంటర్నెట్ డెస్క్: పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ(Virat Kohli) మునుపటి ఫామ్ను అందుకుని ఇటీవల బంగ్లాదేశ్, శ్రీలంకపై సెంచరీలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. టెస్టుల్లోనూ కింగ్ ఇదే దూకుడును ప్రదర్శించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Sourav Ganguly) కూడా ఇదే విషయంపై స్పందించాడు.
కోహ్లీపై ఉన్న అంచనాల గురించి ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడాడు . విరాట్పైనే భారత క్రికెట్ జట్టు (Team India) ఆధారపడి ఉందని.. అందుకే టెస్టుల్లోనూ అతడు దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ‘కోహ్లీ బాగా ఆడుతున్నాడు. బంగ్లాదేశ్, శ్రీలంకపై అద్భుత ప్రదర్శన చేశాడు. టెస్టు క్రికెట్లోనూ అతడు రాణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారత క్రికెట్ జట్టు అతడిపై ఆధారపడి ఉంది. త్వరలో ఆస్ట్రేలియాతో సిరీస్ జరగనుంది. రాణించడానికి అతడికిది మంచి తరుణమని భావిస్తున్నా. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడితే చూడాలని ఉంది’ అని దాదా అన్నాడు.
ఇక వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా అవకాశాలపై గంగూలీ మాట్లాడుతూ.. జట్టుపై తనకు ఎంతో నమ్మకముందని తెలిపాడు. ‘భారత్ ఎంతో బలమైన టీం. మన దేశంలో ఎంతో మంది క్రికెట్ ఆడుతున్నారు. కానీ, పోటీ తీవ్రంగా ఉండటం వల్ల.. సగం మంది ఆటగాళ్లకు జాతీయ జట్టులో అవకాశం రావడం లేదు. ప్రపంచకప్ వరకూ ఈ టీమే కొనసాగాలని కోరుకుంటున్నా. కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలెక్టర్లు ఇదే టీమ్ను మెగా టోర్నీ వరకు కొనసాగించాలి. ఇక ప్రపంచకప్లో పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆటపైనే దృష్టి పెట్టి ఉత్తమ ప్రదర్శన ఇస్తే సరిపోతుంది’ అని గంగూలీ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్