IPL 2023: నా జీవితంలో నేనెప్పటికీ మరిచిపోలేను: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా (Team India) మాజీ డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా ఐపీఎల్ (IPL)లోనూ అదరగొట్టేశాడు. తొలి సీజన్ ప్రారంభమైన సందర్భంలో ఆటగాళ్లందరూ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నట్లు సెహ్వాగ్ తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్ షెడ్యూల్ ఇప్పటికే వచ్చేసింది. తొలిసారి 2008లో ప్రారంభమైన ఐపీఎల్.. నిరాటంకంగా పదిహేను సీజన్లను పూర్తి చేసుకొంది. అయితే మొదటి సీజన్లో చోటు చేసుకొన్న సంఘటనలను టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుకు తెచ్చుకొన్నాడు. ఆసీస్ పర్యటనలో ఉన్నప్పుడు ఆటగాళ్లందరికీ క్రికెట్ దిగ్గజాలు సునీల్ గావస్కర్, రవిశాస్త్రి టోర్నీ గురించి చెప్పినట్లు సెహ్వాగ్ తెలిపాడు. దిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడిన సెహ్వాగ్.. ఐపీఎల్ ఇంత విజయవంతమవుతుందని మాత్రం ఊహించలేదని చెప్పాడు. ఐపీఎల్ 15 వసంతాలను పూర్తి చేసుకొన్న క్రమంలో ఓ క్రీడా ఛానెల్ నిర్వహించిన ప్రెస్ కాన్ఫెరెన్స్లో సెహ్వాగ్ మాట్లాడాడు.
‘‘మెగా టోర్నీ గురించి మాకు సంక్షిప్తంగా చెప్పిన సందర్భాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. అప్పుడు మేమంతా ఆస్ట్రేలియాలో ఉన్నాం. సునీల్ గావస్కర్, రవిశాస్త్రి మాతో మాట్లాడాలని చెప్పి సమావేశపరిచారు. అప్పుడే తొలిసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)గా వివరించారు. తప్పకుండా భవిష్యత్తులో భారీ లీగ్గా మారుతుందని వారికి ముందే అర్థమైపోయింది. ఈ లీగ్ ద్వారా ఎలాంటి హక్కులు వచ్చినా.. ఇప్పుడున్న సంపాదన కంటే చాలా రెట్లు ఆర్జిస్తారని భరోసాగా చెప్పారు. ఇక్కడ డబ్బు అనేది రెండో ప్రాధాన్యత అంశం.. ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఆటగాళ్లకు అవకాశం రావడం మాత్రం అద్భుతం. ఇలాంటి పెద్ద ప్లాట్ఫామ్ ప్లేయర్లకు దొరకడం నిజంగా అదృష్టమే’’ అని వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ఐపీఎల్లో 104 మ్యాచ్లు ఆడిన వీరేంద్ర సెహ్వాగ్ రెండు శతకాలు, 16 అర్ధశతకాలతో 2,728 పరుగులు సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
భారత క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కెప్టెన్గా ఎదిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. -
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి