Deepti Sharma: ముక్కోణపు సిరీస్ అనుభవాలతో ప్రపంచకప్ బరిలోకి దిగుతాం: దీప్తి శర్మ
ముక్కోణపు సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ ఈ సిరీస్లో నేర్చుకున్న అనుభవాలతో ప్రపంచకప్లో ముందుకు సాగుతామని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ముక్కోణపు సిరీస్లో నేర్చుకున్న అనుభవాలతో ప్రపంచకప్ ఆడతామని భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ అన్నారు. భారత్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 ముక్కోణపు సిరీస్లో భారత్ ఫైనల్ వరకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గురువారం ఓటమి పాలైంది. ఐదు మ్యాచుల్లో 9 వికెట్లు పడగొట్టిన దీప్తి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచింది.
ఈ సందర్భంగా దీప్తి మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్లో బ్యాటింగ్, బౌలింగ్లో మా జట్టు మంచి ప్రదర్శన చేసింది. వేదిక దక్షిణాఫ్రికా కాబట్టి ఆ జట్టుకు సహజంగానే ఇక్కడి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. టీ20 ప్రపంచకప్కు ముందు నేను చేసిన ప్రాక్టీస్ సెషన్లు ఇక్కడ సహాయపడ్డాయి. విభిన్నంగా బంతులను సంధించగలిగా. అయినప్పటికీ వికెట్లు తీయగలిగాను. ఒక జట్టుగా మేం ఒక్కడ ఏం సాధించామో దాన్ని ముందుకు తీసుకెళతాం. ప్రత్యర్థి ఎవరనేది ఆలోచించకూడదు. ఇక్కడ ఎదురైన అనుభవాలతో ప్రపంచకప్ ఆడతాం. ఏ జట్టుతో ఆడినా ఇదే వ్యూహాన్ని కొనసాగిస్తాం. ప్రపంచకప్లోనూ ఇలాగే రాణిస్తాం’’ అని దీప్తి పేర్కొంది. మహిళల ప్రపంచ కప్ ఫిబ్రవరి 10న ప్రారంభం కానుంది. భారత్ తన తొలి మ్యాచ్ ఫిబ్రవరి 12న పాకిస్థాన్తో ఆడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
ద్రవిడ్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఇంపాక్ట్ రూల్పైనా మాట్లాడారు. -
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం