IND vs WI: భారత్ పోరాడినా.. విండీస్దే విజయం
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమ్ఇండియాతో ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో వెస్టిండీస్ సత్తా చాటింది. సమష్టిగా రాణించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
సెయింట్ కిట్స్: ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమ్ఇండియాతో ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో వెస్టిండీస్ సత్తా చాటింది. సమష్టిగా రాణించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 138 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని విండీస్ 5 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఫలితంగా లక్ష్యం మోస్తరే అయినప్పటికీ టీమ్ఇండియా ఆఖరి వరకు పోరాడి ఓడింది. ప్రత్యర్థి బ్యాటర్లలో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (68) అర్ధశతకం సాధించాడు. డెవాన్ థామస్ (31*) కీలక సమయంలో రాణించి ఆకట్టుకున్నాడు. అంతకుముందు కైల్ మేయర్స్ (8), నికోలస్ పూరన్ (14), హెట్మెయర్ (6) వేగంగా ఆడే క్రమంలో ఔటయ్యారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అవేశ్ ఖాన్, అర్ష్దీప్ ఒక్కో వికెట్ పడగొట్టారు. విండీస్ తాజా విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమంగా మారింది.
మెకాయ్ మెరుపు బౌలింగ్
టీమ్ఇండియా ఇన్నింగ్స్లో విండీస్ బౌలర్ మెకాయ్ చెలరేగాడు. ఏకంగా 6 వికెట్లు తీసి భారత్పై అద్భుత ప్రదర్శన చేశాడు. మెకాయ్కు తోడు మిగతా బౌలర్లు రాణిండంతో భారత్ 138 పరుగులకే ఆలౌటైంది. పాండ్య (31), జడేజా (27), పంత్ (24) రాణించారు. మిగతవారు విఫలమవడంతో భారత్ మెరుగైన స్కోర్ చేయలేకపోయింది.
టీమ్ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. 15 ఓవర్లు పూర్తయ్యేసరికి ప్రత్యర్థి జట్టు మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. విండీస్ విజయానికి ఐదు ఓవర్లలో 38 పరుగులు అవసరం. ఈ క్రమంలో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (62*) దూకుడుగా ఆడుతూ అర్ధశతకం పూర్తి చేశాడు. అతనితో పాటు డెవాన్ థామస్ (7*) క్రీజ్లో ఉన్నాడు. జడేజా వేసిన 12.3 బంతికి హెట్మెయర్ (6) క్యాచ్ ఔటయ్యాడు.
సెయింట్ కిట్స్: రెండో టీ20లో టీమ్ఇండియా నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యఛేదనలో విండీస్ చెలరేగుతోంది. 10 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (47*) అర్ధశతకానికి చేరువలో ఉన్నాడు. అతనికి తోడుగా హెట్మెయర్ (1*) క్రీజ్లో నిలబడ్డాడు. అంతకుముందు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య వేసిన 6.1 బంతికి కైల్ మేయర్స్ (8) అశ్విన్ చేతికి చిక్కగా, అశ్విన్ బౌలింగ్లో కెప్టెన్ నికోలస్ పూరన్ (14) సూర్యకుమార్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
సెయింట్ కిట్స్: ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా.. రెండో టీ20లో టీమ్ఇండియాను బౌలింగ్లో బెంబేలెత్తించిన వెస్టిండీస్ లక్ష్యఛేదనను ప్రారంభించింది. 139 పరుగుల లక్ష్యఛేదనలో ఆ జట్టు ఐదు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టం లేకుండా 34 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (24*), కైల్ మేయర్స్ (7*) దూకుడుగా ఆడుతున్నారు. వికెట్ల కోసం భారత బౌలర్లు శ్రమిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!