Lionel Messi: మెస్సీ రిటైర్మెంట్పై ప్రచారం.. కోచ్ స్పందన..
2022 ప్రపంచకప్(FIFA World Cup) తర్వాత మెస్సీ(Lionel Messi) రిటైర్మెంట్పై జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అర్జెంటీనా(Argentina) కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్డెస్క్: సాకర్ స్టార్ లియెనల్ మెస్సీ (Lionel Messi)కి ఇదే చివరి ప్రపంచకప్ (FIFA World Cup) అని భారీగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మెస్సీ(Lionel Messi) కూడా ఈ ప్రపంచకప్లో విశ్వరూపం చూపిస్తున్నాడు. ఐదు మ్యాచ్లు ఆడిన మెస్సీ (Lionel Messi) 4 గోల్స్ నేరుగా చేయగా.. మరో రెండు గోల్స్ చేయడానికి సహకారం అందించి ద్వితీయ స్థానంలో నిలిచాడు. నేడు క్రొయేషియాతో జరగనున్న మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాడు. 2014లో అర్జెంటీనా(Argentina) ఫైనల్స్కు చేరినా.. ప్రపంచకప్ అందుకోలేదు. మెస్సీ(Lionel Messi)కి ఇది లోటుగా నిలిచింది. ఇప్పుడు మెస్సీకి దాదాపు 35 ఏళ్ల వయసు. దీంతో మరో ప్రపంచకప్ ఆడే సమయానికి అతడికి 40ఏళ్లు వచ్చేస్తాయి. ఫిట్నెస్ ప్రాధాన్యంగా సాగే సాకర్లో అప్పటి వరకు ఆడటం ఓ సవాలే.
ఈ నేపథ్యంలో ప్రపంచకప్ (FIFA World Cup) తర్వాత అంతర్జాతీయ కెరీర్కు మెస్సీ(Lionel Messi) వీడ్కోలు పలుకుతాడనే ప్రచారం జరుగుతోంది. ఈ టోర్నికి ముందు కూడా ఓ సందర్భంలో మెస్సీ(Lionel Messi) మాట్లాడుతూ ఇదే చివరి ప్రపంచకప్ కావొచ్చేమో అని వ్యాఖ్యానించాడు. తాజాగా కోచ్ లియోనల్ స్కాలనీ దీనిపై స్పందించాడు. ‘‘ప్రస్తుతం మెస్సీఆటతీరును ఎంజాయ్ చేస్తున్నాను. అతడు ఆటను కొనసాగిస్తాడో లేదో చూద్దాం. అతడు కొనసాగడం మాకు (అర్జెంటీనా జట్టుకు), ఫుట్బాల్ ప్రపంచానికి గొప్పవిషయం’’ అని పేర్కొన్నాడు.
మరోవైపు మెస్సీ(Lionel Messi) సమఉజ్జీగా పేరున్న పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్(FIFA World Cup) కల చెదిరిపోయింది. మరో ప్రపంచకప్ తాను ఆడననే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘నా కల ముగిసింది’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు