WTC Final: పోరాడుతున్న టీమ్ఇండియా.. నాలుగో రోజు ముగిసిన ఆట
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final)లో భారత్ పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్ను ఆసీస్ 270/8 వద్ద డిక్లేర్డ్ చేసింది. అనంతరం 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
లండన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final)లో భారత్ పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్ను ఆసీస్ 270/8 వద్ద డిక్లేర్డ్ చేసింది. అనంతరం 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44*), అజింక్య రహానె (20*) పరుగులతో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 280 పరుగులు అవసరం. రోహిత్ శర్మ (43; 60 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడినా దాన్ని భారీ ఇన్నింగ్స్గా మలచలేకపోయాడు. శుభ్మన్ గిల్ (18), చెతేశ్వర్ పుజారా (27) మరోసారి నిరాశపర్చారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, స్కాట్ బొలాండ్, నాథన్ లైయన్ తలో వికెట్ తీశారు.
ఆరంభం అదిరినా..
భారీ లక్ష్యఛేదనలో టీమ్ఇండియాకు మంచి ఆరంభమే దక్కిందని చెప్పాలి. కమిన్స్ వేసిన మూడో ఓవర్లో శుభ్మన్ గిల్ రెండు ఫోర్లు, రోహిత్ ఒక ఫోర్ రాబట్టారు. బొలాండ్ వేసిన తర్వాతి ఓవర్లో హిట్మ్యాన్ మరో బౌండరీ బాదాడు. టీమ్ఇండియా కెప్టెన్ దూకుడు కొనసాగిస్తూ స్టార్క్ బౌలింగ్లో సిక్స్ బాదాడు. 7 ఓవర్లకు 41/0తో నిలిచి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం ఏర్పడుతున్న సమయంలో శుభ్మన్ గిల్ను బొలాండ్ పెవిలియన్కు పంపాడు. గిల్ స్లిప్లో కామెరూన్ గ్రీన్కు క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే టీ విరామం ప్రకటించారు. అనంతరం పుజారాతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. వీరిద్దరూ నిలకడగా ఆడి రెండో వికెట్కు అర్ధ శతక భాగస్వామ్యం నెలకొల్పారు. అర్ధ శతకం దిశగా సాగుతున్న రోహిత్ నాథన్ లైయన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కమిన్స్ వేసిన తర్వాతి ఓవర్లోనే చెతేశ్వర్ పుజారా వికెట్ కీపర్ కేరీకి క్యాచ్ ఇచ్చాడు. దీంతో 93 పరుగులకే టీమ్ఇండియా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, రహానె మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నారు.
ఓవర్ నైట్ స్కోరు 123/4తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో మార్నస్ లబుషేన్ (41) ఔటయ్యాడు. ఆఫ్సైడ్ వేసిన బంతిని ఆడబోయి స్లిప్లోని పుజారా చేతికి చిక్కాడు. అనంతరం భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోరు వేగం నెమ్మదించింది. లంచ్ బ్రేక్కు ముందు జడేజా బౌలింగ్లో కామెరూన్ గ్రీన్ (25) క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో భోజన విరామ సమయానికి 201/6తో నిలిచింది. రెండో సెషన్ ఆరంభం నుంచి మిచెల్ స్టార్క్ (41; 57 బంతుల్లో) నిలకడగా బౌండరీలు సాధించాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. షమి బౌలింగ్లోనూ వరుసగా రెండు ఫోర్లు బాదిన స్టార్క్.. అదే ఓవర్లో స్లిప్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. కొద్దిసేపటికే షమి బౌలింగ్లోనే కమిన్స్ (5) అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చిన వెంటనే ఆసీస్ డిక్లేర్డ్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!