Ruturaj Gaikwad: సచిన్ రికార్డును సమం చేసిన రుతురాజ్ గైక్వాడ్
చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 మెగా టోర్నీ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించి క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రికార్డును సమం చేశాడు. గత రాత్రి హైదరాబాద్తో
(Photo: Ruturaj Instagram)
ఇంటర్నెట్డెస్క్: చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 మెగా టోర్నీ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించి క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రికార్డును సమం చేశాడు. గత రాత్రి హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గైక్వాడ్ ఈ ఘనత సాధించాడు.
ఆదివారం రాత్రి హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రుతురాజ్ అదరగొట్టిన విషయం తెలిసిందే. 6వ ఓవర్లో జన్సెన్ వేసిన తొలి బంతికి సిక్స్ కొట్టి రుతురాజ్ ఈ మెగా టోర్నీలో 1000 పరుగులు పూర్తి చేశాడు. కేవలం 31 మ్యాచ్ల్లోనే వెయ్యి పరుగులు సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు సచిన్ పేరుపై ఉన్న రికార్డును రుతురాజ్ సమం చేశాడు. వీరిద్దరి తర్వాత సురేశ్ రైనా (34 మ్యాచ్లు), రిషభ్ పంత్ (35 మ్యాచ్లు), దేవదత్ పడిక్కల్ (35 మ్యాచ్లు) అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన వారి జాబితాలో ఉన్నారు.
ఈ ఏడాది మెగా టోర్నీలో ఆరంభంలో పేలవ ప్రదర్శన చేసిన రుతురాజ్.. నిన్నటి మ్యాచ్లో చెలరేగిపోయాడు. మరో ఓపెనర్ కాన్వేతో కలిసి 182 పరుగుల అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 57 బంతుల్లో 99 పరుగులు సాధించి తృటిలో శతకాన్ని కోల్పోయాడు. మ్యాచ్ అనంతరం దీనిపై మాట్లాడుతూ.. ‘‘సొంత గ్రౌండ్లో పెద్ద స్కోరు చేయడం ఎప్పటికీ ప్రత్యేకమే. శతకం కోల్పోయినందుకు కాస్త బాధగా ఉన్నప్పటికీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు చాలా ఆనందంగా ఉంది. 99 అయినా 100 అయినా జట్టు గెలుపొందడమే చాలా ముఖ్యం’’ అని చెప్పుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
ద్రవిడ్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఇంపాక్ట్ రూల్పైనా మాట్లాడారు. -
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?