Virat Kohli : ఇతర ఫ్రాంచైజీల నుంచి ఆఫర్లు వచ్చినా.. వెళ్లకపోవడానికి కారణమదే: కోహ్లీ
టీ20 లీగ్ తొలి సీజన్ నుంచి ఇప్పటి వరకు ఒకే జట్టుకు ఆడుతున్న ఆటగాడు విరాట్ కోహ్లీ. బెంగళూరు తరఫున 218 మ్యాచ్లను ఆడాడు. ఎనిమిది సీజన్లు ...
ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్ తొలి సీజన్ నుంచి ఇప్పటి వరకు ఒకే జట్టుకు ఆడుతున్న ఆటగాడు విరాట్ కోహ్లీ. బెంగళూరు తరఫున 218 మ్యాచ్లను ఆడాడు. ఎనిమిది సీజన్లు బెంగళూరుకు నాయకత్వం వహించాడు. విరాట్ ఐదు శతకాలు, 43 అర్ధ శతకాలతో 6,499 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 113 పరుగులు. గత సీజన్ వరకు భీకర ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ కోసం ఇతర జట్లూ భారీ ఆఫర్లను ప్రకటించాయి. అయితే, కోహ్లీ వాటన్నింటనీ వదులుకొని బెంగళూరుకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీనికిగల కారణాలను విరాట్ కోహ్లీ వెల్లడించాడు. బెంగళూరు జట్టుపై ఉన్న ప్రేమే తనని ఇతర జట్లవైపు వెళ్లకుండా చేసిందని పేర్కొన్నాడు.
‘‘నిజాయితీగా చెప్పాలంటే ఇతర ఫ్రాంచైజీల నుంచి వచ్చిన ఆఫర్లను పరిశీలించా. వేలంలోకి రావాలని చాలా మంది సంప్రదించారు. నేను కూడా వేలంలోకి వెళ్లి నా విలువ ఎంత ఉంటుందనేది తెలుసుకోవాలని భావించా. అయితే, తర్వాత దాని గురించి బాగా ఆలోచించా. ప్రతి ఒక్కరి జీవితం ఏదోవిధంగా ముందుకు సాగుతూనే ఉంటుంది. ట్రోఫీలు గెలిచిన గొప్ప వ్యక్తులు చాలా మంది ఉంటారు. కానీ, ఎవరూ కూడానూ.. అతడు ఇది గెలిచాడు.. అది గెలిచాడు అని ప్రతి సారి చెప్పరు. వ్యక్తిగతంగా మీరు మంచి వ్యక్తి అయితే ప్రజలు, అభిమానులు ఇష్టపడతారు. ఒకవేళ చెడ్డవారైతే మాత్రం దూరంగా పెడతారు. నా వరకైతే బెంగళూరుతో ఉన్న అనుబంధం ఎలా ఉందనే విషయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటా. ఇప్పటి వరకు నాపై నమ్మకం ఉంచిన బెంగళూరు యాజమాన్యం మద్దతుగా నిలిచింది. మరీ ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో, ఫామ్లో లేని సమయంలో అండగా ఉంది’’ అని కోహ్లీ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!