దక్షిణ గంగ గరళంగా...
దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి గరళంగా మారుతోంది. రాష్ట్రంలో ప్రవేశించే కందకుర్తి(బాసర) నుంచి.. సరిహద్దు బూర్గంపహాడ్(భద్రాచలం) వరకు కాలుష్య కోరల్లో చిక్కుకుని అల్లాడుతోంది. ఇందులో కలిసే ఉపనదులూ విషాన్ని మోసుకొస్తున్నాయి. పరీవాహక ప్రాంతాలు కాలుష్యానికి ఆలవాలంగా మారాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మనుషులు వినియోగించేందుకే కాదు.. జలచరాలకూ గడ్డు పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
బాసర నుంచి భద్రాద్రి దాకా కాలుష్య కోరల్లో గోదావరి నది
విషతుల్యం చేస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు
ఉప నదుల్లోనూ నానాటికీ తీసికట్టుగా నీటి నాణ్యత
ఈనాడు - హైదరాబాద్
దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి గరళంగా మారుతోంది. రాష్ట్రంలో ప్రవేశించే కందకుర్తి(బాసర) నుంచి.. సరిహద్దు బూర్గంపహాడ్(భద్రాచలం) వరకు కాలుష్య కోరల్లో చిక్కుకుని అల్లాడుతోంది. ఇందులో కలిసే ఉపనదులూ విషాన్ని మోసుకొస్తున్నాయి. పరీవాహక ప్రాంతాలు కాలుష్యానికి ఆలవాలంగా మారాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మనుషులు వినియోగించేందుకే కాదు.. జలచరాలకూ గడ్డు పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఎందుకీ పరిస్థితి?
ఇళ్లలోని మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా వచ్చి నదిలో కలుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని పరిశ్రమల యజమానులు వర్షపునీటిలో రసాయన వ్యర్థాల్ని కలిపేసి నదుల్లోకి వదులుతున్నారు. గోదావరిఖని కోల్బెల్ట్ ప్రాంతంలో తాజాగా నదిలో పెద్దమొత్తంలో నురగ ఏర్పడటం కలవరం కలిగిస్తోంది. గోదావరితోపాటు అందులో కలిసే ఉపనదులు, 50కిపైగా నాలాల నుంచి వచ్చే కాలుష్య ప్రభావాన్ని ‘ఈనాడు’ పరిశీలించింది. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) 2021 గణాంకాల్నీ ఆరా తీయగా.. పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉందని అర్థమవుతోంది.
ఏ ప్రాంతంలో ఎలా కలుషితం అవుతోందంటే..?
బాసర: మహారాష్ట్రలోని ధర్మాబాద్ ఇక్కడికి 5 కి.మీ. దూరమే. అక్కడి ఓ మద్యం కంపెనీ.. శుద్ధిచేయని రసాయన వ్యర్థాల్ని వదులుతోంది. ఏడాదంతా పరిశ్రమ ఆవరణలో నిల్వచేసి వర్షాకాలం రాగానే నదిలోకి పంపిస్తుండటంతో బాసర వద్ద గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయి.
రామగుండం: నిత్యం 40 ఎంఎల్డీలకుపైగా మురుగునీరు, ఓ పరిశ్రమ వ్యర్థాలు నదిలో చేరుతున్నాయి. ధర్మపురి, మంథని పట్టణాలు, తీర గ్రామాల నుంచి మరో 40 ఎంఎల్డీల మురుగు వచ్చిచేరుతోంది.
మంచిర్యాల: 18 ఏళ్లక్రితం నిర్మించిన ఎస్టీపీలు నిర్వహణలేక నిరుపయోగంగా మారాయి. పట్టణంలో మురుగునీరు రాళ్లవాగులోకి అక్కడి నుంచి గోదావరిలోకి చేరుతోంది.
గౌడిచర్ల: పటాన్చెరు పరిశ్రమల కాలుష్య జలాల్ని తీసుకువచ్చే నక్కవాగు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గౌడిచర్ల వద్ద మంజీరలో కలుస్తుంది. బచ్చులగూడెం వద్ద బాగా కలుషితం అవుతోంది.
భద్రాచలం: భద్రాచలం పట్టణంలోని మురుగునీరంతా ఆరు కాలువల నుంచి గోదావరిలో కలుస్తోంది. శుద్ధికేంద్రం లేదు.
బూర్గంపాడు: మండలంలోని సారపాకలో ఓ పరిశ్రమ నుంచి విడుదలయ్యే వ్యర్థ రసాయన జలాలు గోదావరిలో చేరుతున్నాయి.
మురుగునీరు ముంచేస్తోంది
గోదావరి పరీవాహక ప్రాంతాల్లో 50కిపైగా నాలాల నుంచి మురుగునీరు వస్తోంది. రోజుకు 249 ఎంఎల్డీల నీళ్లు వాడుతుంటే అందులో 199 ఎంఎల్డీల మురుగునీరు శుద్ధి చేయకుండానే నదిలో చేరుతోంది. ఈ పరిస్థితి ఉపనదుల్లో మరింత ఎక్కువగా ఉంది. ఈ నది పరీవాహకంలో రోజూ 10 ఎంఎల్డీలకుపైగా మురుగునీటిని ఉత్పత్తిచేసే పట్టణాలు, ప్రాంతాలు ఆరు ఉన్నాయి.
* మంచిర్యాల 25.02 ఎంఎల్డీలు, సింగారెడ్డిపల్లె 25.2, బూర్గంపాడు 16.92, బోర్నపల్లి 16.83, తంగిని 16.8, కోటిలింగాల నుంచి 11.59 ఎంఎల్డీల మురుగునీరు గోదావరిలోకి వెళుతోంది.
* కొన్నిచోట్ల మురుగునీటి శుద్ధి కేంద్రాల్ని ఏర్పాటుచేసినా నిర్వహణ సమస్యలతో పనిచేయట్లేదు. రామగుండంలో 18 ఎంఎల్డీ, మంచిర్యాలలో 6.5, భద్రాచలంలో 2 ఎంఎల్డీల సామర్థ్యల గల మురుగునీటి శుద్ధి కేంద్రాలు పనిచేయట్లేదు. బాసర, ధర్మపురి, నిర్మల్, లక్షెట్టిపేట, మంథని, సారపాక వంటిచోట్ల సరైన డ్రైనేజీ వ్యవస్థేలేదు. ఎస్టీపీలూ లేవు.
నదులు, ఉపనదుల్లో కాలుష్య తీవ్రత
నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ (డీఓ) పరిమాణం నదుల్లో క్రమక్రమంగా తగ్గుతోంది. లీటరు నీటిలో డీఓ పరిమాణం కనీసం 4 మిల్లీగ్రాములుండాలి. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) 3 మిల్లీగ్రాములు దాటితే ప్రమాదకరం. ఉప నదుల్లో 4-9 మిల్లీగ్రాముల వరకు వెళుతోంది. గోదావరిలో వార్షిక సగటు 3 లోపే ఉంటున్నట్లు కనిపిస్తున్నా.. కొన్నినెలల్లో ఐదు వరకు వెళుతోంది.
నానాటికీ దిగజారుతూ...
కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం 2021 వార్షిక సగటు (జనవరి-జులై)లో నీటి నాణ్యత గోదావరి, మంజీర, కిన్నెరసాని నదులలో ‘బి’ గ్రేడ్లో, మానేరు ‘సి’ గ్రేడ్లో ఉంది. రామగుండం వద్ద గోదావరి ‘సి’ గ్రేడ్లో ఉంది. కరీంనగర్ మున్సిపల్ డంపింగ్ కేంద్రం దగ్గర మానేరులో జలనాణ్యత ‘డి’ గ్రేడ్కు పడిపోయింది.
ఇలాగైతే ఎలా...?
ఎ గ్రేడ్ : బ్యాక్టిరియాను తొలగించి మంచినీళ్లుగా తాగొచ్చు
బి గ్రేడ్ : తాగడానికి పనికిరావు. స్నానం చేయొచ్చు
సి గ్రేడ్ : శుద్ధి చేస్తే తప్ప తాగకూడదు
డి గ్రేడ్ : జంతువులు, చేపలకే పనికొస్తాయి
ఇ గ్రేడ్ : వ్యవసాయ అవసరాలకే
ఇ గ్రేడ్ దాటితే : ఎందుకూ పనికిరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?