దక్షిణ గంగ గరళంగా...
దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి గరళంగా మారుతోంది. రాష్ట్రంలో ప్రవేశించే కందకుర్తి(బాసర) నుంచి.. సరిహద్దు బూర్గంపహాడ్(భద్రాచలం) వరకు కాలుష్య కోరల్లో చిక్కుకుని అల్లాడుతోంది. ఇందులో కలిసే ఉపనదులూ విషాన్ని మోసుకొస్తున్నాయి. పరీవాహక ప్రాంతాలు కాలుష్యానికి ఆలవాలంగా మారాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మనుషులు వినియోగించేందుకే కాదు.. జలచరాలకూ గడ్డు పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
బాసర నుంచి భద్రాద్రి దాకా కాలుష్య కోరల్లో గోదావరి నది
విషతుల్యం చేస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు
ఉప నదుల్లోనూ నానాటికీ తీసికట్టుగా నీటి నాణ్యత
ఈనాడు - హైదరాబాద్
దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి గరళంగా మారుతోంది. రాష్ట్రంలో ప్రవేశించే కందకుర్తి(బాసర) నుంచి.. సరిహద్దు బూర్గంపహాడ్(భద్రాచలం) వరకు కాలుష్య కోరల్లో చిక్కుకుని అల్లాడుతోంది. ఇందులో కలిసే ఉపనదులూ విషాన్ని మోసుకొస్తున్నాయి. పరీవాహక ప్రాంతాలు కాలుష్యానికి ఆలవాలంగా మారాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మనుషులు వినియోగించేందుకే కాదు.. జలచరాలకూ గడ్డు పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఎందుకీ పరిస్థితి?
ఇళ్లలోని మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా వచ్చి నదిలో కలుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని పరిశ్రమల యజమానులు వర్షపునీటిలో రసాయన వ్యర్థాల్ని కలిపేసి నదుల్లోకి వదులుతున్నారు. గోదావరిఖని కోల్బెల్ట్ ప్రాంతంలో తాజాగా నదిలో పెద్దమొత్తంలో నురగ ఏర్పడటం కలవరం కలిగిస్తోంది. గోదావరితోపాటు అందులో కలిసే ఉపనదులు, 50కిపైగా నాలాల నుంచి వచ్చే కాలుష్య ప్రభావాన్ని ‘ఈనాడు’ పరిశీలించింది. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) 2021 గణాంకాల్నీ ఆరా తీయగా.. పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉందని అర్థమవుతోంది.
ఏ ప్రాంతంలో ఎలా కలుషితం అవుతోందంటే..?
బాసర: మహారాష్ట్రలోని ధర్మాబాద్ ఇక్కడికి 5 కి.మీ. దూరమే. అక్కడి ఓ మద్యం కంపెనీ.. శుద్ధిచేయని రసాయన వ్యర్థాల్ని వదులుతోంది. ఏడాదంతా పరిశ్రమ ఆవరణలో నిల్వచేసి వర్షాకాలం రాగానే నదిలోకి పంపిస్తుండటంతో బాసర వద్ద గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయి.
రామగుండం: నిత్యం 40 ఎంఎల్డీలకుపైగా మురుగునీరు, ఓ పరిశ్రమ వ్యర్థాలు నదిలో చేరుతున్నాయి. ధర్మపురి, మంథని పట్టణాలు, తీర గ్రామాల నుంచి మరో 40 ఎంఎల్డీల మురుగు వచ్చిచేరుతోంది.
మంచిర్యాల: 18 ఏళ్లక్రితం నిర్మించిన ఎస్టీపీలు నిర్వహణలేక నిరుపయోగంగా మారాయి. పట్టణంలో మురుగునీరు రాళ్లవాగులోకి అక్కడి నుంచి గోదావరిలోకి చేరుతోంది.
గౌడిచర్ల: పటాన్చెరు పరిశ్రమల కాలుష్య జలాల్ని తీసుకువచ్చే నక్కవాగు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గౌడిచర్ల వద్ద మంజీరలో కలుస్తుంది. బచ్చులగూడెం వద్ద బాగా కలుషితం అవుతోంది.
భద్రాచలం: భద్రాచలం పట్టణంలోని మురుగునీరంతా ఆరు కాలువల నుంచి గోదావరిలో కలుస్తోంది. శుద్ధికేంద్రం లేదు.
బూర్గంపాడు: మండలంలోని సారపాకలో ఓ పరిశ్రమ నుంచి విడుదలయ్యే వ్యర్థ రసాయన జలాలు గోదావరిలో చేరుతున్నాయి.
మురుగునీరు ముంచేస్తోంది
గోదావరి పరీవాహక ప్రాంతాల్లో 50కిపైగా నాలాల నుంచి మురుగునీరు వస్తోంది. రోజుకు 249 ఎంఎల్డీల నీళ్లు వాడుతుంటే అందులో 199 ఎంఎల్డీల మురుగునీరు శుద్ధి చేయకుండానే నదిలో చేరుతోంది. ఈ పరిస్థితి ఉపనదుల్లో మరింత ఎక్కువగా ఉంది. ఈ నది పరీవాహకంలో రోజూ 10 ఎంఎల్డీలకుపైగా మురుగునీటిని ఉత్పత్తిచేసే పట్టణాలు, ప్రాంతాలు ఆరు ఉన్నాయి.
* మంచిర్యాల 25.02 ఎంఎల్డీలు, సింగారెడ్డిపల్లె 25.2, బూర్గంపాడు 16.92, బోర్నపల్లి 16.83, తంగిని 16.8, కోటిలింగాల నుంచి 11.59 ఎంఎల్డీల మురుగునీరు గోదావరిలోకి వెళుతోంది.
* కొన్నిచోట్ల మురుగునీటి శుద్ధి కేంద్రాల్ని ఏర్పాటుచేసినా నిర్వహణ సమస్యలతో పనిచేయట్లేదు. రామగుండంలో 18 ఎంఎల్డీ, మంచిర్యాలలో 6.5, భద్రాచలంలో 2 ఎంఎల్డీల సామర్థ్యల గల మురుగునీటి శుద్ధి కేంద్రాలు పనిచేయట్లేదు. బాసర, ధర్మపురి, నిర్మల్, లక్షెట్టిపేట, మంథని, సారపాక వంటిచోట్ల సరైన డ్రైనేజీ వ్యవస్థేలేదు. ఎస్టీపీలూ లేవు.
నదులు, ఉపనదుల్లో కాలుష్య తీవ్రత
నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ (డీఓ) పరిమాణం నదుల్లో క్రమక్రమంగా తగ్గుతోంది. లీటరు నీటిలో డీఓ పరిమాణం కనీసం 4 మిల్లీగ్రాములుండాలి. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) 3 మిల్లీగ్రాములు దాటితే ప్రమాదకరం. ఉప నదుల్లో 4-9 మిల్లీగ్రాముల వరకు వెళుతోంది. గోదావరిలో వార్షిక సగటు 3 లోపే ఉంటున్నట్లు కనిపిస్తున్నా.. కొన్నినెలల్లో ఐదు వరకు వెళుతోంది.
నానాటికీ దిగజారుతూ...
కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం 2021 వార్షిక సగటు (జనవరి-జులై)లో నీటి నాణ్యత గోదావరి, మంజీర, కిన్నెరసాని నదులలో ‘బి’ గ్రేడ్లో, మానేరు ‘సి’ గ్రేడ్లో ఉంది. రామగుండం వద్ద గోదావరి ‘సి’ గ్రేడ్లో ఉంది. కరీంనగర్ మున్సిపల్ డంపింగ్ కేంద్రం దగ్గర మానేరులో జలనాణ్యత ‘డి’ గ్రేడ్కు పడిపోయింది.
ఇలాగైతే ఎలా...?
ఎ గ్రేడ్ : బ్యాక్టిరియాను తొలగించి మంచినీళ్లుగా తాగొచ్చు
బి గ్రేడ్ : తాగడానికి పనికిరావు. స్నానం చేయొచ్చు
సి గ్రేడ్ : శుద్ధి చేస్తే తప్ప తాగకూడదు
డి గ్రేడ్ : జంతువులు, చేపలకే పనికొస్తాయి
ఇ గ్రేడ్ : వ్యవసాయ అవసరాలకే
ఇ గ్రేడ్ దాటితే : ఎందుకూ పనికిరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
నడి వేసవిలో వణికించిన వాన
భగభగమనే ఎండలతో దాదాపు 10 రోజులుగా అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. మంగళవారం ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. -
మేడిగడ్డ రెండు గేట్లను పూర్తిగా తొలగించండి
‘కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగిన ఏడో బ్లాకులో తెరుచుకోని ఎనిమిది రేడియల్ గేట్లలో రెండింటిని పూర్తిగా తొలగించాలి. -
‘రైతు భరోసా’ బంద్
‘రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు అందజేసే పంట సాయం పంపిణీని తక్షణం నిలుపుదల చేయాలి. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. -
అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూ తేదీలు వచ్చేశాయ్
యూఎస్లో ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఈ నెల 31 వరకూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ సమయాల (స్లాట్స్)ను అమెరికా ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బీసీ, సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
రైతుభరోసాపై త్వరలో విధివిధానాలు
రాష్ట్రంలోని అర్హులైన రైతులకే రైతుభరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
ప్రధాని మోదీతో పీవీ కుటుంబ సభ్యుల భేటీ
ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు కలిశారు. -
20 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ కేసులో మే 14 వరకు, సీబీఐ కేసులో 20 వరకు పొడిగించింది. -
ఓట్ల ప్రయాణంలో.. నోట్ల దోపిడీ
ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అన్న తేడా లేదు. ఏపీ వైపు వెళ్లే అన్ని బస్సుల్లో రిజర్వేషన్లు అయిపోయాయి. రైళ్లలో నెల క్రితమే అయిపోయి.. వెయిటింగ్ లిస్టులు వందలు దాటేశాయి. -
50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలి
తెలంగాణలో 50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలని పీఆర్టీయూటీఎస్ సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
కనీస వేతనం రూ.30 వేలు ఉండాలి
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కనీస వేతనం రూ.30 వేలు, గరిష్ఠ వేతనం రూ.2,48,150, ఫిట్మెంట్ 30 శాతంతో కొత్త పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్యూటీఎఫ్) శివశంకర్ను కోరింది. -
ముఖ గుర్తింపు విధానం నుంచి మినహాయించండి!
తెలంగాణలోని పాఠశాలల్లో హాజరు నమోదుకు కొత్త విద్యాసంవత్సరం నుంచి చేపడుతున్న ముఖగుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) విధానం నుంచి అంధ ఉపాధ్యాయులకు మినహాయింపునివ్వాలని రాష్ట్ర అంధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.మల్లేశం, రాఘవేందర్రెడ్డి, ఇతర నేతలు అనిల్కుమార్, జి.మల్లేశ్, నాగేంద్రమ్మలు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని కోరారు. -
గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఫైన్ ఆర్ట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ కోర్సులు
గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని మహిళల ఫైన్ ఆర్ట్స్ అకాడమీ (సిరిసిల్ల)లో బీఏ ఆనర్స్ ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫొటోగ్రఫీ-డిజిటల్ ఇమేజింగ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. -
టీఎస్ఈఏపీసెట్కు తొలిరోజు 90 శాతానికి పైగా హాజరు
తెలంగాణలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీఎస్ఈఏపీసెట్-2024’ పరీక్షకు మంగళవారం 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. -
కర్ణాటకలో నేడు కృష్ణా జలాల విడుదల
కర్ణాటక నుంచి తెలంగాణకు బుధవారం కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్ నుంచి 1.9 టీఎంసీల నీటిని దిగువకు వదిలేందుకు అక్కడి జలవనరుల శాఖ అంగీకరించింది. -
భూగర్భ జలాలు వేగంగా ఖాళీ!
రాష్ట్రంలో భూగర్భ జలాలు చాలా వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ప్రాజెక్టులు, ఇతర నీటి వనరులకు ఈ ఏడాది ఆశించిన మేర ప్రవాహాలు రాలేదు. చెరువులు, నీటి కుంటలు ఎండిపోయాయి. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత మొక్కజొన్న పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు 67వ మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
-
ఇజ్రాయెల్కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
-
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276