TRS: 40 మందితో తెరాస రాష్ట్ర కమిటీ!
తెరాస రాష్ట్ర కమిటీపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేపట్టారు. 40 మందితో కొత్త కమిటీ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు తెలిసింది. 15 మంది వరకు ప్రధాన కార్యదర్శులు, 25 మందిని కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులుగా నియమించనున్నారని సమాచారం.
ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు చోటు
రాష్ట్ర, జాతీయ అవసరాల కోణంలో ఎంపిక
అధినేత కేసీఆర్ కసరత్తు
ఈనాడు, హైదరాబాద్: తెరాస రాష్ట్ర కమిటీపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేపట్టారు. 40 మందితో కొత్త కమిటీ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు తెలిసింది. 15 మంది వరకు ప్రధాన కార్యదర్శులు, 25 మందిని కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులుగా నియమించనున్నారని సమాచారం. రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలకూ ఉపయోగపడే వారిపై దృష్టి సారిస్తున్నారు. వారం, పదిరోజుల్లో పేర్లు ప్రకటించే వీలుంది. తెరాస ప్రస్తుత రాష్ట్ర కమిటీ 67 మందితో ఉంది. పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడితో సహా 20 మంది ప్రధాన కార్యదర్శులు, 33 మంది కార్యదర్శులు, 12 మంది సంయుక్త కార్యదర్శులున్నారు. వచ్చే సంవత్సరం చివర్లో జరిగే శాసనసభ, 2024లో జరిగే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనువుగా కొత్త కమిటీని ఆయన ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత కమిటీలో సగం మంది పనితీరుపై కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అసంతృప్తితో ఉన్నారు. సంస్థాగత ఎన్నికల నిర్వహణ మొదలుకొని...ఇతరత్రా పార్టీ అప్పగించిన బాధ్యతలు సరిగా నిర్వర్తించడంలేదని వారు గుర్తించారు. కొందరు పదవిని అలంకార ప్రాయంగానూ, సొంత అవసరాలకు వాడుకున్నారని, వారివారి సామాజిక వర్గాలలోనూ పట్టు లేదని తేలింది. ఉప ఎన్నికలలో విధులను అప్పగించగా...దానిని వదిలేసి, హైదరాబాద్లో తిష్ఠవేశారని తెలిసింది. కొంత మంది టీవీ చర్చలకే పరిమితం కాగా... మరికొందరు తెలంగాణభవన్లో సమావేశాలకు మాత్రమే హాజరయ్యారు. కొందరికి నియమిత పదవులు ఇచ్చినా... దానిని స్వప్రయోజనాలకే వాడుకున్నారని గమనించారు. సభ్యత్వ నమోదు సందర్భంగా పలువురు సరిగా పనిచేయకపోవడంతో అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తంచేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం కొందరిని నియమించగా...వారు ప్రచారం మాని...హైదరాబాద్లో పార్టీ ప్లీనరీకి రావడం చూసి అందరూ విస్మయం చెందారు. కొందరి పనితీరు నచ్చక వారిని పార్టీ బాధ్యతల నుంచి తొలగించి, ఇతరులకు అధిష్ఠానం అప్పగించింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత కమిటీలోని పలువురిని తొలగించి, కొత్త వారిని నియమించనున్నారని తెలుస్తోంది.
ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు చోటు
పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల్లో ఏకంగా 19 మంది ఎమ్మెల్యేలకు కేసీఆర్ అవకాశం కల్పించారు. రాష్ట్ర కమిటీలో కూడా పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలకు చోటు దక్కనుంది. ఎలాంటి వివాదాలు, అభియోగాలు లేని, అంకితభావంతో పూర్తిస్థాయిలో పనిచేస్తూ...నియమిత పదవులను ఆశించని నేతలను తీసుకోనున్నారు. ఆంగ్లం, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారిని ఎంచుకోనున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ కూర్పుపై సీఎం గురువారం కొందరు నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్ర కమిటీ నియామకానికి ముందు అన్ని జిల్లాల మంత్రులతో సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్తో మంత్రులు, తెరాస జిల్లా అధ్యక్షుల భేటీ
ఈనాడు, హైదరాబాద్: తెరాస జిల్లాల కొత్త అధ్యక్షులు గురువారం మంత్రుల నేతృత్వంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్తో ప్రగతిభవన్లో భేటీ అయ్యారు. మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్గౌడ్, శ్రీనివాస్యాదవ్, మహమూద్అలీ, సబితారెడ్డి, మల్లారెడ్డిలతో జిల్లా అధ్యక్షులైన పద్మా దేవేందర్రెడ్డి (మెదక్), చింతా ప్రభాకర్ (సంగారెడ్డి), మెతుకు ఆనంద్ (వికారాబాద్), జీవీ రామకృష్ణారావు (కరీంనగర్), కె.విద్యాసాగర్రావు (జగిత్యాల), కోరుకంటి చందర్ (పెద్దపల్లి), మాగంటి గోపీనాథ్ (హైదరాబాద్), శంభీపూర్ రాజు (మేడ్చల్ మల్కాజ్గిరి), మంచిరెడ్డి కిషన్రెడ్డి (రంగారెడ్డి), కుసుమ జగదీశ్ (ములుగు), పి.సంపత్రెడ్డి (జనగామ), గండ్ర జ్యోతి (జయశంకర్ భూపాలపల్లి), సి.లక్ష్మారెడ్డి (మహబూబ్నగర్), ఎస్.రాజేందర్రెడ్డి (నారాయణపేట). జి.కృష్ణమోహన్రెడ్డి (జోగులాంబ గద్వాల), కోనేరు కోనప్ప (కుమురం భీం అసిఫాబాద్)లు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వారి వెంట ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం