మధు యాస్కీ గౌడ్‌కు సీఎం సహా మంత్రుల పరామర్శ

పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధు యాస్కీ గౌడ్‌ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించారు.

Published : 26 Apr 2024 04:05 IST

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధు యాస్కీ గౌడ్‌ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించారు. మధు యాస్కీ తల్లి అనసూయ ఈ నెల 15న అనారోగ్యంతో మృతిచెందారు. దశదినకర్మ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి హయత్‌నగర్‌లోని మధు యాస్కీ ఇంటికొచ్చారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు ఉన్నారు. పెద్ద అంబర్‌పేటలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన దశదినకర్మకు మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే శంకర్‌, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్‌రెడ్డి, రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి, గీత కార్మిక కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ పల్లె రవికుమార్‌ గౌడ్‌, టూరిజం కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, ఉప్పల్‌, మలక్‌పేట్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జులు పరమేశ్వర్‌రెడ్డి, అక్బర్‌, పీసీసీ అధికార ప్రతినిధి ప్రభాకర్‌రెడ్డి తదితరులు హాజరై నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని