కొక్కొరొకోతో కోట్లు
బీటెక్ పూర్తవగానే ఏదో ఒక సంస్థలో రూ.లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాలని చాలామంది ఇంజినీరింగ్ విద్యార్థులు లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ గోమారం అచ్యుత్రెడ్డి (26) మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు.
సొంత బ్రాండ్తో నాటుకోడి గుడ్లు, మాంసం విక్రయాలు
దళారుల ప్రమేయం లేకుండా ప్రముఖ సంస్థలకు సరఫరా
యువ రైతు విజయ సూత్రం
ఈనాడు - సంగారెడ్డి
అచ్యుత్రెడ్డి ఫాంలో పెంచుతున్న నాటుకోళ్లు
బీటెక్ పూర్తవగానే ఏదో ఒక సంస్థలో రూ.లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాలని చాలామంది ఇంజినీరింగ్ విద్యార్థులు లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ గోమారం అచ్యుత్రెడ్డి (26) మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివిన ఆయన.. నాటుకోళ్ల పెంపకంపై దృష్టి సారించారు. రుచికరమైన, నాణ్యమైన మాంసం, గుడ్లు అందిస్తే వ్యాపారానికి ఢోకా ఉండదని భావించారు. దళారుల చేతికి చిక్కకుండా సొంత బ్రాండ్లతో అమ్మకాలు సాగిస్తూ ఏటా రూ.కోట్ల టర్నోవర్తో విజయపథంలో పయనిస్తున్నారు. నాటుకోళ్ల పెంపకంపై ఇతర రైతులకు సైతం తన వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ ఇస్తూ.. వారికీ గిట్టుబాటు అయ్యేలా చొరవ తీసుకుంటున్నారు.
2015లో మొదలుపెట్టి..
అచ్యుత్రెడ్డి హైదరాబాద్కు సుమారు 40 కి.మీ.ల దూరంలోని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చండీ గ్రామంలో మూడెకరాల్లో 2015లో 5 వేల కోళ్ల పెంపకం మొదలుపెట్టారు. దళారుల ప్రమేయం ఉండొద్దన్న ఉద్దేశంతో సొంతంగా ‘న్యూట్రీఫ్రెష్’, ‘ఎపీక్యూర్’ బ్రాండ్ల పేరుతో గుడ్లు, మాంసం విక్రయాలు ప్రారంభించారు. ప్రచారానికి వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లనూ ఉపయోగించుకున్నారు. బుధ, శుక్ర, ఆదివారాల్లో ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకే తెచ్చి సరఫరా చేస్తారు. మాంసం విక్రయానికి లీషియస్, ఫిపొలా, టెండర్ కట్స్తో పాటు మరో మూడు సంస్థలతో అచ్యుత్రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రతినెలా 1,500 కిలోల మాంసం, దాదాపు 10 లక్షల గుడ్లు సరఫరా చేస్తున్నారు. 250 మంది రైతులతోనూ ఒప్పందం చేసుకున్నారు. వారు సరఫరా చేసే కోళ్ల మాంసాన్ని తన బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నారు.
ప్రాసెసింగ్ చేసిన నాటుకోడి మాంసాన్ని చూపుతున్న అచ్యుత్రెడ్డి
సరైన మార్కెటింగ్ తోనే మంచి రాబడి
* కోళ్ల మార్కెటింగే అత్యంత కీలకం. ఇప్పటికే కోళ్లను పెంచుతున్న రైతుల అనుభవాలను తెలుసుకోవాలి. అవగాహనలేకుండా ప్రారంభిస్తే నష్టాలు తప్పవు.
* 5 వేల నాటుకోళ్లకు షెడ్డు ఏర్పాటు కోసం రూ.6.50 లక్షల నుంచి రూ.7.50 లక్షల ఖర్చవుతుంది. కోళ్లు సహజ వాతావరణంలో బయట తిరిగేందుకు కనీసం ఎకరా నుంచి మూడెకరాల వరకు స్థలం అవసరం.
* ఒక్కో కోడిపిల్ల ధర రూ.20 నుంచి రూ.40 వరకు ఉంటుంది. 5 వేల పిల్లల కొనుగోలుకు, వాటిని 90 నుంచి 100 రోజుల పాటు పెంచేందుకు రూ.9 లక్షల వరకు ఖర్చవుతుంది. అప్పటికి కిలోన్నర బరువు పెరుగుతాయి. దాదాపు 8,500 కిలోల కోళ్లు తయారవుతాయి. మార్కెట్లో కిలో కోడి(లైవ్) రూ.180 చొప్పున అమ్మినా దాదాపు రూ.15 లక్షలు వస్తాయి. రెండో విడత నుంచి పెట్టుబడి తిరిగివచ్చి.. లాభాల ఆర్జన మొదలవుతుందని అచ్యుత్రెడ్డి తెలిపారు.
అందిపుచ్చుకుంటే అవకాశాలెన్నో
- అచ్యుత్రెడ్డి
నాటుకోడి గుడ్లు, మాంసానికి ఉన్న డిమాండ్నే నేను అందిపుచ్చుకున్నా. సొంత బ్రాండ్లతో అమ్మకాలు చేపట్టడం కలిసొచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3 కోట్ల మార్కును దాటాం. ఈసారి రూ.10 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నాం. 30 మందికి ఉపాధి కల్పిస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?