Supreme Court: సుదీర్ఘకాలం సస్పెన్షన్ చెల్లదు
అనుచిత ప్రవర్తన పేరుతో చట్టసభల నుంచి సభ్యులను సుదీర్ఘ కాలం పాటు సస్పెండ్ చేయడం తగదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. వారిపై విధించే చర్య ఆ సమావేశం(సెషన్) వరకే పరిమితం కావాలని తెలిపింది.
చట్టసభల్లో దుష్ప్రవర్తనపై చర్య.. ఆ సెషన్ వరకే
మహారాష్ట్రలో 12 మంది భాజపా ఎమ్మెల్యేల ఏడాది సస్పెన్షన్పై సుప్రీంకోర్టు తీర్పు
దిల్లీ: అనుచిత ప్రవర్తన పేరుతో చట్టసభల నుంచి సభ్యులను సుదీర్ఘ కాలం పాటు సస్పెండ్ చేయడం తగదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. వారిపై విధించే చర్య ఆ సమావేశం(సెషన్) వరకే పరిమితం కావాలని తెలిపింది. సస్పెన్షన్ కాల వ్యవధి.. కొనసాగుతున్న సమావేశం పరిధిని మించితే దాని ప్రభావం ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తంపై పడుతుందని అభిప్రాయపడింది. విపక్ష సభ్యుల సంఖ్యను అప్రజాస్వామిక పద్ధతుల్లో తగ్గించడం అంటే స్వల్ప మెజార్టీ ఉన్న ప్రభుత్వ మనుగడకు అవకాశం కల్పించినట్లేనని పేర్కొంది. మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి తమను ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ 12 మంది భాజపా ఎమ్మెల్యేలు దాఖలు చేసుకున్న పిటిషన్పై ఇచ్చిన తీర్పులో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. శాసనసభ్యుల ఏడాది పాటు సస్పెన్షన్ ... బహిష్కరణ, సభ్యత్వ రద్దు, రాజీనామా కన్నా దారుణమైన చర్యగా జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సి.టి.రవికుమార్ల ధర్మాసనం పేర్కొంది. ‘‘12 మంది ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం చట్టరీత్యా చెల్లదని ప్రకటిస్తున్నాం. 2021 జులైలో వర్షాకాల సమావేశాల్లో చేసిన ఆ తీర్మానంలో పేర్కొన్న సస్పెన్షన్ కాల వ్యవధి ఆ సెషన్ కాల పరిమితిని మించి ఉండడం రాజ్యాంగ వ్యతిరేకం. చట్టవిరుద్ధం. నిర్హేతుకం’’ అని పేర్కొంటూ 90 పేజీల తీర్పును వెలువరించింది. శాసనసభ సభ్యులుగా వారికి లభించే ప్రయోజనాలన్నీ సస్పెన్షన్ కాల వ్యవధిలోనూ పొందటానికి అర్హులుగా పేర్కొంది. సభ్యులపై చర్య తీసుకోవడానికి చట్టసభకు అధికారం ఉన్నప్పటికీ..దానిని సక్రమంగా, క్రమపద్ధతిలో, అంచెలంచెలుగా వినియోగించాలని స్పష్టం చేసింది. సభ్యులను సుదీర్ఘ కాలంపాటు సస్పెండ్ చేస్తూ వెళ్తే విపక్షం సభలో జరిగే చర్చల్లో ప్రభావవంతంగా పాల్గొనలేదని పేర్కొంది. అటువంటి చర్చలకు అర్థం ఉండదని తెలిపింది. చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన అదుపు తప్పుతున్న పరిస్థితులు తరచూ ఎదురవుతున్నాయి. అయితే వారిపై తీసుకునే చర్యలు రాజ్యాంగబద్ధంగా, చట్టప్రకారం, సహేతుకంగా, నియమ నిబంధనల ప్రకారం ఉండాల్సిందేనని విస్పష్టం చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రిసైడింగ్ అధికారితో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ 2021 జులై5న.. 12 మంది భాజపా ఎమ్మెల్యేలను సభ నుంచి ఏడాది పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. దీనిని సవాల్చేస్తూ భాజపా శాసనసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
భాజపా హర్షం
సుప్రీంకోర్టు తీర్పుపై భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, మహారాష్ట్రలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ హర్షం వ్యక్తం చేశారు. సత్యం సాధించిన విజయంగా నడ్డా అభివర్ణించారు. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపెట్టు వంటిదని ఫడణవీస్ పేర్కొన్నారు.
తీర్పు ప్రతి వచ్చాక స్పీకర్ నిర్ణయం..
చట్టసభలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ అన్నారు. కోర్టు అధికారాలకు మధ్య ఒక విభజన రేఖ ఉంటుందని పేర్కొన్నారు. కోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాత శాసనసభ స్పీకర్ దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టసభల అధికారాల్లో కోర్టుల జోక్యం సరికాదని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?