CT Scan: సీటీ.. లేదేమిటి?
కరోనా ఉరుముతున్న వేళ అత్యంత ప్రధాన ఆసుపత్రుల్లోనూ సీటీ స్కానింగ్్ సౌకర్యం లేకపోవడం పెద్దలోటుగా నిలుస్తోంది. పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలు సీటీ స్కాన్ పరికరాలనే అందుబాటులో ఉంచలేదు.
ఈఎన్టీ, ఛాతీ ఆసుపత్రుల్లో అందుబాటులో లేని సీటీ స్కానింగ్
ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కరవైన సౌకర్యం
కొవిడ్, ఫంగస్ వ్యాధుల్లో ఇదే కీలకం
ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి, కోఠి ఈఎన్టీ ఆసుపత్రి, గచ్చిబౌలి టిమ్స్... ఇవన్నీ కరోనా వ్యాధి నేపథ్యంలో అతి ముఖ్యమైన ఆసుపత్రులు. వందలాది మంది రోగులకు ఇక్కడ వైద్యం చేస్తున్నారు. కానీ వీటిలో సీటీ స్కానింగ్ సదుపాయం లేదు.
కరోనా సోకినవారికి ఊపిరితిత్తుల స్కానింగ్ ఎంత ముఖ్యమో తెలిసిందే. పలు రకాల ఇన్ఫెక్షన్లను అంచనా వేయడానికి, శరీరంలో అంతర్గతంగా ఉన్న సమస్యలు తెలుసుకోడానికి ఇది అత్యవసరం. ఇంత ముఖ్యమైన సౌకర్యం లేకపోవడంతో స్కానింగ్ అత్యవసరమైన స్థితిలో రోగులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో 670 పడకలున్నాయి. ప్రస్తుతం 216 పడకల్లో కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. కొవిడ్లోనే కాదు.. ఏ ఛాతీ వ్యాధుల్లోనైనా ఎక్స్రే, సీటీ స్కాన్ అవసరం చాలా ఎక్కువ. అతి ముఖ్యమైన ఆ సౌకర్యం ఇప్పటివరకూ ఇక్కడ లేదు.
ఈనాడు - హైదరాబాద్
కరోనా ఉరుముతున్న వేళ అత్యంత ప్రధాన ఆసుపత్రుల్లోనూ సీటీ స్కానింగ్్ సౌకర్యం లేకపోవడం పెద్దలోటుగా నిలుస్తోంది. పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలు సీటీ స్కాన్ పరికరాలనే అందుబాటులో ఉంచలేదు. ముఖ్యమైన ఆసుపత్రులు, జిల్లా దవాఖానాల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ప్రాంతీయ ఆసుపత్రుల సంగతి సరేసరి. కొవిడ్ నేపధ్యంలో గత ఏడాదిగా స్కానింగ్ అవసరాలు బాగా పెరిగిపోయాయని వైద్యవర్గాలకు కూడా తెలుసు. ఇప్పుడు ఫంగస్ వ్యాధులు కూడా దాడి చేస్తున్నాయి. ఈ సమయంలో సీటీ స్కాన్ చేయించకుండా చికిత్స ముందుకు కదిలే పరిస్థితి లేదు. అయినా సరే ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. నిజానికి ఆ పరికరాల ఖర్చు రూ.వందల కోట్లయ్యేది కూడా కాదు. ఒక్కో యంత్రం విలువ రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్లు ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో నెలకొల్పినా రూ.100 కోట్ల ఖర్చు దాటదు. ప్రభుత్వం కొవిడ్ నియంత్రణలో భాగంగా రూ.వేల కోట్లు ఖర్చుపెట్టడానికి అనుమతులు ఇస్తుంటే.. ఉన్నతాధికారులు మాత్రం అతి ముఖ్యమైన వైద్య పరికరాల కొనుగోలుపై దృష్టిసారించడం లేదు. దీని వల్ల రోగులకు నరకం కనిపిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడకు వెళ్లాలో తెలియక వారు అవస్థలు పడుతున్నారు.
శతకోఠి సమస్యలు...
ఈఎన్టీ వైద్యుడి వద్దకు వచ్చే రోగుల్లో సగం మందికి పైగా సైనస్ సంబంధిత సమస్యల వారే. వీరిలో ఇన్ఫెక్షన్ అంచనా వేయడానికి ఈఎన్టీ వైద్యులు తప్పనిసరిగా సాయం తీసుకునే పరీక్ష సీటీ స్కాన్. దీని ద్వారా ఎంత తీవ్రత ఉంది? ఆపరేషన్ అవసరమా? అనేది నిర్ధారణ చేస్తారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆస్పార్జిల్లస్, మ్యూకర్ మైకోసిస్, క్యాండిడా తదితర ఫంగల్ ఇన్ఫెక్షన్లను అంచనా వేయడానికి కూడా స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంత అత్యవసరమైన సీటీ స్కాన్ యంత్రం కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రిలో లేదు. ఇక్కడ స్కానింగ్ అవసరమైన వారు ప్రైవేటుకు వెళ్లి రూ.వేలు కుమ్మరించడమో.. లేదా ఉస్మానియాకు వెళ్లి రోజుల తరబడి వేచి చూడాల్సి రావడమో.. ఏదో ఒకటి నిర్ణయించుకోవాల్సి వస్తోంది. కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రికి నిత్యం సుమారు 1500 పైగానే ఓపీ ఉంటుంది. ఇంతమందిలో కనీసం 30-40 శాతం మందికి సీటీ స్కాన్ ఆవసరమైనా.. 450-600 మంది అవస్థలు పడాల్సిందే. పైగా ఇక్కడ నిత్యం 20-25 వరకూ ఈఎన్టీ సర్జరీలు జరుగుతుంటాయి. వీరికి సీటీ స్కాన్ అవసరమైనా తిప్పలు తప్పవు.
ఎక్కడ చూసినా...
* నిలోఫర్ ఆసుపత్రిలో సీటీ స్కాన్ యంత్రముంది. కానీ చాన్నాళ్ల క్రితంది కావడంతో పదేపదే మొరాయిస్తోంది. ఇరవై రోజుల క్రితం పాడైన దాన్ని ఇప్పటికీ బాగు చేయించకపోవడంతో ఇక్కడి చిన్నారులకు సీటీ స్కాన్ చేయించాల్సి వస్తే ఉస్మానియాకో, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రికో పంపిస్తున్నారు. ఎంత అత్యవసరమైనా స్కానింగ్ కోసం కనీసం మూడు, నాలుగు రోజులు ఆగాల్సిందే. లేదంటే ప్రైవేటు ల్యాబ్కు పోయి సుమారు రూ.3వేలు చెల్లించి తీయించుకోవాల్సి వస్తోంది.
* దాదాపు 600 మందికి పైగా కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్న టిమ్స్లోనూ సీటీ స్కాన్ సౌకర్యం లేదు. ఎవరికి ఛాతీ ఇన్ఫెక్షన్ తీవ్రమైందని భావించినా.. నిర్ధారించాలంటే అందుబాటులో స్కానింగ్ సౌకర్యం లేకపోవడం తీర్చలేని లోటుగా పరిణమించింది. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో అయితే రెండేళ్లుగా సీటీ స్కాన్ యంత్రం మూలకు పడినా పట్టించుకునే వారే లేరు. దాదాపు అన్ని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఎక్కడా ఈ సౌకర్యం లేకపోవడం శోచనీయమే.
త్వరలో 9 చోట్ల...
రాష్ట్రంలో 9 ఆసుపత్రుల్లో కొత్తగా సీటీ స్కాన్ పరికరాలను నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇటీవలే కొత్తగా సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు. ఇంకా గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, టిమ్స్, నల్గొండ, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల జిల్లా ఆసుపత్రుల్లోనూ అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రణాళికలో అత్యంత ముఖ్యమైన కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రి గానీ, ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి గానీ లేకపోవడం గమనార్హం.
కొవిడ్లోనే కాదు.. ఇతరత్రా కూడా సీటీ కీలకమే
-డాక్టర్ సుమన్చంద్ర, విశ్రాంత ఆచార్యులు, రేడియాలజీ విభాగం, ఉస్మానియా వైద్య కళాశాల
కొవిడ్లోనే కాదు.. ఇంకా అనేక చికిత్సల్లో సీటీ స్కాన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మెదడులో తీవ్రత ఎలా ఉంది అని తెలుసుకోవచ్చు. శరీరంలో కణతులు గుర్తించడానికి కూడా సీటీ స్కాన్ అవసరం. సాధారణ ఛాతీ ఇన్ఫెక్షన్లు, సైనస్లలో కూడా సీటీ స్కాన్ చాలా అవసరం. సాధారణంగా ఛాతీలో గాలితో నిండి ఉంటుంది. అలా కాకుండా రక్తంతో గానీ, నీటితో గానీ నిండితే అప్పుడు వ్యత్యాసం సీటీలో తెలిసిపోతుంది. ఇప్పడు అత్యాధునిక సీటీస్కాన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఒకేసారి ఎక్కువ ప్రాంతాలను గుర్తించడం వల్ల రోగిపై రేడియేషన్ ప్రభావం తక్కువగా పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?