Essentials: సామాన్యుడికి ధరదడ
ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మరోవైపు పెట్రో మంటతో ఇప్పటికే సామాన్య పేద కుటుంబాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. తాజాగా పామాయిల్ ఎగుమతులను నిలిపివేస్తున్నామన్న ఇండోనేసియా ప్రకటనతో వంటనూనెల ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఒకదానికొకటి తోడై అన్నింటి రేట్లు పెరిగి ధరలు ఉత్పాతంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మధ్యతరగతి ప్రజల బతుకు మూలిగేనక్కపై తాటికాయపడిన చందంగా తయారైంది. యుద్ధం కారణంగా నెలన్నర కిందట ఆకాశాన్నంటిన వంటనూనెల
పామాయిల్ ఎగుమతులను నిలిపివేస్తున్నామన్న ఇండోనేసియా
సలసల కాగుతున్న వంట నూనెలు
యుద్ధం నుంచి కోలుకుంటున్న మార్కెట్పై పిడుగు
మరోవైపు పెట్రో మంటతో అంతటా ధరల జ్వాలలు
విలవిల్లాడుతున్న ప్రజలు
ఈనాడు - హైదరాబాద్
ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మరోవైపు పెట్రో మంటతో ఇప్పటికే సామాన్య పేద కుటుంబాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. తాజాగా పామాయిల్ ఎగుమతులను నిలిపివేస్తున్నామన్న ఇండోనేసియా ప్రకటనతో వంటనూనెల ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఒకదానికొకటి తోడై అన్నింటి రేట్లు పెరిగి ధరలు ఉత్పాతంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మధ్యతరగతి ప్రజల బతుకు మూలిగేనక్కపై తాటికాయపడిన చందంగా తయారైంది. యుద్ధం కారణంగా నెలన్నర కిందట ఆకాశాన్నంటిన వంటనూనెల ధరలు పక్షం రోజుల నుంచి కొంత తగ్గుతూ వచ్చాయి. తాజాగా ఈ నెల 28 నుంచి పామాయిల్ ఎగుమతులు నిలిపివేస్తున్నట్లు ఇండోనేసియా ప్రకటించడంతో నూనెల ధరలు మళ్లీ రాజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టోకు వ్యాపారులు పామాయిల్ విక్రయాలను నిలిపివేశారు. ఈ ప్రభావం అన్ని వంటనూనెల ధరలపై నేరుగా పడింది. వారం క్రితం లీటరు పామాయిల్ ధర రూ.140కి చేరగా ఇప్పుడు రూ.150.. రేపో, మాపో రూ.160 అయ్యే అవకాశం ఉంది. ‘విజయ’ బ్రాండు పొద్దుతిరుగుడు నూనె లీటరు ధర గత నెల ఒకటిన రూ.167 కాగా తాజాగా రైతుబజార్లలో (రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య - ఆయిల్ఫెడ్) రూ.190కి చేరింది. చిల్లర మార్కెట్లలో ఇప్పటికే లీటరు రూ.200కి అమ్ముతున్నారు. తెలంగాణలో వినియోగించే వంటనూనెల్లో పామాయిల్ అమ్మకాలే 60 శాతానికి పైగా ఉండటంతో దాని ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉంది.
రవాణా వ్యయం మంటతో...
* ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరల మంట కారణంగా వంటనూనెలు, కూరగాయలు, పప్పులు, ఇతర నిత్యావసరాల ధరలన్నీ పెరుగుతున్నాయని హైదరాబాద్లోని మలక్పేట మార్కెట్కు చెందిన టోకు వ్యాపారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు. గత ఏడాది వ్యవధిలో పెట్రోలు ధర లీటరుకు రూ.25కు పైగా, డీజిల్ ధర రూ. 17కు పైగా పెరగడంతో అదే నిష్పత్తిలో లారీలు, వ్యాన్ల యజమానులు రవాణా ఛార్జీలు పెంచేశారని ఆయన చెప్పారు.
* ఉల్లిగడ్డలు రోజూ మహారాష్ట్రలోని నాసిక్ నుంచి హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని అనేక మార్కెట్లకు వస్తుంటాయి. ఈ ఏడాది వ్యవధిలో లారీలోడు కిరాయి గత ఏడాది కన్నా రూ.3-4 వేలు అదనంగా పెంచేశారని ఆయన తెలిపారు. హైదరాబాద్పండ్ల మార్కెట్ను కొత్తపేట నుంచి నగరశివారులోని బాటసింగారానికి తరలించారు. ఇక్కడ పండ్లు కొన్న చిల్లర వ్యాపారులు చందానగర్, లింగంపల్లి, కొంపల్లి వంటి ప్రాంతాలకు రానుపోను 100-120 కిలోమీటర్ల రవాణా వ్యయం భరించాల్సి వస్తుండడంతో.. ఆ మేర పండ్ల ధరలను పెంచేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కిలో మామిడికాయలు రూ.100, అమెరికన్ నల్లద్రాక్షలను రూ.150కి పైగా విక్రయిస్తున్నారు. మలక్పేట టోకు మార్కెట్ నుంచి తిరిగి తెలంగాణ జిల్లాల్లోని మార్కెట్లకు వెళ్లడానికి కిరాయిలు మరింతఅదనం. దీంతో పప్పులు, వంటనూనెలు, కూరగాయలు ..ఇలా అన్ని ధరలు పెరుగుతున్నాయి.
* ఆటో, క్యాబ్ కిరాయిలు కూడా ఒక తడవకు రూ.20-40 దాకా పెంచేశారు. ‘ఇంతకుముందు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి కూకట్పల్లికి రూ.150 కిరాయికి వెళ్లేవాళ్లం. ఇప్పుడు రూ.200-220 దాకా వసూలు చేస్తున్న’ట్లు ఆటోడ్రైవర్ రమేశ్ చెప్పారు.
* సరిగ్గా ఏడాది క్రితం 2021 ఏప్రిల్ 24న లీటరు పెట్రోలు ధర రూ.94.13 ఉంటే ఇప్పుడు రూ.119.49కి చేరింది. ఇలాగే డీజిల్ ధర రూ.88.18 నుంచి 105.49కి చేరింది.
* గత ఏడాది ఇదే సమయంలో కందిపప్పు, మినప్పప్పు, సెనగపప్పు వంటి వాటి ధర కిలో రూ.100-140 ఉంటే ఇప్పుడు ప్రాంతాలను బట్టి రూ.120-160 దాకా వసూలు చేస్తున్నారు.
* దేశంలో మినుముల దిగుబడి బాగా తగ్గినందున ఏడాదికాలంలో మినపగుండ్లు, మినప్పప్పు ధర చిల్లర మార్కెట్లో కిలోకు రూ.20-30 దాకా పెంచేశారు.
* పెట్రో ధరల పెరుగుదల వల్ల క్యాబ్లో వెళ్లే సమయంలో ఏసీ ఆన్ చేయడం లేదని, ఎవరైనా ఏసీ అడిగితే కిరాయిపై అదనంగా రూ.10-20 వసూలు చేస్తున్నట్లు క్యాబ్ డ్రైవర్ యాసీన్ తెలిపారు.
నలుగురు సభ్యులున్న సామాన్య కుటుంబానికి సగటున నెలకు అదనపు ఖర్చు.. (అంచనాలు రూపాయల్లో)
వంటనూనె : 150
పప్పులు : 75
కూరగాయలు: 100
ఆటో, క్యాబ్ లేదా పెట్రోలు: 300
ఇతర నిత్యావసరాలు: 300
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?