తమిళనాడులో అన్ని మందులూ ఉచితమే
తమిళనాడులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు 100 శాతం మందులను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తోంది. మందుల లేవనే కారణంతో బయటకు రాసే పరిస్థితి అక్కడ ఉత్పన్నం కావడం లేదు. ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్క ఔషధాన్నీ బయటకు రాయరు
అక్కడ మందుల బడ్జెట్ రూ.1,200 కోట్లు
వైద్య కార్పొరేషన్కు ఎప్పుడూ అందుబాటులో రూ.200-300 కోట్లు
తెలంగాణలోనూ ఇదే విధానం అనుసరణీయం
ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న రాష్ట్ర ఆరోగ్యశాఖ
ఈనాడు, హైదరాబాద్: తమిళనాడులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు 100 శాతం మందులను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తోంది. మందుల లేవనే కారణంతో బయటకు రాసే పరిస్థితి అక్కడ ఉత్పన్నం కావడం లేదు. ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనూ ప్రైవేట్ ఔషధ దుకాణాలుండవు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలుకొని 3,500 పడకల సామర్థ్యమున్న మద్రాస్ మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రిలోనూ ఇదే విధానం అవలంబిస్తున్నారు. అక్కడ ఔషధాల కొనుగోలుకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నారు. అక్కడి వైద్య కార్పొరేషన్ వద్ద మందుల కొనుగోలుకు ఎప్పుడూ కనీసం రూ.200-300 కోట్లు అందుబాటులో ఉంటాయి. దీనికోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. అంటే ప్రతిసారీ బడ్జెట్ విడుదల ఉత్తర్వులు ఇవ్వడం, వాటి మంజూరు కోసం వేచిచూడడం వంటి సమస్యలు ఉండవు. నిధుల కోసం దరఖాస్తు సమర్పించగానే నేరుగా ట్రెజరీ నుంచి కార్పొరేషన్కు విడుదలవుతాయి. ఏళ్లుగా ఈ విధానం కొనసాగుతోంది. కొవిడ్కు ముందు తమిళనాడులో మందుల బడ్జెట్ రూ.650 కోట్ల వరకూ ఉండగా.. ప్రస్తుతం అది రెట్టింపైంది. ఏటా రూ.1,200 కోట్లను మందుల కొనుగోలుకు కేటాయిస్తున్నారు. తెలంగాణలో ఈ బడ్జెట్ రూ.500 కోట్లు. ఇది కొవిడ్కు ముందు రూ.250 కోట్లుండేది. ఔషధాల కొనుగోలు, నిల్వల్లో తమిళనాడు విధానం అనుసరణీయమని తెలంగాణ వైద్యారోగ్యశాఖ భావిస్తోంది. ఇటీవల తమిళనాడులో పర్యటించిన వైద్యశాఖ బృందం.. ఈ అంశంపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
మందుల వినియోగంపై పక్కా సమాచారం
ప్రతినెలా ఆన్లైన్ విధానంలో ఏయే మందులు ఎక్కువగా వినియోగమవుతున్నాయో.. వాటి నిల్వలు ఎంతున్నాయో తమిళనాడులో పక్కాగా తెలిసిపోతుంది. ఈ సమాచారాన్ని బట్టి ఔషధాల కొనుగోలుకు ఆదేశాలిస్తారు. కనీసం 3 నెలల నిల్వలుంటాయి. గత పదేళ్లుగా ఎక్కువగా వినియోగమవుతున్న మందుల సమాచారం అక్కడి వైద్య కార్పొరేషన్ వద్ద ఉంది. 95 శాతం ఔషధాలను కార్పొరేషన్ ద్వారా, 5 శాతం స్థానికంగా ఆసుపత్రి సూపరింటెండెంట్లు కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలో 80 శాతం వైద్య కార్పొరేషన్ ద్వారా, 20 శాతం స్థానికంగా ఆసుపత్రి సూపరింటెండెంట్లు కొనుగోలు చేసే విధానం అమలవుతోంది. అయితే, స్థానికంగా ఆసుపత్రుల్లో ఔషధాల కొనుగోలు నామమాత్రంగా సాగుతోంది. అత్యవసరమైనవీ కొనకపోవడంతో రోగులే సొంతంగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. మన రాష్ట్రంలో కనీసం 3 నెలల నిల్వ విధానం అమల్లో లేదు. ఎక్కువ మొత్తంలో కొనాలన్నా.. వైద్యుడు ముందస్తుగా కోరిన దానికంటే 10 శాతానికి మించకూడదనే నిబంధన అమల్లో ఉంది. ఏయే ఔషధాలు ఎక్కువగా వినియోగమవుతున్నాయనే ఆన్లైన్ సమాచారం తెలంగాణలో ఇప్పటివరకూ లేదు. దీంతో అంచనా వేయడం కష్టమవుతోందని వైద్యవర్గాలు చెబుతున్నాయి.
వేగంగా సర్దుబాటు చేసేలా..
కొన్ని రకాల మందులు ఒక ఆసుపత్రిలో ఎక్కువగా, మరికొన్ని ఆసుపత్రుల్లో తక్కువగా వినియోగమవుతుంటే.. వాటిని ఒక చోటు నుంచి మరో చోటుకు సర్దుబాటు చేసే వ్యవస్థ తమిళనాడులో వేగంగా పనిచేస్తోంది. ఇక్కడా అలాంటి వ్యవస్థను పక్కాగా అమలు చేయాలని తెలంగాణ ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దీనిపై వైద్యులతో అధికారులు భేటీ అయ్యారు. తమిళనాడు ఔషధాల జాబితాతో మన దగ్గర ఉన్న మందుల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇకనుంచి ఏ ఒక్క ఔషధమూ లేదనే సమస్య ఉత్పన్నం కావద్దనీ, తమిళనాడు జాబితాలో ఉన్నవాటితో పాటు.. కొత్త రకాల ఔషధాలు కావాలన్నా జాబితాలో పొందుపర్చాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది. ఔషధ జాబితాలో ఏమేం మందులున్నాయో వైద్యులకు తెలిసేలా స్పెషాలిటీల వారీగా పుస్తక రూపంలో ముద్రించి ఇవ్వాలని నిర్ణయించారు. తమిళనాడు వైద్య కార్పొరేషన్లో 580 మంది ఉద్యోగులు ఉండగా.. తెలంగాణలో 130 మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ‘ఆసుపత్రికి ఇంత శాతం మందులు’ అని కోటా విధానాన్ని అమలుచేస్తున్నారు. దీన్ని ఎత్తివేసి.. ఎంత మొత్తంలో అవసరమైతే అంత మొత్తం ఇవ్వాలని తెలంగాణ వైద్యారోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్