Presidential Election: అట్టహాసంగా ద్రౌపది నామినేషన్
ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము శుక్రవారం అట్టహాసంగా నామినేషన్దాఖలు చేశారు. మధ్యాహ్నం 12.39 గంటలకు ప్రధాని చేతులమీదుగా ఆమె పత్రాలను రిటర్నింగ్ అధికారి (రాజ్యసభ సెక్రటరీ జనరల్) పి.సి.మోదీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల
రాష్ట్రపతి ఎన్నికకు పత్రాల సమర్పణ
ప్రతిపాదించిన ప్రధాని మోదీ
బలపరిచిన కేంద్ర మంత్రులు
ఈనాడు, దిల్లీ: ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము శుక్రవారం అట్టహాసంగా నామినేషన్దాఖలు చేశారు. మధ్యాహ్నం 12.39 గంటలకు ప్రధాని చేతులమీదుగా ఆమె పత్రాలను రిటర్నింగ్ అధికారి (రాజ్యసభ సెక్రటరీ జనరల్) పి.సి.మోదీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఈ ఎన్నికను కూటమి ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నామినేషన్ల సమయంలోనే ప్రత్యర్థులకు తన సంఖ్యాబలాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా పార్లమెంటు ప్రాంగణం సందడిగా మారింది.
దిల్లీలోని ఒడిశా భవన్లో బస చేసిన ద్రౌపది.. ఉదయం అక్కడి నుంచి పార్లమెంటుకు బయలుదేరడానికి ముందు ప్రతిపక్ష నేతలు సోనియా గాంధీ, మమతా బెనర్జీ, శరద్ పవార్లకు ఫోన్చేసి తనకు మద్దతు ఇవ్వాలని, నామినేషన్ కార్యక్రమంలోనూ పాలుపంచుకోవాలని కోరారు. అనంతరం పార్లమెంటు భవనానికి వచ్చి మహాత్మా గాంధీ, అంబేడ్కర్, బిర్సా ముండా విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి పార్లమెంటు లైబ్రరీ భవనానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఇతర ముఖ్యనేతలు వెంట వచ్చారు. అప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను సిద్ధం చేసి ఉంచారు. వీటిపై ప్రతిపాదకులు, సమర్థకులతో కలిసి 500 మందికిపైగా ప్రజాప్రతినిధులు సంతకాలు చేశారు.
* మొదటి సెట్పై ప్రధానమంత్రి తొలి సంతకం చేసి ఆమె పేరును ప్రతిపాదించగా, రాజ్నాథ్ సింగ్ రెండో సంతకం చేసి బలపరిచారు. తర్వాత కేంద్ర మంత్రులంతా ప్రతిపాదకులు, సమర్థకుల జాబితాలో సంతకాలు చేశారు.
* రెండో సెట్లో భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా తొలి సంతకం చేయగా, భాజపా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సంతకాలు చేశారు.
* మూడో సెట్పై హరియాణా, హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రులు తొలి, మలి సంతకాలు చేయగా, ఆ రాష్ట్రాల ఎంపీలు, శాసనసభ్యులు మిగతా సంతకాలు చేశారు.
* నాలుగో సెట్పై గుజరాత్ సీఎం, ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీలు, శాసనసభ్యులు సంతకాలు చేశారు.
ర్యాలీగా..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యాహ్నం 12.09 గంటలకు పార్లమెంటు లైబ్రరీ భవనానికి వచ్చి ద్రౌపదితో భేటీ అయ్యారు. 12.30 గంటలకు అందరూ ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి, నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేడీ, జేడీయూ, అన్నా డీఎంకే, వైకాపా నేతలు పాలుపంచుకున్నారు. 2017లో రామ్నాథ్ కోవింద్ నామినేషన్ కార్యక్రమంలో భాజపా అగ్రనేతలు ఆడ్వాణీ, మురళీమనోహర్ జోషీ పాల్గొనగా ఈసారి వారు కనిపించలేదు. జులై 18లోపు ఓటర్లందర్నీ కలిసి మద్దతు కోరుతానని ద్రౌపది ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వైకాపా నేతల సంతకాలు
ద్రౌపదీ ముర్ము నామినేషన్ పత్రాలపై వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, లోక్సభ ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి సంతకాలు చేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో వీరితోపాటు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్కూడా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భాజపా తరఫున ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు పాలుపంచుకున్నారు.
* ద్రౌపదీ ముర్ము నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ (ఉత్తర్ప్రదేశ్), శివరాజ్సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), బసవరాజ్ బొమ్మై (కర్ణాటక), భూపేంద్ర పటేల్ (గుజరాత్), హిమంత బిశ్వశర్మ (అస్సాం), పుష్కర్సింగ్ధామి (ఉత్తరాఖండ్), జయరాం ఠాకూర్ (హిమాచల్ప్రదేశ్), మనోహర్లాల్ కట్టర్ (హరియాణా), పెమా ఖండూ (అరుణాచల్ ప్రదేశ్), ప్రమోద్ సావంత్ (గోవా), బీరేన్ సింగ్ (మణిపుర్), కర్నాడ్ సంగ్మా (మేఘాలయ)లు నామపత్రాలపై సంతకాలు చేశారు.
60%కిపైగా ఓట్లు వస్తాయని మంత్రుల ధీమా
రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు 60%కిపైగా ఓట్లు వస్తాయని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. ఎన్డీయే మిత్రపక్షాలతోపాటు, బయటినుంచి బీజేడీ, వైకాపా, ఇతర పార్టీలూ మద్దతిస్తున్న నేపథ్యంలో ఈ మైలురాయిని దాటడం ఖాయమన్నారు. దేశంలో తొలిసారి గిరిజన మహిళను అత్యున్నత రాష్ట్రపతి పదవికి పోటీకి నిలబెట్టిన నేపథ్యంలో విభిన్న పార్టీల్లోని బలహీనవర్గాల ఎంపీలూ ఆమెకు మద్దతిచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఎన్నిక రహస్య ఓటింగ్ ప్రాతిపదికన జరగనున్నందున వారు తమ మనస్సాక్షి ప్రకారం ఓటేసే వీలుందన్నారు. ముర్ముకు మద్దతివ్వాలంటూ భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా శుక్రవారం విపక్ష పార్టీలకు చెందిన మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌధురి, మాజీ ప్రధాని, జేడీఎస్ నేత దేవెగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా తదితరులకు ఫోన్లో విజ్ఞప్తి చేశారు.
ముర్ముకు నివాస గృహం కేటాయింపు
ద్రౌపదీ ముర్ముకు తాత్కాలిక ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం దిల్లీలోని పండిత్ ఉమాశంకర్ దీక్షిత్ మార్గ్లోని 4వ నంబర్ ఇల్లు కేటాయించింది. ప్రస్తుతం ఒడిశా భవన్లో ఉంటున్న ఆమె ఎన్నికయ్యేంతవరకూ ఈ ఇంట్లో ఉండటానికి అవకాశం కల్పించారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా.. అదే నెల 21న ఫలితం వెలువడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?