సెల్ఫోన్తో కరెంటు బిల్లు!
మీ ఇంట్లో వాడిన కరెంటుకు మీరే బిల్లు తీసుకోవచ్చు.. వెంటనే ఆన్లైన్లో చెల్లించనూవచ్చు.. ఆ సౌకర్యం ఉందని తెలుసా? మీ సెల్ఫోన్తో మీ
తెలంగాణ వ్యాప్తంగా అమలుకు డిస్కంల యోచన
ఈనాడు, హైదరాబాద్ - భగత్నగర్ (కరీంనగర్), న్యూస్టుడే: మీ ఇంట్లో వాడిన కరెంటుకు మీరే బిల్లు తీసుకోవచ్చు.. వెంటనే ఆన్లైన్లో చెల్లించనూవచ్చు.. ఆ సౌకర్యం ఉందని తెలుసా? మీ సెల్ఫోన్తో మీ ఇంటి విద్యుత్ మీటరు రీడింగ్ను ఫొటో తీస్తే ఎన్ని యూనిట్లు వినియోగించారో తెలుస్తుంది. నెల పూర్తయితే బిల్లు కూడా వస్తుంది. నెలకోసారి బిల్లు కోసం మీటర్ రీడింగ్ ఫొటో తీసుకోవడమే కాక, ఏ రోజైనా మీటరును ఫొటో తీస్తే అప్పటివరకూ ఆ నెలలో ఎన్నిరోజులకు ఎన్ని యూనిట్లు కరెంటు వాడారు, నెల పూర్తవడానికి ఇంకా ఎన్ని రోజులుంది, అప్పటివరకూ మీ బిల్లు ఎంత రావచ్చనేది ఏరోజైనా తెలుసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కసరత్తు చేస్తున్నాయి. తొలుత హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో కరోనా లాక్డౌన్ సమయంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇప్పటివరకూ 10లక్షల మంది ఇలా సెల్ఫోన్ కెమెరాతో వారి ఇంట్లో కరెంటు మీటర్ రీడింగ్ను ఫొటో తీసి బిల్లు చెల్లించారు. నేటికీ చాలామందికి దీనిపై పూర్తిగా అవగాహన లేనట్లు చెప్పారు. గత జనవరిలో నాంపల్లి ఎగ్జిబిషన్లో ఈ విధానంపై అవగాహన కల్పించడానికి స్టాల్ ఏర్పాటుచేస్తే వేలమంది ఆసక్తి చూపారు.
యాప్ నిక్షిప్తం ఇలా..
స్మార్ట్ఫోన్లో ‘గూగుల్ ప్లే స్టోర్’లోకి వెళ్లి తొలుత మీరు ఏ డిస్కం పరిధిలో ఉంటే దాని యాప్ను డౌన్లోడు చేసుకోవాలి. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణకు ‘టి.ఎస్.ఎన్.పి.డి.సి.ఎల్, దక్షిణ తెలంగాణకు టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్’ అనే డిస్కంల యాప్లున్నాయి. వీటిలో ఏదో ఒక ప్రాంతంలో మీ ఇంటి లేదా దుకాణం, పరిశ్రమ కరెంటు కనెక్షన్ ఉంటుంది. డిస్కం యాప్ డౌన్లోడ్ అయ్యాక, మళ్లీ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్లి ‘భారత్ స్మార్ట్ సర్వీసెస్’ అనే యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ను ఓపెన్ చేసి ‘సెల్ఫ్ బిల్లింగ్’ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అందులో రాష్ట్రం అనేచోట తెలంగాణ, డిస్కం అనే చోట మీ కనెక్షన్ ఉన్న టి.ఎస్.ఎన్.పి.డి.సి.ఎల్. లేదా టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్.’ ఎంపిక చేసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్లో నల్లా నీటి కనెక్షన్ బిల్లు కోసమైతే ‘హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ’ అనేది ఎంపిక చేసుకోవాలి. ఆ తరవాత మీ కరెంటు కనెక్షన్ ‘యు.ఎస్.సి. లేదా నీటి కనెక్షన్కు అయితే సీఏఎన్ నెంబరును నమోదు చేయాలి. అక్కడ వినియోగదారుడి వివరాలు ప్రత్యక్షమవుతాయి. అప్పుడు మీటరు రీడింగ్ ఫొటో తీయాలి. అది సరిగా రాకపోతే రీడింగ్ అంకెలను నేరుగా నమోదు చేస్తే బిల్లు ఆన్లైన్లో కనిపిస్తుంది. బిల్లు డౌన్లోడు చేసుకుని ఆన్లైన్లో పేమెంట్ ఆప్షన్లోకి వెళ్లి చెల్లిస్తే సరిపోతుంది.
ముందు తీయకుండా ...
కరెంటు బిల్లు కచ్చితంగా 30 రోజుల తరవాతే తీసుకోవాలి. సొంతంగా ఫొటో తీసేవారు అంతకన్నా 2, 3 రోజుల ముందు బిల్లు తీసి చెల్లిస్తే.. 30 రోజులయ్యాక డిస్కం సిబ్బంది వచ్చి మళ్లీ బిల్లు తీసి ఇస్తున్నారు. దీనివల్ల ఒకే నెలకు రెండు బిల్లులు వస్తున్నాయి. ఈ సమస్య రాకుండా సెల్ఫోన్తో కరెంటు మీటరు రీడింగ్ ఫొటో తీసినప్పుడు కచ్చితంగా 30 రోజులు పూర్తయితేనే బిల్లు కనిపించేలా సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నామని దక్షిణ డిస్కం సీఎండీ జి.రఘుమారెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు. ఇది పూర్తయ్యాక, సాఫ్ట్వేర్లో మార్పులు చేశాక అందరికీ సెల్ఫ్బిల్లింగుపై అవగాహన కల్పిస్తామన్నారు. అది పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాక వినియోగదారులకు రాయితీ ఇచ్చే అంశంపైనా నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు.
టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో..
విద్యుత్తు బిల్లును సెల్ఫోన్లోని యాప్ సాయంతో సొంతంగానే తీసుకునే ప్రక్రియ టి.ఎస్.ఎన్.పి.డి.సి.ఎల్. పరిధిలో 2020 ఏప్రిల్లో మొదలైంది. కరోనా లాక్డౌన్ కాలంలో సుమారు రెండు లక్షల మంది అక్కడ ఆ సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు అధికారులు చెప్పారు. ప్రతినెలా ఆ సదుపాయాన్ని కొత్తగా వినియోగించుకుంటున్న వారి సంఖ్య 1500-2000 మధ్య నమోదవుతున్నట్లు వివరించారు. 10 కిలోవాట్లలోపు విద్యుత్తు సామర్థ్యం ఉన్న వినియోగదారుడు మీటర్ రీడింగ్ను స్మార్ట్ఫోన్లో తీసుకునే అవకాశాన్ని విద్యుత్తు సంస్థ కల్పించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?