Telangana Police: టార్గెట్ 60..!
సమాజంలో గుర్తింపున్న ఉద్యోగం.. ఆరంభంలోనే ఆకర్షణీయ వేతనం.. యూనిఫాం కొలువు కావడంతో యువతలో క్రేజ్.. ఈ కారణాలే పోలీస్ కొలువుల పట్ల మక్కువను పెంచేలా చేశాయి. అందుకే 554 ఎస్సై పోస్టులకు
పోలీస్ ప్రాథమిక రాతపరీక్షలో 30 శాతంతోనే అర్హత
నెగెటివ్ మార్కులతో జాగ్రత్త అంటున్న టీఎస్ఎల్పీఆర్బీ
రేపు ప్రిలిమినరీ పరీక్ష
ఈనాడు, హైదరాబాద్: సమాజంలో గుర్తింపున్న ఉద్యోగం.. ఆరంభంలోనే ఆకర్షణీయ వేతనం.. యూనిఫాం కొలువు కావడంతో యువతలో క్రేజ్.. ఈ కారణాలే పోలీస్ కొలువుల పట్ల మక్కువను పెంచేలా చేశాయి. అందుకే 554 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే ఏకంగా 2,47,217 దరఖాస్తులు వచ్చిపడ్డాయి. అంటే..ప్రతి పోస్టుకు 446 మంది పోటీలో ఉన్నట్లు లెక్క. ఇలాంటి ఉద్యోగాల్లో కీలకమైన ప్రాథమిక రాత పరీక్ష ఈనెల 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. సంబంధిత ఏర్పాట్లను రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో పరీక్షపరంగా అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మండలి సూచనలు చేసింది.
తొలిసారి అర్హత మార్కుల కుదింపు
ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించే మార్కులను తొలిసారిగా కుదించారు. క్రితంసారి పరీక్షల్లో సామాజిక వర్గాలవారీగా ఈ మార్కులుండేవి. ఈసారి సామాజికవర్గాలతో సంబంధం లేకుండా అందరికీ 30శాతం మార్కులనే అర్హతగా పరిగణించనున్నారు. ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్ విధానంలో 200 ప్రశ్నలుంటాయి. వీటిలో 30శాతం మార్కులు సాధిస్తే పరీక్ష గట్టెక్కినట్లే. అంటే 60 ప్రశ్నలకు సరైన సమాధానాల్ని గుర్తించగలిగితే చాలు.
మార్కుల బెంగ వద్దు.. వడపోత మాత్రమే..
సాధారణంగా పరీక్ష అనగానే ఎక్కువ మార్కులు సాధించాలనే ఆతృత ఉంటుంది. ప్రస్తుత పోలీస్ ప్రాథమిక రాతపరీక్ష అందుకు భిన్నం. ఇది వడపోత ప్రక్రియ మాత్రమే. దరఖాస్తుదారుల ప్రాథమిక స్థాయి పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు ఉద్దేశించింది. ఈ మార్కుల్ని తుది ఫలితాల్లో పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. అందుకే ఎక్కువ మార్కులు సాధించాలన్న ఒత్తిడి అవసరం లేదని మండలివర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవంక.. ఈ పరీక్షలో తప్పుడు సమాధానాలకు నెగెటివ్ మార్కులుండటం కీలకంగా మారింది. 5 తప్పుడు సమాధానాలు రాస్తే ఒక మార్కు కోత విధించనున్నారు. అందుకే తొలుత సరైన సమాధానాలు తెలిసిన ప్రశ్నలపైనే దృష్టిపెట్టాలి. పరీక్షలో 60 సరైన జవాబులను పక్కాగా గుర్తించగలిగితే గట్టెక్కిపోవచ్చు.తెలియని ప్రశ్నలకూ సమాధానాలు రాస్తే నెగెటివ్ మార్కులతో మొదటికే మోసం రావచ్చు. తుది రాతపరీక్షలో మాత్రం నెగెటివ్ మార్కులుండవు.
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
నారాయణగూడ, న్యూస్టుడే: ఈనెల ఏడోతేదీన జరిగే పోలీసు రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, సూచనలను పోలీసు విభాగం శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 9 గంటలలోపే చేరుకోవాల న్నారు. 10 గంటలకు గేట్లు మూసివేస్తారని, నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు. బ్యాగులు, సెల్ఫోన్లు, చేతి గడియారాలు, కాలిక్యులేటర్ తదితరాలు వెంట ఉండకూడదన్నారు. అభ్యర్థులు తమ వెంట హాల్టికెట్, పెన్ మాత్రమే తీసుకురావాలన్నారు. హాల్టికెట్పై వివరాలన్నీ సరిచూసుకొని పాస్పోర్టు సైజ్ ఫొటో అతికించాలని, లేనిపక్షంలో పరీక్షకు అనుమతి ఉండదని తెలిపారు. మెహందీ, టాటూ వేసుకోవద్దన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?