జేఎన్టీయూహెచ్ కళాశాలలకు ‘స్వయంప్రతిపత్తి’ ఎత్తివేత!
జేఎన్టీయూహెచ్ ప్రాంగణంలోని ఇంజినీరింగ్ కళాశాల, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఎస్టీ)కి యూజీసీ స్వయంప్రతిపత్తి హోదాను ఎత్తివేయాలని ఆ విశ్వవిద్యాలయం భావిస్తోంది. దీనివల్ల ఆ కళాశాలలు వర్సిటీలో
వర్సిటీకి న్యాక్ గ్రేడ్ పెంచుకోవడమే లక్ష్యం
వ్యతిరేకిస్తున్న ఆచార్యులు
ఈనాడు, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ ప్రాంగణంలోని ఇంజినీరింగ్ కళాశాల, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఎస్టీ)కి యూజీసీ స్వయంప్రతిపత్తి హోదాను ఎత్తివేయాలని ఆ విశ్వవిద్యాలయం భావిస్తోంది. దీనివల్ల ఆ కళాశాలలు వర్సిటీలో కలిసి, విశ్వవిద్యాలయానికి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గ్రేడ్ పెరుగుతుందన్నది జేఎన్టీయూహెచ్ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి ఆలోచన. ప్రస్తుతం జేఎన్టీయూహెచ్కు న్యాక్ ‘ఏ’ గ్రేడ్ ఉండగా.. దాన్ని ‘ఏ-ప్లస్’కు తీసుకురావాలని యోచిస్తున్నారు. అటానమస్గా ఉన్న రెండు కళాశాలలు వర్సిటీలో భాగమైతేనే ‘ఏ-ప్లస్’ గ్రేడ్ సాధ్యమవుతుందని భావిస్తున్నారు. ఈ విషయమై ఆచార్యుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇటీవల నిర్వహించిన సమావేశంలో కొందరు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఉన్నత విద్యాసంస్థలు స్వయంప్రతిపత్తిగా మారాలని యూజీసీ, నూతన జాతీయ విద్యావిధానం నిర్దేశిస్తుంటే.. ఇక్కడ అందుకు భిన్నంగా ఎందుకు వెళ్తున్నారని కొందరు సీనియర్ ఆచార్యులు ప్రశ్నిస్తున్నారు. స్వయంప్రతిపత్తి హోదా లేకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావన్నది మరో అభ్యంతరం. విశ్వవిద్యాలయం హోదా పెరిగితే దాని పరిధిలోని కళాశాలలకు కూడా మంచి పేరు వస్తుందని, వర్సిటీ కళాశాలలు అటానమస్గా మారితే వర్సిటీకి న్యాక్ గ్రేడ్ తగ్గి, ప్రతిష్ఠ దిగజారుతుందని వర్సిటీ డైరెక్టర్ ఒకరు చెప్పారు. ఆచార్యులు మాత్రం.. దీనిపై ఇతర వర్సిటీల అధికారులతో కమిటీ వేసి తుది నిర్ణయానికి రావాలని కోరుతున్నారు.
ఇంజినీరింగ్ కళాశాలలో ఎస్ఐటీ విలీనం
* వర్సిటీ ప్రాంగణంలో రెండు దశాబ్దాల క్రితం నెలకొల్పిన స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎస్ఐటీ)ని యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో విలీనం చేస్తూ విశ్వవిద్యాలయం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఐఎస్టీని, అందులోని కోర్సులను ఐటీ విభాగం పరిధిలో చేర్చారు.
* ప్రాంగణంలోని ఐఎస్టీని.. యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేట్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(యూపీజీసీఎస్టీ)గా పేరు మార్చారు. ఇంజినీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న ఎమ్మెస్సీ భౌతిక, రసాయన శాస్త్రాలు, గణితం కోర్సులు ఈ కొత్త కళాశాల పరిధిలోకే వస్తాయి.
* ఎంబీఏ కోర్సులకు ప్రత్యేక విభాగంగా ఉన్న స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్(ఎస్ఎంఎస్)ను.. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ హైదరాబాద్ (యూసీఎంహెచ్)గా పేరు మార్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ పసికందు చనిపోయింది
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!