NEET Counselling 2023: పాత విధానంలోనే ఎంబీబీఎస్ కౌన్సెలింగ్
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ ఏడాది పాత విధానంలోనే కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు జాతీయ వైద్యమండలి (ఎన్ఎంసీ) స్పష్టతను ఇచ్చింది.
ఆలిండియా కోటా మొదటి రౌండ్ తర్వాతే ఇక్కడ కౌన్సెలింగ్
రికార్డు స్థాయిలో 23 వేలమంది రిజిస్ట్రేషన్
బీ, సీ కేటగిరీ సీట్ల ఫీజు పెంచేందుకు ప్రతిపాదన
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ ఏడాది పాత విధానంలోనే కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు జాతీయ వైద్యమండలి (ఎన్ఎంసీ) స్పష్టతను ఇచ్చింది. 2023-24 విద్యాసంవత్సరానికి నీట్-యూజీలో అర్హత సాధించిన విద్యార్థులకు ఆలిండియా కోటా సీట్ల భర్తీకి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) మొదటి రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత రాష్ట్రాల వైద్య విశ్వవిద్యాలయాలు మొదటి రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నాయి. ఈ ఏడాది దేశంలోని అన్ని రాష్ట్రాల కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఎంసీసీనే కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రతిపాదించగా తెలంగాణ, తమిళనాడు సహా మరికొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ ఏకకాలంలో పూర్తిచేసే నేపథ్యంలోనే ఆలిండియా కోటా సీట్లకు ఎంసీసీ, కన్వీనర్ కోటా సీట్లకు రాష్ట్రాలు ఏకకాలంలో కౌన్సెలింగ్ నిర్వహించేలా ఎన్ఎంసీ ప్రతిపాదించగా రాష్ట్రాలు దీనికి అంగీకరించాయి. తాజాగా ఈ ప్రతిపాదనను ఎంసీసీ విరమించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆలిండియా కోటా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ (నర్సింగ్) సీట్ల భర్తీకి షెడ్యూలును విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంసీసీ మొదటి రౌండ్ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టనుంది. ఆలిండియా కోటా సీట్ల భర్తీకి మొదటి రౌండ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 6వ తేదీ నాటికి పూర్తికానుంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మొదటి రౌండ్ కౌన్సెలింగ్ తేదీలను నిర్ణయించనున్నారు.
వెల్లువెత్తిన దరఖాస్తులు: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో చేరేందుకు రికార్డు స్థాయిలో నీట్-యూజీలో అర్హత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రం నుంచి అర్హత సాధించిన 44,629 మందిలో 23వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరి ధ్రువపత్రాల పరిశీలనను కాళోజీ విశ్వవిద్యాలయం ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం 3790 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా వీటిలో ఆలిండియా కోటా 15 శాతం సీట్లు మినహాయిస్తే మిగిలిన 3221 ఎంబీబీఎస్ సీట్లకు, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 50 శాతం కన్వీనర్ కోటా కింద మరో 2325 సీట్లకు కలిపి మొత్తం 5546 సీట్లకు కాళోజీ విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్ నిర్వహించనుంది.
ఫీజులను ఖరారు చేయనున్న వైద్య, ఆరోగ్య శాఖ
2023-24 నుంచి 2025-26 విద్యాసంవత్సరం వరకు ఫీజులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఎంబీబీఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సులు సహా వివిధ కోర్సులకు ఫీజుల పెంపునకు ప్రైవేటు కళాశాలల నుంచి ప్రతిపాదనలు తీసుకుంది. కళాశాలల ప్రతిపాదనలను పరిశీలించి టీఏఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. వీటిపై రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. కాళోజీ ఆరోగ్యవిశ్వవిద్యాలయం మొదటి రౌండ్ కౌన్సెలింగ్కు ప్రకటన జారీ చేసేలోపు ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. ప్రైవేటు కాలేజీల ఫీజుల పెంపు ప్రతిపాదనలపై అధ్యయనం చేసిన టీఎఎఫ్ఆర్సీ కన్వీనర్ కోటా ఫీజు ప్రస్తుతం ఏడాదికి రూ.60 వేలు ఉండగా ఇది యథాతథంగా ఉంచాలని ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. బీ, సీ కేటగిరీ సీట్ల ఫీజు మాత్రం 2 శాతం నుంచి 3 శాతం దాకా పెంచేందుకు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ ప్రకారం ‘బి’ కేటగిరి సీట్ల ఫీజు రూ.20 వేల నుంచి రూ.30 వేల పెంపునకు... ‘సి’ కేటగిరి సీట్ల ఫీజు రూ.30 వేలనుంచి రూ.40 వేల మేరకు పెంచాలని ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిపై రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ తుది నిర్ణయం తీసుకుని జీవోను ఇవ్వాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట