యాగ్జిలరీ పదోన్నతులపై ఆరా
పోలీసు శాఖలో ప్రణీత్రావు వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయన మాదిరిగానే యాగ్జిలరీ పదోన్నతులు పొందిన వారి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ప్రణీత్రావు ఉదంతం నేపథ్యంలో అధికారుల దృష్టి
ఈనాడు, హైదరాబాద్: పోలీసు శాఖలో ప్రణీత్రావు వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయన మాదిరిగానే యాగ్జిలరీ పదోన్నతులు పొందిన వారి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రణీత్రావు పేరు వెలుగులోకి రాగా.. అదే సమయంలో ఆయన యాగ్జిలరీ పదోన్నతి అంశం కూడా బయటకు పొక్కింది. ఆయనతోపాటు మరికొందరికీ ఇలానే పదోన్నతులు ఇచ్చిన విషయం వెలుగుచూడటం చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా పదోన్నతుల వ్యవహారంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పనితీరు పేరుతో సీనియార్టీతో సంబంధం లేకుండా కొందరికి వెంటవెంటనే పదోన్నతులు ఇవ్వడంపై ఉమ్మడి ఏపీలోనే అనేక మంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇలాంటి ప్రమోషన్లపై న్యాయస్థానం కూడా అభ్యంతరం వ్యక్తంచేసింది. తాజాగా ప్రణీత్రావు ఉదంతం నేపథ్యంలో యాగ్జిలరీ పదోన్నతులు పొందిన వారందరి వివరాలు వెలికి తీస్తున్నారు.
వామపక్ష తీవ్రవాదం ఎక్కువగా ఉన్న రోజుల్లో దానికి అడ్డుకట్ట వేసేందుకు సిబ్బందిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఉమ్మడి ఏపీ పోలీసు శాఖ యాగ్జిలరీ పదోన్నతులకు శ్రీకారం చుట్టింది. క్రమంగా మావోయిస్టుల ప్రభావం బాగా తగ్గిపోవడంతో ఈ పదోన్నతుల అంశమూ తెరమరుగైంది. అయితే, ప్రభుత్వ అండదండలు ఉన్న వారికి మాత్రం అడపాదడపా ఈ తరహా పదోన్నతులు వస్తూనే ఉన్నాయి. ప్రణీత్రావు ఉదంతమే ఇందుకు నిదర్శనం. మావోయిస్టులపై నిఘా పెట్టే పేరుతో సమకూర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకులకు చెందిన ఫోన్లు ఎడాపెడా ట్యాప్ చేశారన్నది ఆయనపై ఉన్న అభియోగం. ఈ పనిచేసినందుకే ఆయనకు యాగ్జిలరీ పదోన్నతి ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అలానే ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అద్భుతంగా పనిచేశారని రికార్డుల్లో చూపుతూ ఓ అదనపు ఎస్పీ స్థాయి అధికారికి నాన్క్యాడర్ ఎస్పీగా పదోన్నతి ఇచ్చారన్నది మరో ఆరోపణ. ఈ అధికారికి కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండేవని.. ఆ కారణంతోనే పదోన్నతి ఇచ్చారు తప్ప ఆయన పనితీరుతో కాదనే అభిప్రాయం పోలీసు శాఖలో వ్యక్తమవుతోంది. ప్రణీత్రావు ఉదంతం నేపథ్యంలో యాగ్జిలరీ పదోన్నతులు అక్రమమంటూ ఇప్పటికే అనేక మంది పోలీసులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. దాంతో ఉన్నతాధికారులు విచారణ మొదలుపెట్టారు. గత పదేళ్లలో ఎవరెవరు యాగ్జిలరీ పదోన్నతులు తీసుకున్నారు.. ఇందుకు వారికి ఉన్న అర్హత ఏమిటన్న వివరాలపై ఆరా తీస్తున్నారు. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు.
నిందితుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులను ఐదురోజుల కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ నిమిత్తం అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావులను కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరారు. కస్టడీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయడానికి నిందితుల తరఫు న్యాయవాదులు సమయం కోరగా.. కోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట