వికసిత్ భారత్ను వర్సిటీలు సాకారం చేయాలి
ఉన్నత విద్యారంగంలో సవాళ్లను అధిగమించేందుకు భారతీయ విశ్వవిద్యాలయాలు ప్రణాళికలు సిద్ధం చేయాలని, వికసిత్ భారత్ను సాకారం చేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ సూచించారు.
ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
ఈనాడు, హైదరాబాద్- శామీర్పేట్, న్యూస్టుడే: ఉన్నత విద్యారంగంలో సవాళ్లను అధిగమించేందుకు భారతీయ విశ్వవిద్యాలయాలు ప్రణాళికలు సిద్ధం చేయాలని, వికసిత్ భారత్ను సాకారం చేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ సూచించారు. భారతీయ వర్సిటీల సంఘం (ఏఐయూ) 98వ వార్షిక సదస్సు ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో సోమవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేటలోని లియోనియా రిసార్ట్స్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘ఉన్నత విద్యలో సాధించిన ప్రగతి- భవిష్యత్తులో సాధించాల్సిన అభివృద్ధి’పై నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ సదస్సులో రాధాకృష్ణన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విద్యారంగం అన్నివిధాలా అభివృద్ధి సాధించేలా ఉపకులపతులు కృషి చేయాలని సూచించారు. విద్యారంగంలో వస్తున్న పెనుమార్పులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. దేశంలోని యువత ప్రతిభను ప్రోత్సహించాల్సిన బాధ్యత వర్సిటీలదేనని సూచించారు. స్వామి వివేకానంద, అబ్దుల్కలాం సూచించిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ ఆధ్వర్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 5వ స్థానానికి చేరిందని, రాబోయే రోజుల్లో మొదటి స్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఛైర్మన్ టీజీ సీతారాం, ఏఐయూ అధ్యక్షుడు జి.డి.శర్మ, ఉపాధ్యక్షుడు వినయ్కుమార్ పాఠక్, కార్యదర్శి పంకజ్ మిత్తల్, ఇక్ఫాయ్ వర్సిటీ ఉపకులపతి ఎల్.ఎస్.గణేశ్, విశ్రాంత ఉపకులపతి మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్’ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్కు నోటీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు దిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. -
955 టీఎంసీలు అవసరం
కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తమ అవసరం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా, తెలంగాణ 954.9గా తెలిపింది. -
ఉదయం 11 గంటలకు పది ఫలితాలు
రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు వెల్లడికానున్నాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్లోని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలోని ఆడిటోరియంలో ఫలితాలను విడుదల చేస్తారు. -
పకడ్బందీగా టీఎస్ఈఏపీసెట్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈఏపీసెట్-2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. -
40 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలి
తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2023 జులై ఒకటి నుంచి రావాల్సిన 2వ పీఆర్సీ 40 శాతం ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(టీయూఎంహెచ్ఈయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!