సంక్షిప్త వార్తలు (4)
కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నట్లు బోర్డు మెంబర్ సెక్రటరీ డీఎం రాయిపురే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సమాచారం పంపారు.
22న కృష్ణా బోర్డు సమావేశం
ఈనాడు, హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నట్లు బోర్డు మెంబర్ సెక్రటరీ డీఎం రాయిపురే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సమాచారం పంపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బోర్డుకు సంబంధించిన బడ్జెట్పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్న ఈ సమావేశంలో బోర్డు ఛైర్మన్ శివ్నందన్ కుమార్, తెలంగాణ నీటిపారుదల కార్యదర్శి, ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి పాల్గొననున్నారు.
కులగణన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టాలి
సీఎం రేవంత్కు ఆర్.కృష్ణయ్య లేఖ
బషీర్బాగ్, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే ముందు కులగణన చేపట్టి బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాసినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 22 శాతానికి తగ్గించడంతో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని ప్రకటించిందని, ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ సైతం కులగణన చేపట్టి జనాభా ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లను 50 శాతం పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వాటిని నెరవేర్చిన తరువాతే ఎన్నికలకు వెళ్లాలని కోరారు.
‘ఆటా’ మహాసభలకు మంత్రి కోమటిరెడ్డికి ఆహ్వానం
హైదరాబాద్, న్యూస్టుడే: అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) ద్వైవార్షిక మహాసభలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఆహ్వానం అందింది. ఆటా కన్వీనర్ పాశం కిరణ్రెడ్డి సోమవారం మంత్రిని నగరంలోని ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు ఆహ్వాన లేఖ అందించారు. కాగా జూన్ 7 నుంచి 9 వరకు అమెరికా అట్లాంటాలోని ‘జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్’లో ‘ఆటా’ కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్ జరగనున్నాయి.
ఏపీలో పట్టుబడిన సొత్తు రూ.125.96 కోట్లు
ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా వెల్లడి
ఈనాడు, అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో మొత్తం రూ.125.96 కోట్లు పట్టుబడినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. ఇందులో రూ.32.15 కోట్ల నగదు, రూ.19.72 కోట్ల విలువైన మద్యం, రూ.4.06 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.57.14 కోట్ల విలువైన ప్రెషస్ మెటల్స్, రూ.12.89 కోట్ల విలువైన ఇతర వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్కు నోటీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు దిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. -
955 టీఎంసీలు అవసరం
కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తమ అవసరం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా, తెలంగాణ 954.9గా తెలిపింది. -
ఉదయం 11 గంటలకు పది ఫలితాలు
రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు వెల్లడికానున్నాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్లోని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలోని ఆడిటోరియంలో ఫలితాలను విడుదల చేస్తారు. -
పకడ్బందీగా టీఎస్ఈఏపీసెట్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈఏపీసెట్-2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. -
40 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలి
తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2023 జులై ఒకటి నుంచి రావాల్సిన 2వ పీఆర్సీ 40 శాతం ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(టీయూఎంహెచ్ఈయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!