నల్గొండ, ఖమ్మం గరంగరం
ఖమ్మం నగరం నిప్పుల కుంపటిలా మారింది. ఇక్కడ మంగళ, బుధవారాల్లో వడగాలులు వీచాయి. బుధవారం సాధారణం కన్నా ఏకంగా 6 డిగ్రీలు పెరిగి 43.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
8 జిల్లాల్లో 44.3 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత
పిడుగుపాటుతో ఒకరు, వడదెబ్బకు మరొకరు మృతి
ఈనాడు, హైదరాబాద్, ఖానాపూర్ గ్రామీణం, మార్కండేయకాలనీ(గోదావరిఖని), న్యూస్టుడే: ఖమ్మం నగరం నిప్పుల కుంపటిలా మారింది. ఇక్కడ మంగళ, బుధవారాల్లో వడగాలులు వీచాయి. బుధవారం సాధారణం కన్నా ఏకంగా 6 డిగ్రీలు పెరిగి 43.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. నల్గొండ జిల్లా నిడమనూరు రాష్ట్రంలోనే అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతతో అల్లాడింది. 8 జిల్లాల్లో 44.3 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురు, శుక్రవారాల్లోనూ పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సింగాపూర్ తండాలో బుధవారం సాయంత్రం రామెల లక్ష్మి(51) పొలంలో చెట్టు కింద కూర్చొని ఉండగా పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఎన్టీపీసీ జంగాలపల్లికి చెందిన మేకల రవికుమార్(32) మంగళవారం గేదెలు మేపేందుకు వెళ్లి వడదెబ్బకు గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై ఇంట్లోనే మృతిచెందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్కు నోటీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు దిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. -
955 టీఎంసీలు అవసరం
కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తమ అవసరం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా, తెలంగాణ 954.9గా తెలిపింది. -
ఉదయం 11 గంటలకు పది ఫలితాలు
రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు వెల్లడికానున్నాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్లోని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలోని ఆడిటోరియంలో ఫలితాలను విడుదల చేస్తారు. -
పకడ్బందీగా టీఎస్ఈఏపీసెట్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈఏపీసెట్-2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. -
40 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలి
తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2023 జులై ఒకటి నుంచి రావాల్సిన 2వ పీఆర్సీ 40 శాతం ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(టీయూఎంహెచ్ఈయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!