Ramanujacharyulu: దివ్య క్షేత్రం.. భవ్య యాగం
ఆధ్మాత్మికపరులకు చూడ కనులు చాలవన్నంత మహాద్భుత ఘట్టం.. నేటి తరానికి తెలియని మహత్తర క్రతువు.. సహస్ర కుండాత్మక శ్రీలక్ష్మీనారాయణ మహాయజ్ఞం గురువారం ఉదయం శాస్త్రోక్తంగా ఆరంభమైంది. ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో భగవద్రామానుజ సహస్రాబ్ది సమారోహం సందర్భంగా ఈ యాగాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.
శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం ఆరంభం
ఆధ్యాత్మికత ఉట్టిపడుతున్న శ్రీరామనగరం
ఈనాడు, హైదరాబాద్: ఆధ్మాత్మికపరులకు చూడ కనులు చాలవన్నంత మహాద్భుత ఘట్టం.. నేటి తరానికి తెలియని మహత్తర క్రతువు.. సహస్ర కుండాత్మక శ్రీలక్ష్మీనారాయణ మహాయజ్ఞం గురువారం ఉదయం శాస్త్రోక్తంగా ఆరంభమైంది. ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో భగవద్రామానుజ సహస్రాబ్ది సమారోహం సందర్భంగా ఈ యాగాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. దేశవిదేశాల నుంచి వచ్చిన అయిదువేల మంది రుత్విజులు నాలుగు వేదాల్లోని 9 శాఖల మంత్ర హవన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఓం నమో నారాయణాయ, జై శ్రీమన్నారాయణ నామస్మరణతో యాగప్రాంగణాలు మార్మోగాయి. దేశవిదేశాల నుంచి దాదాపు 30 వేల మంది భక్తులు వేడుకలకు విచ్చేశారు.
అగ్నిమథనంతో ఆరంభం..
తొలుత ఉదయం పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం అరణి మథనంతో క్రతువు ప్రారంభమైంది. ప్రధాన యాగశాలలో త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి సహా దేశంలోని వివిధ ప్రాంతాలు, నేపాల్ నుంచి విచ్చేసిన 9 మంది జీయర్ స్వాముల పర్యవేక్షణలో వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా అగ్నిహోత్ర ఘట్టాన్ని ఆరంభించారు. మంగళ వాయిద్యాల నడుమ శమీ, రావి కర్రలను మథించి బాలాగ్ని పుట్టించారు. దీంతో అగ్నిహోత్రం తయారు చేసి, తొలుత ప్రధాన యాగశాలలో పశ్చిమాన ఉన్న కుండాన్ని వెలిగించారు. ఇందుకు ప్రత్యేకంగా ఆవుపేడతో తయారు చేసిన సమిధలను వినియోగించారు. మొత్తం 114 యాగశాలల్లోని 1035 కుండాలను వెలిగించి శ్రీలక్ష్మీనారాయణ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ఒక్కొక్క కుండం వద్ద ఇద్దరు లేదా ముగ్గురు రుత్విజులు హోమాలు నిర్వహిస్తున్నారు. క్రతువును యజ్ఞశాలల నిర్వాహకులు శ్రీనివాసాచార్య, మాధవాచార్య బృందం పర్యవేక్షిస్తున్నారు.
రెండు దఫాలుగా..
రోజూ హోమాలు రెండు విడతలుగా జరుగుతాయి. మహిళా వాలంటీర్లు యాగశాలలను అందమైన రంగవల్లికలతో అలంకరించారు. ప్రతి కుండం వద్ద జరిగే యాగానికి రోజుకు ఆరు కిలోల స్వచ్ఛమైన నెయ్యి వినియోగిస్తారు.
ఘనంగా సుదర్శనేష్టి
వేదమంత్రోచ్చారణలతో శ్రీరామనగరం మార్మోగుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు యాగశాలలు, ప్రవచన మండపాల్లో పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి. యాగశాలల ప్రాంతాన్ని ప్రత్యేక ఆలయంగా పరిగణిస్తూ పూజా క్రతువులు నిర్వహిస్తున్నారు. ప్రధాన యాగశాలలో పెరుమాళ్ కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ప్రవచన మండపంలో చినజీయర్ స్వామి చేతుల మీదుగా పెదజీయర్ స్వామి అష్టోత్తర శతనామపూజ నిర్వహించారు. దాదాపు 300 మంది భక్తులు పాల్గొన్నారు. ఇష్టిశాలలో దుష్ట నివారణకు శ్రీ సుదర్శనేష్టి, సర్వాభీష్టసిద్ధికి శ్రీ వాసుదేవేష్టి నిర్వహించారు. సాయంత్రం అగ్ని ఆరాధన చేశారు.
6న ఏపీ సీఎం జగన్ రాక
శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకలకు ఈ నెల 6న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచ్చేయనున్నట్లు నిర్వాహకులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని జగన్ సందర్శిస్తారని, లక్ష్మీనారాయణ మహాయాగ క్రతువులో పాల్గొంటారని పేర్కొన్నారు.
నాలుగు దిక్కుల్లో నాలుగు పేర్లతో మండపాలు: చిన జీయర్ స్వామి
యాగశాలలను నాలుగు భాగాలుగా విభజించినట్లు చినజీయర్ స్వామి తెలిపారు. ఉదయం హోమాల ప్రారంభం సందర్భంగా ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగించారు. శ్రీరంగ క్షేత్రానికి సూచికగా భోగ మండపం, తిరుమలకు పుష్ప మండపం, కాంచీపురానికి త్యాగమండపం, మేల్కొటె క్షేత్రానికి జ్ఞాన మండపంగా పేర్లు నిర్ణయించినట్లు వివరించారు. ఈ నాలుగు క్షేత్రాలతో రామానుజాచార్యులకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. యాగాల సందర్భంగా భక్తులందరూ భగవన్నామస్మరణపైనే దృష్టి పెట్టాలన్నారు. దేవుడిని భయంతో కాకుండా భక్తితో కొలవాలన్నారు.
9 అంకెతో ముడిపడి: సమతా స్ఫూర్తి కేంద్రం ప్రాజెక్టు ఆరంభం నుంచి అన్ని అంశాలు 9 అంకెతో ముడిపడి ఉన్నాయి. విగ్రహం ఎత్తు నుంచి దివ్య దేశాల నిర్మాణం వరకు అన్నిటికీ 9 అంకె వచ్చేలా రూపకల్పన చేశారు. అనూహ్యంగా అగ్ని మథనం క్రతువు సైతం అదే అంకెతో ముడిపడింది. కచ్చితంగా 9 నిమిషాలపాటు మథించిన తర్వాత అగ్ని పుట్టింది.ఈ విషయాన్ని స్వయంగా చిన జీయర్ స్వామి ప్రకటించారు.
సమతా స్ఫూర్తి కేంద్రానికి ప్రపంచ ఖ్యాతి
- ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష
శంషాబాద్, రాజేంద్రనగర్, న్యూస్టుడే: భవిష్యత్తులో సమతాస్ఫూర్తి కేంద్రం ప్రపంచంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు యావత్ దేశానికే గర్వకారణమన్నారు. ముచ్చింతల్లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో గురువారం ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. సమతామూర్తి విగ్రహం వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. గంట మండపంలో భారీ గంటను మోగించారు. అనంతరం ఓమ్నీ మ్యాక్స్ థియేటర్కు చేరుకుని రామానుజాచార్యులపై రూపొందించిన వీడియోను తిలకించారు. అక్కడి నుంచి యాగశాలలకు చేరుకోగా.. పండితులు వేదమంత్రోచ్చారణ మధ్య ఆహ్వానం పలికారు. పెరుమాళ్ను దర్శించుకుని సీఎం పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. త్రిదండి చిన జీయర్స్వామి కృషి, పట్టుదలతో సమతామూర్తి కేంద్రం రూపుదిద్దుకుందని చెప్పారు. రామానుజాచార్య ప్రబోధించిన సమతా సిద్ధాంతానికి వారధిలా చిన జీయర్ స్వామి ముందుకు తీసుకెళుతున్నారన్నారు. ఇక్కడి నుంచి రామానుజాచార్య శాంతి సందేశం యావత్ ప్రపంచానికీ చేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. చినజీయర్ స్వామి వెంట అందరం కార్యకర్తల్లా నడుద్దామన్నారు. సమతామూర్తి కేంద్రం తెలంగాణకు, ప్రత్యేకించి హైదరాబాద్కు వరంగా భావిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, మనవడు హిమాన్షు, ఎంపీ సంతోష్కుమార్, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర్రావు, ఏపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, రోజా తదితరులు ఉన్నారు. సీఎం పర్యటన రెండు గంటలకు పైగా సాగింది. అంతకుముందు మంత్రి హరీశ్రావు క్షేత్రాన్ని సందర్శించారు.
శ్రీరామనగరంలో నేటి కార్యక్రమాలు
* శుక్రవారం ఉదయం 6.30 నుంచి 7.30 వరకు అష్టాక్షరీ మహామంత్ర జపం.
* 8.30 గంటలకు హోమాలు.
* మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్ణాహుతి.
* సాయంత్రం 5 గంటలకు మరోమారు హోమాలు.
* ఇష్టిశాలల వద్ద శ్రీ లక్ష్మీనారాయణేష్టి, వైనతేయేష్టి నిర్వహిస్తారు.
* ప్రవచన మండపంలో లక్ష్మీనారాయణ అష్టోత్తరశతనామ పూజ, ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
* ఉదయం 10.30కు భద్రాచల ప్రధాన అర్చకులు గుడిమెళ్ల మురళీకృష్ణమాచార్య ప్రవచనాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్