Afghanistan: దురాక్రమణను ఇక సహించం.. పాకిస్థాన్కు తాలిబన్ల హెచ్చరిక
తమ ప్రాంతంపై దురాక్రమణలకు పాల్పడితే సహించేది లేదని అఫ్గాన్లోని తాలిబన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
సరిహద్దులో వైమానిక దాడులపై స్పందించిన అఫ్గానిస్థాన్
కాబుల్: తమ ప్రాంతంపై దురాక్రమణలకు పాల్పడితే సహించేది లేదని అఫ్గాన్ తాలిబన్లు పాక్ను హెచ్చరించారు. ముఖ్యంగా సరిహద్దు దేశం నుంచి జరిగినట్లు భావిస్తోన్న వైమానిక దాడిని తీవ్రంగా ఆక్షేపించింది. అఫ్గాన్లోని కునార్, ఖోస్ట్ ప్రావిన్సుల్లో వైమానిక దాడుల కారణంగా పదుల సంఖ్యలో పౌరుల మరణానికి పాకిస్థాన్ దాడులే కారణమని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. అయితే, ఈ దాడుల్లో తమ పాత్ర ఉందంటూ వస్తోన్న ఆరోపణలను ధ్రువీకరించని పాకిస్థాన్.. రెండు దేశాలు మిత్రదేశాలంటూ హితవు పలికింది.
‘మా పొరుగు దేశంతో పాటు యావత్ ప్రపంచం నుంచి సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంటూనే ఉన్నాం. ఇందుకు తాజాగా కునార్ ప్రావిన్సులో జరిగిన దురాక్రమణే స్పష్టమైన ఉదాహరణ. అయితే, ఇటువంటి దండయాత్రలను సహించలేం. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ దాడిని మాత్రం సహించాం. మరోసారి ఇటువంటి ప్రయత్నం జరిగితే సహించే ప్రసక్తే లేదు’ అని అఫ్గాన్ రక్షణ మంత్రిగా వ్యవహరిస్తోన్న ముల్లా మొహమ్మద్ యాకూబ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్కు పరోక్ష హెచ్చరిక చేశారు. ఇదే విషయంపై మాట్లాడిన పాకిస్థాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి.. శాంతి పరిరక్షణలో అఫ్గాన్తో దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
అఫ్గాన్లోని కునార్, ఖోస్త్ ప్రావిన్సుల్లో ఏప్రిల్ 16న వైమానిక దాడులు జరిగాయి. పాకిస్థానీ సైనిక హెలికాప్టర్ జరిపిన ఈ ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాలిబన్ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో 20 మంది చిన్నారులు మరణించినట్లు ఐరాస కూడా పేర్కొంది. ఇందుకు పాకిస్థాన్ సైన్యమే కారణమని అఫ్గాన్ ఆరోపిస్తోంది.
ఇదిలాఉంటే, గతేడాది ఆగస్టులో అఫ్గాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు వరుస సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వారి ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు ఇంకా గుర్తించలేదు. మరోవైపు పాకిస్థాన్తో సరిహద్దు విషయంలోనూ ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సరిహద్దు వెంబడి పాకిస్థాన్ దాడులను ముమ్మరం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
India-Maldives: భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాన్ని సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. -
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా వేగానికి చెక్ రిపబ్లిక్ కోర్టు బ్రేకులు వేసింది. -
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
Sunita Williams: సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర వాయిదా పడింది. రాకెట్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. -
నేడు రోదసిలోకి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. -
అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెల్ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్.. రఫాపై దాడి ఖాయమని టెల్ అవీవ్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది. -
ట్రంప్నకు వెయ్యి డాలర్ల జరిమానా
హష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకుగాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. -
రష్యా నుంచి రాయబారిని వెనక్కు పిలిచిన జర్మనీ
రష్యాలోని తమ రాయబారి అలెగ్జాండర్ లాంబ్సడార్ఫ్ను వారం రోజలు పాటు వెనక్కు పిలిపించినట్లు జర్మనీ సోమవారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
-
పవన్ను గెలిపించండి.. అన్నయ్యగా అండగా ఉంటాడు: చిరంజీవి
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు