Brain Implant: కలల నియంత్రణకు స్వయంగా బ్రెయిన్లో ‘చిప్’.. చివరకు చావు అంచులకు..!
కలల నియంత్రణ కోసం ఓ వ్యక్తి సొంతగా ఆపరేషన్ చేసుకుని మెదడు వద్ద చిప్ను అమర్చుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే తీవ్ర రక్తస్రావం కాగా, చివరకు ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: కలలను నియంత్రించాలనే లక్ష్యంతో ఓ వ్యక్తి చేసిన ప్రమాదకర పని.. అతడిని చావు అంచులకు తీసుకెళ్లింది. డ్రిల్లింగ్ యంత్రం సాయంతో తన తలకు తానే రంధ్రం చేసుకుని.. మెదడు వద్ద చిప్ అమర్చుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే తీవ్ర రక్తస్రావానికి గురైన అతడిని ఆస్పత్రిలో చేర్చడంతో చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానిక వార్తాసంస్థల వివరాల ప్రకారం.. కజకిస్థాన్కు చెందిన మిఖాయిల్ రాదుగా(40) అనే వ్యక్తి తన కలలను నియంత్రించాలని భావించాడు. ఈ క్రమంలోనే ఇంటర్నెట్లో సమాచారం సేకరించడంతోపాటు న్యూరో సర్జరీల వీడియోలు చూశాడు.
ఇటీవల ఓ డ్రిల్లింగ్ మిషన్ కొనుక్కొని.. తనపై తాను ప్రయోగం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇంట్లోనే ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే స్వయంగా కపాలానికి రంధ్రం చేసుకున్నాడు. ఆపై ఎలక్ట్రోడ్ చిప్ను అమర్చుకున్నాడు. అయితే, నాలుగు గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్లో భాగంగా అతడికి తీవ్ర రక్తస్రావం అయింది. దాదాపు లీటర్ రక్తం కోల్పోవడంతో అది కాస్త ప్రాణాల మీదికి వచ్చింది. చివరకు ఆస్పత్రిలో చేర్చడంతో బతికి బయటపడ్డాడు. తాను చేసిన ప్రయత్నానికి సంబంధించిన ఫొటోలను అతడు ట్విటర్ వేదికగా పోస్ట్ చేశాడు.
మనిషి మెదడులో చిప్.. న్యూరాలింక్ ప్రయోగాలకు గ్రీన్సిగ్నల్
‘మెదడుపై స్వయంగా ఎలక్ట్రోడ్ ఇంప్లాంటేషన్ చేశాను. తద్వారా మెదడులోని ఓ భాగంలో ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ నిర్వహించాను. కలలు కనేటప్పుడు మెదడు ఉద్దీపనను పరీక్షించడానికి ఇది అవసరం. ఇటువంటి ప్రయోగం చరిత్రలో ఇదే మొదటిసారి’ అని అతడు పేర్కొనడం గమనార్హం. ఈ ప్రయోగ ఫలితాలు.. కలల నియంత్రణ సాంకేతికతలకు అవకాశాల ద్వారాలను తెరుస్తాయని చెప్పాడు. వాస్తవానికి ఈ శస్త్రచికిత్స కోసం మొదట్లో న్యూరో సర్జన్లను సంప్రదించాలని భావించినా.. వారిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉండటంతో స్వయంగా చేసుకున్నట్లు వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రష్యా, ఉక్రెయిన్ పరస్పర దాడులు
రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. దీనివల్ల పలుచోట్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. తమ దేశంలోకి వచ్చిన 57 డ్రోన్లు, పలు క్షిపణులను కూల్చేశామని రష్యా ప్రకటించింది. -
ఆకాశంలో రాకాసి ఉల్క
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ ఉల్క భూమిపై పడింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి లోనై నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది. -
రోదసిలోకి తెలుగుతేజం
తెలుగు తేజం గోపీచంద్ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. -
అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది! ఆయన సురక్షితంగా ఉన్నదీ లేనిదీ అంతుచిక్కకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..