Australia: మొన్న కమ్యూనికేషన్లు.. నేడు ఓడరేవులు.. ఆస్ట్రేలియాపై భారీ సైబర్ దాడి
ఆస్ట్రేలియాలో సైబర్ దాడుల తీవ్రత పెరుగుతోంది. తాజాగా ఆ దేశ రెండో అతిపెద్ద పోర్టు ఆపరేటర్ డీపీ గ్లోబల్ ఆస్ట్రేలియా విభాగం ఇప్పుడు హ్యాకర్లకు లక్ష్యంగా మారింది. ఫలితంగా అక్కడ ఇంటర్నెట్ సేవలను దాదాపు మూడు రోజులు పూర్తిగా నిలిపేశారు. తాజాగా వాటిని పునరుద్ధరించారు.
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియాలోని అతిపెద్ద పోర్టు ఆపరేటర్ సైబర్ దాడికి గురైంది. దీంతో ఈ సంస్థ వెబ్సైట్లు కొన్ని రోజులపాటు మూతపడ్డాయి. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆధికారులు ధ్రువీకరించారు. ఆస్ట్రేలియా ఎగుమతులు, దిగుమతుల్లో 40శాతం సరుకుల సముద్ర రవాణాను డీపీ వరల్డ్ ఆస్ట్రేలియా సంస్థ చూసుకుంటుంది. దుబాయ్కు చెందిన డీపీ వరల్డ్కు ఇది అనుబంధ సంస్థ. ఇది దేశ ప్రధాన పోర్టుల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తోంది. దీని ఆధీనంలో మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బన్, పెర్త్, ఫ్రెమాంట్లె వంటి ప్రధాన పోర్టుల టెర్మినళ్లు ఉన్నాయి.
రక్షణ కవచాలుగా పౌరులు,ఆసుపత్రులు.. హమాస్ తీరును ఖండించిన ఈయూ
డీపీ వరల్డ్ ఆస్ట్రేలియా సైబర్ దాడికి గురైన విషయం శుక్రవారం బయటపడింది. దీంతో సరుకు ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం పడినట్లు సమాచారం. ఫలితంగా పలు భారీ నౌకలు అన్లోడింగ్ కాకుండానే తీరంలో నిలిచిపోయాయి. దీంతో తమ ఉద్యోగులు, కస్టమర్లు, నెట్వర్క్ల వ్యవస్థను సంరక్షించడానికి చర్యలు తీసుకొన్నామని ఆ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా కీలక నెట్వర్క్ల నుంచి ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేశామని తెలిపింది. ఫలితంగా చాలా వ్యవస్థలు సాధారణ స్థాయిలో పనిచేయలేదు. కొద్ది సేపటి క్రితం డీపీ వరల్డ్ సంస్థ అన్ని వెబ్సైట్లు ఆన్లైన్లోకి వచ్చాయి.
ఈ పరిస్థితిపై సంస్థ ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ డారెన్ గోల్డీ మాట్లాడుతూ ‘‘ఆ సంస్థ వేగంగా దాడి నుంచి కోలుకుంటోంది. తన వెబ్సైట్లను వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితి కొన్ని రోజులు మాత్రమే ఉండొచ్చని తెలుస్తోంది’’ అని వెల్లడించారు. ఇక నిందితులను ప్రభుత్వం గుర్తించలేదని ఆయన వెల్లడించారు.
తమ పోర్టుల్లో శుక్రవారం ఇంటర్నెట్ వినియోగాన్ని పూర్తిగా నిలిపేశామని డీపీ వరల్డ్ ప్రకటించింది. అనుమతులు లేని కార్యకలాపాలను అడ్డుకోవడానికే ఇలా చేసినట్లు వెల్లడించింది. ఫలితంగా ట్రాన్స్పోర్టు ట్రక్కులు కంటైనర్లను తీసుకెళ్లలేకపోతున్నాయని సంస్థ డైరెక్టర్ బ్లేక్ టియర్నీ వెల్లడించారు. సోమవారం ఉదయం ‘పోర్ట్స్ ఆస్ట్రేలియా’ ఈ పరిస్థితిపై స్పందిస్తూ.. ‘డీపీ వరల్డ్ టెర్మినళ్లలో అదే పరిస్థితి కొనసాగుతోంది’ అని పేర్కొంది. మిగిలిన సంస్థల ఆధీనంలోని ఆస్ట్రేలియా ఓడరేవుల టెర్మినళ్లు సాధారణంగానే పనిచేస్తున్నాయని వెల్లడించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వంతో కలిసి డీపీ వరల్డ్ పనిచేస్తోందని పేర్కొంది.
ఇటీవలే గుర్తుతెలియని కారణాలతో ఆస్ట్రేలియాలోని రెండో అతిపెద్ద టెలికమ్యూకేషన్స్ సంస్థ ఆప్టస్లో తీవ్ర సాంకేతిక సమస్య ఎదురైంది. దాదాపు కోటి మంది కస్టమర్లకు ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిచిపోయాయి. గతేడాది కూడా ఈ సంస్థకు చెందిన డేటా లీకైంది. ఆస్ట్రేలియా చరిత్రలోనే అది అతిపెద్ద డేటా లీక్గా నిలిచింది. అప్పట్లో దీనికి సైబర్ దాడే కారణమని అనుమానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
కరోనా వైరస్ (సార్స్కోవ్-2) జన్యు సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. -
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.
తాజా వార్తలు (Latest News)
-
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM