EU: రక్షణ కవచాలుగా పౌరులు,ఆసుపత్రులు.. హమాస్ తీరును ఖండించిన ఈయూ
గాజా(Gaza)లో ఆసుపత్రులు, పౌరులను రక్షణ కవచాలుగా ఉపయోగించుకుంటున్న హమాస్(Hamas) తీరును యురోపియన్ యూనియన్(EU) ఖండించింది. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి ప్రజలు సురక్షితంగా మరోచోటుకి తరలివెళ్లేలా అనుమతి ఇవ్వాలని ఈయూ విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ సూచించారు.
బెల్జియం: గాజా(Gaza)లో ఆసుపత్రులను, పౌరులను రక్షణ కవచాలుగా ఉపయోగించుకుంటున్న తీరుపై హమాస్(Hamas) చర్యలను యురోపియన్ యూనియన్(EU) ఖండించింది. యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుంచి పౌరులు భద్రంగా వెళ్లేలా చూడాలని హమాస్కు సూచించింది. ఉత్తరగాజాపై హమాస్ పట్టు కోల్పోయిందని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. హమాస్ను పూర్తిగా నిర్మూలించి బందీలను కాపాడతామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉత్తర గాజాలో ఉన్న పలు ఆసుపత్రులను ఐడీఎఫ్ దళాలు చుట్టుముట్టాయి. వీటిలో గాజాలో అతిపెద్దదైన అల్-షిఫా, రెండో అతిపెద్దదైన అల్-ఖుద్స్ ఉన్నాయి. దీంతో ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు, మందుల సరఫరా కష్టతరం అవుతోంది.
ఈ నేపథ్యంలో ఈయూ విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రజలను, ఆసుపత్రులను హమాస్ రక్షణ కవచాలుగా ఉపయోగించుకోవడాన్ని ఖండిస్తున్నాం. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి ప్రజలు సురక్షితంగా మరోచోటుకి తరలివెళ్లేలా అనుమతి ఇవ్వాలి’’ అని ఆయన సూచించారు. అదే సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించే క్రమంలో మరింత సంయమనం పాటించాలని ఇజ్రాయెల్ను ఆయన కోరారు. అంతర్జాతీయ మానవతా చట్టాల ప్రకారం బాధ్యతగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని రక్షించడానికి, మందుల సరఫరా చేసేందుకు ఆటంకం కలిగించకుండా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. అత్యవసర మందుల సరఫరాతో పాటు, అత్యవసర వైద్య సదుపాయం కావాల్సిన రోగులను భద్రంగా ఇతర ప్రాంతాలకు వెళ్లేలా చూడాలని ఇజ్రాయెల్కు ఆయన సూచించారు. ఇలాంటి శత్రుత్వాలు ఆసుపత్రులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, పౌరులు, వైద్య సిబ్బంది తీవ్రంగా నష్టపోతారని ఆయన హెచ్చరించారు.
ఇజ్రాయెల్ దళాలు పలు ఆసుపత్రులను చుట్టుముట్టడంతో వైద్యపరికరాలు, మందుల సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలువురు రోగులు వైద్య సహాయం అందక మృత్యువాత పడుతున్నట్లు వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే హమాస్ మిలిటెంట్లు పలువురిని రక్షణ కవచాలుగా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయెల్ పేర్కొంటోంది. ఆసుపత్రుల కింద, సమీప ప్రాంతాల్లో హమాస్ కమాండ్ సెంటర్లు ఏర్పాటు చేసిందని తెలిపింది. అయితే ఇజ్రాయెల్ వ్యాఖ్యలను హమాస్ ఖండించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రక్తంతో తడిసిన రైసీ చేతులు’.. ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అమెరికా
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా సంతాపం వ్యక్తం చేసింది. అయితే, ఈ సందర్భంగా ఆయనపై ఉన్న ఆరోపణలను గుర్తుచేసింది. -
అదే డేంజర్ బెల్!
ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగున్నర దశాబ్దాల నాటి హెలికాప్టర్. మరమ్మతులు, నిర్వహణకు సరైన విడిభాగాలు లేవు. ఇదేదో సరకు రవాణాకు ఉపయోగించే లోహవిహంగం కాదు.. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పయనిస్తున్న హెలికాప్టర్. -
మతబోధకుడి స్థాయి నుంచి అధ్యక్ష పీఠం వరకు
ఇబ్రహీం రైసీ.. ప్రస్తుత ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీకే కాదు.. అంతకుముందు అధినేతగా ఉన్న ఖొమైనీకీ సన్నిహితుడే. ఈ ఇద్దరి అధినేతల అండతోనే మతబోధకుడిగా ప్రస్థానం ప్రారంభించిన రైసీ అధ్యక్ష స్థానం వరకు ఎదిగారు. రైసీ సంస్కరణ వాది కాదు.. కరడుగట్టిన సంప్రదాయ వాది. -
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ ఇవ్వండి
ఇజ్రాయెల్-హమాస్ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా హమాస్, ఇజ్రాయెల్ నేతలకు అరెస్టు వారెంట్ జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ఐసీసీ) ప్రధాన ప్రాసిక్యూటర్ సోమవారం కీలక అభ్యర్థనలు చేశారు. -
శ్రీలంక ఆలయంలో సరయు నదీ జలాలతో కుంభాభిషేకం
శ్రీలంకలోని సీతా అమ్మన్ ఆలయానికి ఆదివారం నిర్వహించిన కుంభాభిషేకం కార్యక్రమంలో శ్రీలంక, భారత్, నేపాల్కు చెందిన వేల మంది భక్తులు పాల్గొన్నట్లు భారత హైకమిషన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. -
అసాంజేకు భారీ ఊరట
గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు సోమవారం లండన్ న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. -
‘కలుషిత రక్తం’ కుంభకోణంపై రిషి సునాక్ క్షమాపణలు
బ్రిటన్లో 1970ల్లో చోటుచేసుకున్న కలుషిత రక్తం కుంభకోణాన్ని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) కప్పిపుచ్చినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించి ప్రధానమంత్రి రిషి సునాక్ సోమవారం క్షమాపణలు తెలిపారు. -
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్సులోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. తక్షణం రంగంలోకి దిగిన ‘ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ’ ఘటన జరిగిన ప్రాంతాన్ని సోమవారం ఉదయం గుర్తించింది. -
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసినా.. అనేక మందితో లైంగిక కార్యకలాపాలు కొనసాగించిన ఓ సెక్స్ వర్కర్ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగికి బేడీలు.. కుటుంబసభ్యులు, నాయకుల అభ్యంతరం
-
‘రక్తంతో తడిసిన రైసీ చేతులు’.. ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అమెరికా
-
దక్షిణాది ముగిసింది.. ఉత్తరాది రమ్మంది
-
ప్రజ్వల్.. లొంగిపో : కుమారస్వామి హితవు
-
బోనస్ విషయంలో ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయట పెట్టింది: కేటీఆర్
-
అన్నవరం రైల్వే స్టేషన్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు