Putin: రష్యాను వీడిన.. పుతిన్ గురువు కుమార్తె..!
ఉక్రెయిన్పై పుతిన్ చేస్తోన్న యుద్ధంపై రష్యన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిర్బంధ సైనిక సమీకరణతోపాటు నిరసనకారులను అధికారులు లక్ష్యంగా చేసుకుంటుండడంతో ఎంతో మంది రష్యన్లు సొంత దేశాన్ని వీడుతున్నారు. ఈ క్రమంలో పుతిన్ ఒకప్పటి బాస్ కుమార్తె.. ప్రముఖ జర్నలిస్ట్ కూడా రష్యాను వీడి బాల్టిక్ దేశానికి వెళ్లిపోయారు.
మాస్కో: ఉక్రెయిన్పై భీకర యుద్ధం (Ukraine Crisis) చేపడుతోన్న రష్యా అధ్యక్షుడు పుతిన్పై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. నిర్బంధ సైనిక సమీకరణకు భయపడి ఇప్పటికే లక్షల మంది రష్యన్లు దేశాన్ని వీడగా.. పుతిన్ లక్ష్యంగా చేసుకుంటారనే భయంతో క్రెమ్లిన్ వ్యతిరేక నిరసనకారులు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్ రాజకీయ గురువు అనటోలి సొబ్చాక్ కుమార్తె, ప్రముఖ జర్నలిస్ట్ సెనియా సొబ్చాక్ రష్యాను వీడారు. ఓ కేసుకు సంబంధించి ఆమె సహోద్యోగిని నిర్బంధించడంతోపాటు తన ఇంట్లోనూ పోలీసులు సోదాలు చేపట్టిన తరుణంలో లిథువేనియాకు వెళ్లిపోయారు.
రష్యాలో ప్రముఖ జర్నలిస్టుగా పేరుగాంచిన సెనియా సొబ్చాక్ (40).. ఉక్రెయిన్పై రష్యా చేస్తోన్న సైనిక చర్యను మొదటినుంచీ తప్పుపడుతున్నారు. ఇదే విషయంపై పుతిన్ను ఆమె పలు సందర్భాల్లో బహిరంగంగా ప్రశ్నించారు. 2012లో అధ్యక్ష ఎన్నికల ముందు జరిగిన క్రెమ్లిన్ వ్యతిరేక నిరసనల్లోనూ సెనియా పాలుపంచుకున్నారు. 2018 అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్కు వ్యతిరేకంగా పోటీ చేసిన ఆమె.. సుమారు 2శాతం ఓట్లను సాధించారు. అనంతరం విపక్ష నేతలతో జరిగిన సమావేశంలో పుతిన్తోనూ భేటీ అయ్యారు.
అయితే, ఓ కేసుకు సంబంధించి సెనియా పనిచేస్తోన్న మీడియా సంస్థ డైరెక్టర్ను పోలీసులు ఇటీవల నిర్బంధించారు. అనంతరం ఆమె నివాసంపైనా పోలీసులు సోదాలు నిర్వహించారు. దర్యాప్తులో భాగంగా ఆమెను అరెస్టు చేసేందుకు వారెంట్ కూడా పోలీసులు వద్ద ఉన్నట్లు రష్యా మీడియా ఏజెన్సీ వెల్లడించింది. అధికారుల తీరును తీవ్రంగా ఆక్షేపించిన ఆమె.. తమ మీడియా సంస్థపై కక్ష్యపూరితంగానే ఈ దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ బాల్టిక్ దేశమైన లిథువేనియాకు వెళ్లిపోయారు.
సెనియా సొబ్చాక్ తండ్రి అనటోలి సొబ్చాక్. సెయింట్ పీటర్స్బర్గ్ మాజీ మేయర్. ప్రజాస్వామ్య సంస్కరణవాది. అయితే, సొబ్చాక్ను రాజకీయ గురువుగా పేర్కొనే పుతిన్.. ఆయన ప్రభావం తనపై ఎంతో ఉందని తరచుగా చెప్పేవారు. సోవియట్ యూనియన్ పతనం తర్వాత చాలా కాలంపాటు ఆయనతో కలిసి పనిచేసినట్లు గుర్తుచేసుకునేవారు. అంతేకాదు సెనియా చిన్నతనంలో రెండు కుటుంబాలు తరచుగా విహార యాత్రలకు వెళ్లేవని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్