Evergreen: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. బోనస్గా ఐదేళ్ల జీతం!
తైవాన్కు చెందిన షిప్పింగ్ సంస్థ ఎవర్గ్రీన్ (Evergreen) సంస్థ తన ఉద్యోగులకు దాదాపు ఐదేళ్ల జీతాన్ని బోనస్గా ప్రకటించింది.
ఇంటర్నెట్డెస్క్: సాధారణంగా ఉద్యోగులకు (Employees) ఒకట్రెండు నెలల జీతం బోనస్గా వస్తేనే ఎంతో సంబరపడిపోతారు. అలాంటింది ఒకటికాదు..రెండుకాదు.. ఏకంగా ఐదేళ్ల వేతనం బోనస్ (Bonus)గా ఇస్తుంటే ఆ ఉద్యోగులు ఇంకెంత ఆనందంగా ఫీలవుతారో చెప్పండి. నిజమే.. తైవాన్కు చెందిన ఎవర్గ్రీన్ అనే షిప్పింగ్ సంస్థ తమ ఉద్యోగులకు ఇయర్ ఎండ్ బోనస్ కింద ఇప్పటికే 50 నెలల జీతాన్ని బోనస్గా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో 10 నుంచి 11 నెలల వేతనాన్ని మిడ్ ఇయర్ బోనస్ కింద చెల్లించాలని నిర్ణయించింది. అంటే దాదాపు 5ఏళ్ల జీతాన్ని ఆ సంస్థ ఉద్యోగులు బోనస్గా అందుకోనున్నారు. కేవలం మిడ్ ఇయర్ బోనస్ కింద దాదాపు 94 మిలియన్ డాలర్లు మేర చెల్లించే అవకాశం ఉన్నట్టు అక్కడి వార్తా సంస్థ వెల్లడించింది.
కరోనా మహమ్మారి సమయంలో సూయిజ్ కెనాల్లో ఓ భారీ నౌక చిక్కుకుపోయి కొన్ని రోజుల పాటు ఆ మార్గంలో రవాణాకు తీవ్ర అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. అది ఎవర్గ్రీన్ సంస్థకు చెందినదే. ఈ షిప్పింగ్ సంస్థ కరోనా కాలంలో భారీ నష్టాలను కూడా చవి చూసింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణగడం, ప్రపంచవాప్తంగా లాక్డౌన్ను ఎత్తివేయడంతో గత రెండేళ్లుగా 39.92 శాతం మేర లాభాలను ఆర్జిస్తోంది. ఉద్యోగుల కృషిఫలితంగానే ఇంత భారీగా లాభాలు వచ్చాయని భావించని ఆ సంస్థ.. ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు ఆధారంగా బోనస్కు ఎంపిక చేసింది. ఈ ఏడాది మధ్యలో వారి ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమచేస్తామని ఎవర్గ్రీన్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి.
తైవాన్లో ఆర్థిక సంవత్సరం డిసెంబరు 31తో ముగుస్తుంది. అయితే, తాజాగా డిసెంబరు 31, 2022 నాటికి ఎవర్గ్రీన్ రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించింది. NT334 బిలియన్ డాలర్లతో గతంలో ఎన్నడూ లేనంతగా లాభాలు సాధించింది. ఇంతటి విజయానికి ఉద్యోగులే కారణమని భావించిన ఎవర్గ్రీన్.. తమ సంస్థలో పని చేస్తున్న 3,100 మంది ఉద్యోగులందరికీ బోనస్ ప్రకటించింది. ఈ సంస్థలో పని చేసే ఉద్యోగుల వార్షిక వేతనం దాదాపు 29,545 డాలర్ల నుంచి.. 1,14,823 డాలర్ల వరకు ఉంటుంది. ఈ లెక్కన ఐదేళ్ల బోనస్ అంటే వాళ్లకి సగటున ఎంత వస్తుందో అంచనా వేయొచ్చు. ఎవర్గ్రీన్ ఉద్యోగులకు 5 సంవత్సరాల జీతాన్ని బోనస్గా ప్రకటించారన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించాయి. దీంతో ఆ సంస్థ ఉద్యోగులను చూస్తే అసూయ కలుగుతోందంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు