బోయింగ్‌ 737 విమానంలో మంటలు.. రన్‌వేపై జారి 10 మందికి గాయాలు

ఆఫ్రికాలోని సెనెగల్‌ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్‌ 737 విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్‌వేపై జారిపోయింది.

Updated : 10 May 2024 06:13 IST

సెనెగల్‌లో ఘటన

డాకర్‌: ఆఫ్రికాలోని సెనెగల్‌ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్‌ 737 విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్‌వేపై జారిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్‌ సహా 10 మందికి గాయాలైనట్లు దేశ రవాణా శాఖ మంత్రి వెల్లడించారు. రాజధాని డాకర్‌లోని బ్లెస్‌ జియాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం అర్ధరాత్రి మాలీ రాజధాని బమాకోకు బయల్దేరిన ట్రాన్స్‌ఎయిర్‌ సంస్థకు చెందిన బోయింగ్‌ 737 విమానంలో తొలుత మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కొందరు ప్రయాణికులు రన్‌వేపై కిందకు దూకడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో విమానం జారడంతో 10 మందికి గాయాలయ్యాయి. ఆ సమయంలో ఇద్దరు పైలట్లు, నలుగురు క్యాబిన్‌ సిబ్బంది సహా మొత్తం 85 మంది విమానంలో ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని