China: 2023లో చైనా ముందు కఠిన సవాళ్లు
చైనాలో దేశమంతటా వ్యాప్తి చెందిన కొవిడ్ - 19 తాజా ఉద్ధృతి కొత్త సవాళ్లు విసురుతున్నట్లు అధ్యక్షుడు షీ జిన్పింగ్ అంగీకరించారు.
కొవిడ్ ఉద్ధృతిపై షీ జిన్పింగ్ ఆందోళన
బీజింగ్: చైనాలో దేశమంతటా వ్యాప్తి చెందిన కొవిడ్ - 19 తాజా ఉద్ధృతి కొత్త సవాళ్లు విసురుతున్నట్లు అధ్యక్షుడు షీ జిన్పింగ్ అంగీకరించారు. భారత్తోపాటు పలు దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ప్రబలిన కొవిడ్ వేరియంట్లపై మరింత సమాచారం కావాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్వో) డ్రాగన్ దేశాన్ని కోరింది. ఈ పరిస్థితుల్లో కొత్త సంవత్సరాది ప్రారంభ వేళ జాతీయ టెలివిజన్లో జిన్పింగ్ మాట్లాడారు. ఇప్పటిదాకా అసాధారణ ప్రయత్నాలతో చైనా ఎన్నో ఇబ్బందులను అధిగమించిందని చెప్పారు. ‘కొవిడ్-19ను ఎదుర్కోవడంలో మనం ఇపుడు కొత్తదశలోకి ప్రవేశించాం. కఠిన సవాళ్లు ముందున్నాయి. ఈ ప్రయాణం అంత సులభం కాదు’ అన్నారు. దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల తీవ్రత గురించి ఆయన ఇంతకుమించి వివరాలు వెల్లడించలేదు. ‘ఈ మహమ్మారి ప్రబలినప్పటి నుంచీ ప్రజల జీవితాలు, ఆరోగ్య సంరక్షణకే అధిక ప్రాధాన్యం ఇచ్చాం. శాస్త్రీయ విధానాలతో కొవిడ్ను ఎదుర్కొన్నాం. అధికారులు ఈ దిశగా ఎంతో ధైర్యం ప్రదర్శించి పని చేశారు. ఇపుడు విశ్వాసమనే ఓ కాంతిరేఖ ముందుంది. పట్టుదల, ఐకమత్యంతో మరింత శ్రమించి విజయం సాధిద్దాం’ అని జిన్పింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
పశ్చిమ దేశాల వంచన, దూకుడు తగ్గాలి : పుతిన్
మాస్కో: ఉక్రెయిన్లోని సంఘర్షణను ఉపయోగించుకొని మాస్కోను అణగదొక్కాలని చూస్తున్న పశ్చిమ దేశాలు తమ వంచన, దుందుడుకు వైఖరిని తగ్గించుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిమాండ్ చేశారు. కొత్త సంవత్సర ప్రారంభ వేళ పుతిన్ ప్రసంగించిన వీడియో ఒకటి శనివారం రష్యా స్టేట్ టెలివిజన్లో ప్రసారమైంది. వెనుక సైనికులు నిలబడి ఉండగా చేసిన ఈ ప్రసంగం మిలటరీ హెడ్క్వార్టర్స్ నుంచి చేసినట్టుగా ఉంది. 2022ని రష్యాకు క్లిష్టమైన ఏడాదిగా పేర్కొన్న పుతిన్ తమ భద్రతను సవాలు చేసినందునే ఉక్రెయిన్కు బలగాలను తరలించాల్సి వచ్చిందని పునరుద్ఘాటించారు. ‘2022లో మా మీద నిజమైన ఆంక్షల యుద్ధాన్ని ప్రకటించారు. వారి ఉద్దేశం మా పరిశ్రమలు, ఆర్థికవ్యవస్థ, రవాణా వ్యవస్థ కుప్పకూలడం. కానీ, అలా జరగలేదు’ అని పుతిన్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోదసిలోకి తెలుగుతేజం
తెలుగు తేజం గోపీచంద్ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. -
అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది! ఆయన సురక్షితంగా ఉన్నదీ లేనిదీ అంతుచిక్కకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. -
ఆకాశంలో రాకాసి ఉల్క
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ ఉల్క భూమిపై పడింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి లోనై నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది. -
గాజాపై గగనతల దాడిలో 27 మంది మృతి
ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడిలో గాజాలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నుసీరత్లో పాలస్తీనా శరణార్థి శిబిరంపై చోటుచేసుకున్న ఈ ఘటన మృతుల్లో 10 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. -
బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆస్తుల కంటే రిషి సునాక్ దంపతుల సంపదే ఎక్కువ
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. -
కాంగోలో తిరుగుబాటుకు విఫలయత్నం
దేశంలో తిరుగుబాటుకు జరిగిన ప్రయత్నాన్ని వమ్ము చేసినట్లు కాంగో సైన్యం ఆదివారం ప్రకటించింది. దీనికి సంబంధించి పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపింది. -
విషమంగానే స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ఆరోగ్యం
స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59) ఆరోగ్యం ఆదివారమూ విషమంగానే ఉంది. దేశ రాజధాని బ్రటిస్లావాకు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలోని హాండ్లోవా పట్టణంలో ఫికోపై ఓ దుండగుడు బుధవారం కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. -
అఫ్గాన్లో కొనసాగుతున్న కుండపోత వర్షాలు
అధిక వర్షాలు అఫ్గానిస్థాన్ను అల్లకల్లోలానికి గురిచేస్తున్నాయి. కుండపోత వానలకు వరదలు తోడు కావడంతో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. -
ఆ ఘటనతోనే భారత్తో వాణిజ్య బంధానికి తెర : పాక్
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ దిగుమతులపై భారత్ అధిక సుంకాలు విధించడం ప్రారంభించిందని ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ అన్నారు. -
రష్యా, ఉక్రెయిన్ పరస్పర దాడులు
రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. దీనివల్ల పలుచోట్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. తమ దేశంలోకి వచ్చిన 57 డ్రోన్లు, పలు క్షిపణులను కూల్చేశామని రష్యా ప్రకటించింది.