ముచ్చటగా మూడోసారి.. చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జిన్పింగ్
ప్రపంచంలో రెండో అతిపెద్ద అర్థిక వ్యవస్థగా అవతరించిన చైనా అధ్యక్షుడిగా షీ జిన్పింగ్(69) సరికొత్త చరిత్ర లిఖించారు. ముచ్చటగా మూడోసారి ఆ దేశాధ్యక్ష పదవిని చేపట్టారు.
పార్లమెంటు ఏకగ్రీవ ఆమోదం
జీవితాంతం ఆ పదవిలో కొనసాగే అవకాశం!
మావోతో సమాన స్థాయి ప్రాధాన్యం
బీజింగ్: ప్రపంచంలో రెండో అతిపెద్ద అర్థిక వ్యవస్థగా అవతరించిన చైనా అధ్యక్షుడిగా షీ జిన్పింగ్(69) సరికొత్త చరిత్ర లిఖించారు. ముచ్చటగా మూడోసారి ఆ దేశాధ్యక్ష పదవిని చేపట్టారు. మరో ఐదేళ్ల పాటు ఆయనకు అత్యున్నత అధికార బాధ్యతలు అప్పగిస్తూ చైనా పార్లమెంటు....నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ) శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
గతేడాది అక్టోబరులో జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) మహాసభ జిన్పింగ్ను మరోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. దీంతో సీపీసీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మావో తర్వాత రెండు దఫాలకు మించి పార్టీ పగ్గాలు అందుకున్న తొలి నేతగా జిన్పింగ్ ఘనత సాధించారు. సాధారణంగా సీపీసీ నిర్ణయాలనే యథాతథంగా అమలు చేస్తూ ‘రబ్బర్ స్టాంప్ పార్లమెంటుగా పేరొందిన ఎన్పీసీ.. జిన్పింగ్ను మూడోసారి అధ్యక్షుడిగా శుక్రవారం ఎన్నుకుంది. మొత్తం 2,952 మంది సభ్యులు ఆయనకు ఏకగ్రీవంగా మద్దతుపలికారు. ఈ ఎన్నిక తర్వాత.. జిన్పింగ్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. జిన్పింగ్కు అత్యంత సన్నిహితుడు హన్ ఝెంగ్ను దేశ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నూతన ప్రధాని ఎన్నిక శనివారం జరగనుంది. ప్రస్తుత ప్రధాని లీ కచియాంగ్ పదవీ కాలం ముగిసింది. ఆయన స్థానంలో లీ చియాంగ్ ఎన్నిక కావచ్చని తెలుస్తోంది.
కెమికల్ ఇంజినీర్ నుంచి..
జిన్పింగ్ తండ్రి షి ఝాంగ్షన్... మావో జెడాంగ్ ప్రభుత్వంలో ఉప ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, ఉదారవాద విధానాలు అనుసరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో పదవి కోల్పోయారు. ఆయనను జైలులో పెట్టారు. అప్పటికి జిన్పింగ్కు 13 ఏళ్లు. తండ్రి మీద వచ్చిన అపవాదుల ప్రభావం ఆ కుర్రాడిపై తీవ్రంగానే పడింది. జీవితంలో రాటుదేలేలా చేసింది. పలు ప్రయత్నాల తర్వాత 1974లో జిన్పింగ్ చైనా కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం పొందగలిగారు. 1975లో కెమికల్ ఇంజినీరింగ్లో పట్టభద్రుడయ్యారు. జానపద గాయని పెంగ్ లియువాన్ను వివాహమాడారు. వీరికి ఒక కుమార్తె షీ మింగ్జే.
2012లో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా జిన్పింగ్ తొలిసారి నియమితులయ్యారు. అప్పటి నుంచి గత పదేళ్ల పదవీకాలంలో ఆయన.. చైనా కమ్యూనిస్టు పార్టీ అధినాయకుడు మావో జెడాంగ్ తరవాత అంతటి శక్తిమంతమైన నేతగా ఆవిర్భవించారు. చైనాలో ఉన్నత నాయకులెవరూ రెండుసార్లకు మించి పదవిలో కొనసాగకూడదనీ, మావో తర్వాత పగ్గాలు చేపట్టిన డెంగ్ జియావోపింగ్ నిర్దేశించారు. ఈ నిబంధనను మారుస్తూ 2018లో చైనా పార్లమెంటు రాజ్యాంగంలో కీలక సవరణ చేసింది. దీంతో రెండు పర్యాయాల పదవీకాల పరిమితి నుంచి దేశాధ్యక్షుడికి మినహాయింపు కల్పించింది. 2021లో జరిగిన సీపీసీ ప్లీనరీ సమావేశంలో.. చైనాకు జీవితకాల అధినాయకుడిగా జిన్పింగ్ను నియమించేందుకు వీలుగా తీర్మానించారు.
అధికారాలన్నీ జిన్పింగ్ చేతుల్లోనే..
ఇరవై లక్షల మందికి పైగా సైనికులతో ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంగా గుర్తింపు పొందిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అధిష్ఠానంగా భావించే కేంద్ర మిలిటరీ కమిషన్ ఛైర్మన్గానూ జిన్పింగ్నే ఎన్నుకుంటూ పార్లమెంటు తీర్మానించింది. దీంతో అధికారాలన్నీ మళ్లీ జిన్పింగ్ చేతుల్లోకే వెళ్లాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా, మిలిటరీ కమిషన్ ఛైర్మన్గా చైనాలోని మూడు అధికార కేంద్రాలకు ఆయన అధినాయకుడిగా కొనసాగనున్నారు. దీంతో ఇక, జిన్పింగ్ జీవితకాలం అధికారంలో కొనసాగుతారనే అభిప్రాయం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434