NATO: నాటోలో ఐరోపా చిచ్చు!
రష్యాకు వ్యతిరేకంగా... అమెరికా సారథ్యంలో ఏర్పడ్డ నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి.
అమెరికాతో అంటకాగబోమంటున్న ఫ్రాన్స్, జర్మనీ
వారికి బానిసలం కాము: మెక్రాన్
ఐరోపాకు వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అవసరం
చైనా అధ్యక్షుడితో భేటీకాగానే ప్రకటన
రష్యాకు వ్యతిరేకంగా... అమెరికా సారథ్యంలో ఏర్పడ్డ నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. ఈ కూటమిలో ప్రధాన భాగస్వాములైన ఐరోపా దేశాలే ఇందుకు కారణం అవుతుండటం విశేషం. ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీలు...నాటోకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాతో అంటకాగటానికి నిరాకరిస్తుండటం; వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కోరుకుంటుండటం...అమెరికాకు బానిసలం కామని ప్రకటించటం... ప్రపంచ భౌగోళిక రాజకీయ మార్పుల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామం!
రష్యాతో పోరులో ఉక్రెయిన్కు నాటో దేశాలన్నీ ఆయుధ, ఆర్థిక సాయం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే కొత్తగా 31వ దేశంగా ఫిన్లాండ్కు నాటో సభ్యత్వం కూడా ఇచ్చారు. పైకి ఇది నాటో విస్తరిస్తున్నట్లు, బలోపేతం అవుతున్నట్లు కనిపిస్తున్నా...లోలోన మాత్రం సరికొత్త విభజన రేఖలు పుట్టుకొస్తున్నాయి. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా పెద్దన్న పాత్రను అంగీకరించేందుకు, దాన్ని అనుసరించేందుకు ఫ్రాన్స్, జర్మనీలు అంగీకరించటం లేదు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ తాజాగా ఈ విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు ప్రకటించటం విశేషం. ఇటీవలే ఆయన చైనాలో పర్యటించి, ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ అయి వచ్చారు. ‘‘తైవాన్ విషయంలో అమెరికా, చైనాల మధ్య ఐరోపా ఇరుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో అమెరికానో, చైనానో అనుసరించాల్సిన అవసరం మాకు లేదు. ఐరోపా ఎవ్వరికీ బానిస కాదు... సంబంధం లేని సంఘర్షణల్లో ఇరుక్కునే ప్రమాదాన్ని అది ఎదుర్కొంటోంది. మాకు వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అవసరం’’అని మెక్రాన్ వ్యాఖ్యానించారు.
బుధవారం నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా కూడా ఆయన ఈ వ్యాఖ్యలను పునరుద్ఘాటించటం విశేషం. ‘‘అమెరికా మిత్రపక్షం అయినంత మాత్రాన వారి చేతిలో పావులుగా/బానిసలుగా ఉంటామని అర్థం కాదు’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. అమెరికా పెద్దన్న పాత్రపోషిస్తుండటంతో తమకు నిర్ణయాల్లో స్వయంప్రతిపత్తి లేకుండా పోతోందని మెక్రాన్ చెప్పకనే చెప్పారు. జర్మనీ కూడా దాదాపు ఇదే బాటలో పయనిస్తోంది. ఫ్రాన్స్ అగ్రనేత మాదిరిగా వ్యాఖ్యలు చేయకున్నా... జర్మనీ అధ్యక్షుడు కూడా చైనా వెళ్లి వచ్చారు. జిన్పింగ్తో భేటీ అయ్యారు. నిజానికి...నాటో సభ్య దేశంగా, ఐరోపాలో కీలక దేశంగా, యుద్ధంలో ఉక్రెయిన్కు సాయం చేస్తున్నప్పటికీ రష్యా పట్ల కఠిన వైఖరికి జర్మనీ అంత సుముఖంగా లేదు. కారణం... ఇంధనం తదితర రంగాల్లో రష్యాపై భారీగా ఆధారపడి ఉండటమే. జర్మనీ సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వాములు కొంతమందికి రష్యాతో తెగతెంపులు ఇష్టం లేదు. రక్షణ బడ్జెట్ను భారీగా పెంచుకొన్న జర్మనీ ఆయుధ సంపత్తిని సమకూర్చుకోగానే ఫ్రాన్స్ మాదిరిగానే గళం పెంచుతుందని అనుకుంటున్నారు. స్పెయిన్, పోర్చుగల్, ఇటలీలు కూడా ఫ్రాన్స్-జర్మనీ బాటలో పయనించే అవకాశాలు ఎక్కువ. ఇప్పటికే ఇటలీని రష్యా మిత్రదేశంగా నాటో కూటమి అనుమానిస్తుంది. టర్కీ పేరుకు నాటోలో ఉన్నా... రష్యా, అమెరికాలతో సమదూరం పాటిస్తోంది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్లు గతంలోనే చైనాతో యూరోపియన్ యూనియన్ బంధాన్ని బలపరిచాయి.
వారిది అమెరికా బాట...
ఈ పరిణామాలు, మెక్రాన్ వ్యాఖ్యలు ఐరోపాలో, నాటో కూటమిలో కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు ఐరోపా దేశాలు పోలండ్, లాత్వియాలాంటి దేశాలతో పాటు నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్లాంటి దేశాలన్నీ నాటో సారథ్యాన్ని కోరుకుంటున్నాయి. కారణం... ఇవన్నీ చిన్నచిన్న దేశాలు. రష్యా ఆక్రమణ భయం వీటన్నింటినీ అమెరికా ఛత్రం కిందికి తీసుకొస్తోంది. డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, నార్వేలు...ఏకంగా తమ వాయుసేనలను కలిపేసి ఒకే దళంగా ఏర్పాటు చేసుకున్నాయి కూడా. మెక్రాన్ వ్యాఖ్యలను యూరోపియన్ పార్లమెంటు ప్రతినిధి కొట్టిపారేశారు. ఆయన ఫ్రాన్స్ గురించి మాట్లాడుకోవాలిగాని... మొత్తం ఐరోపా గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ‘అమెరికా నుంచి వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కోరుకునే బదులు... అమెరికాతో కలసి వ్యూహాత్మక భాగస్వామ్యం కోరుకుంటే మంచిది’ అని పోలండ్ ప్రధాని సూచించటం గమనార్హం. మొత్తానికి... అమెరికా, దాని మిత్రదేశాల మధ్య చిచ్చురేపటంలో చైనా సఫలమవుతున్నట్లు కనిపిస్తోంది.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ