కొండంత రెస్టారెంట్.. 5,800 మంది విందు ఆరగించొచ్చు
చైనాలోని చాంగ్క్వింగ్ పట్టణ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద ‘హాట్పాట్’ రెస్టారెంట్ ఉంది. ‘హాట్పాట్’ అంటే కొందరు సమూహంగా ఏర్పడి టేబుల్ మధ్య పాత్ర పెట్టి ఏదైనా వంటకం వండుకుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: చైనాలోని చాంగ్క్వింగ్ పట్టణ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద ‘హాట్పాట్’ రెస్టారెంట్ ఉంది. ‘హాట్పాట్’ అంటే కొందరు సమూహంగా ఏర్పడి టేబుల్ మధ్య పాత్ర పెట్టి ఏదైనా వంటకం వండుకుంటారు. తరువాత దాన్ని వడ్డించుకుని, కబుర్లు చెబుతూ తింటారు. కానీ ఇప్పుడు మాత్రం షెఫ్లు తయారుచేసి తెచ్చిపెట్టిన ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓ కొండపైనున్న ఈ రెస్టారెంట్లో సుమారు 900 టేబుళ్లున్నాయి. ఏకకాలంలో వాటిపై 5,800 మంది విందు ఆరగించవచ్చు. కొండప్రాంతంలో ఉన్న ఈ రెస్టారెంట్ పేరు పిపా యువాన్. 3,300 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇది అతి పెద్ద హాట్పాట్ రెస్టారెంట్గా గిన్నిస్ బుక్లో చోటు సంపాదించింది. ఈ రెస్టారెంట్లో నిత్యం టన్నుల కొద్దీ వంటలు తయారు చేస్తుంటారు. ఇక్కడ వెయిటర్లు, కుక్లు, కిచెన్ సిబ్బంది అంతా కలిపి వందల సంఖ్యలో ఉంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రణరంగంగా తైవాన్ పార్లమెంటు
ఓ బిల్లుపై చర్చ సందర్భంగా తైవాన్ పార్లమెంటులో అధికార, విపక్ష ఎంపీలు పరస్పర దాడులకు దిగారు. ఒకరినొకరు ఎత్తిపడేసి.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. -
సింగపూర్లో మళ్లీ కొవిడ్ అలజడి
కొవిడ్-19 మహమ్మారి సింగపూర్లో మరోసారి కలకలం రేకెత్తిస్తోంది. ఈ నెల 5 నుంచి 11 మధ్య 25,900కుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యె కుంగ్ తెలిపారు. -
సంక్షిప్త వార్తలు (4)
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళుతున్న మినీ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఓ ఉమ్మడి కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు సహా 14 మంది మృతి చెందారు. -
కిర్గిజ్స్థాన్లో విదేశీ విద్యార్థులపై మూకదాడులు
కిర్గిజ్స్థాన్లోని భారత విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని బిష్కెక్లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగడంతో.. ఎవరూ బయటకు రావొద్దని సూచించింది.