జీ-20 సదస్సుకు.. వచ్చేదెవరు? రానిదెవరు?
ప్రపంచ ఆర్థిక సవాళ్లపై చర్చించే జీ-20 సదస్సుకు సర్వం సిద్ధమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈనెల 9, 10 తేదీల్లో దిల్లీ వేదికగా జరిగే ఈ శిఖరాగ్ర సమావేశానికి అనేక కీలక దేశాల అధినేతలు హాజరుకాబోతున్నారు.
దిల్లీ: ప్రపంచ ఆర్థిక సవాళ్లపై చర్చించే జీ-20 సదస్సుకు సర్వం సిద్ధమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈనెల 9, 10 తేదీల్లో దిల్లీ వేదికగా జరిగే ఈ శిఖరాగ్ర సమావేశానికి అనేక కీలక దేశాల అధినేతలు హాజరుకాబోతున్నారు. 20 కీలక ఆర్థిక దేశాల ఈ కూటమిలోంచి ఎవరెవరు వస్తున్నారో.. ఎవరెందుకు రావట్లేదో చూస్తే..
7న వస్తున్న బైడెన్..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిల్లీ సదస్సుకు ఈ నెల ఏడో తేదీనే వస్తున్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు. తాజాగా.. ఆయన భార్య జిల్ బైడెన్ కొవిడ్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన భారత్కు రావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే జీ 20 సదస్సుకు బైడెన్ వస్తున్నట్లు శ్వేతసౌధం మంగళవారం ధ్రువీకరించింది.
సునాక్ తొలిసారి..
బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్ తొలిసారి దిల్లీ రానున్నారు.
ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ సై
పసిఫిక్ మండలంలో చైనాను కట్టడి చేయాలని భావిస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ జీ-20పై ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు. భారత్తో పాటు ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ల్లోనూ ఆయన పర్యటించనున్నారు.
ఆసియాన్ నుంచి ఇటే.. కెనడా ప్రధాని
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇండోనేసియాలో జరిగే ఆసియాన్ సదస్సు నుంచి నేరుగా దిల్లీ వస్తున్నారు.
తగ్గేదేలేదు: జర్మనీ
చైనా, రష్యాలు రాకున్నా.. జీ-20కి ప్రాధాన్యం తగ్గేదేలేదని జర్మనీ స్పష్టం చేసింది. దిల్లీ సదస్సుకు స్వయంగా హాజరవుతున్నట్లు జర్మనీ ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ ప్రకటించారు.
రష్యా లక్ష్యంగా.. జపాన్
ఉక్రెయిన్పై దాడికి ప్రతిగా రష్యాపై పాశ్చాత్యదేశాల విమర్శలకు జపాన్ ఈ సదస్సులో ముందుంటుందని అనుకుంటున్నారు. ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిద ఇప్పటికే దిల్లీ వస్తున్నట్లు సమాచారమిచ్చారు.
ఉత్తరం బాధతో.. దక్షిణ కొరియా
ఉత్తరకొరియా క్షిపణి కవ్వింపులతో ఇబ్బందులు పడుతున్న దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్యోల్ సదస్సుకు వస్తున్నారు. ఉత్తర కొరియా అణు సన్నాహాలపై ఆయన ప్రపంచ నేతలతో చర్చించే అవకాశం ఉంది.
ఫ్రాన్స్ ద్వైపాక్షికం..
జీ-20 సదస్సుకు వస్తున్న మరో కీలక నేత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు.
చైనా అధ్యక్షుడి బదులుగా ప్రధాని
భారత్తో సరిహద్దు వివాదాలను ఎదుర్కొంటున్న చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ దిల్లీ సదస్సుకు ముఖం చాటేశారు. ఆయన స్థానంలో చైనా ప్రధాని లీ చియాంగ్ సారథ్యంలోని బృందం జీ-20 సదస్సుకు వస్తోంది. ఇంకా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగన్, అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్, నైజీరియా అధ్యక్షుడు బొలా తినుబు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాలు దిల్లీ సదస్సుకు హాజరవుతారని సమాచారం.
రానివారు వీరు..
పుతిన్: ఉక్రెయిన్ యుద్ధంతో తలమునకలవుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ జీ-20 సదస్సుకు హాజరు కావటం లేదు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వస్తున్నారు.
ఐరోపా యూనియన్: జీ-20 కూటమిలో భాగమైన ఐరోపా యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్డెర్ లియోన్ వచ్చేదీ లేనిదీ ఇంకా స్పష్టంగా చెప్పలేదు. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెజ్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడోర్ కూడా సదస్సుకు రాకపోవచ్చు. ఇటలీ ప్రధాని, ఇండోనేసియా అధ్యక్షుడి రాకపైనా స్పష్టత లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై విభిన్న ప్రచారాలు జరుగుతున్నాయి. అంతరిక్ష లేజర్లు.. వారసత్వ పోరు కారణంగానే ఆయన ప్రాణాలు కోల్పోయారని వీటిల్లో పేర్కొంటున్నారు. -
ఎట్టిపరిస్థితుల్లోనూ భారత భద్రతకు ముప్పును అనుమతించబోం: శ్రీలంక
Sri Lanka: బాధ్యతాయుత పొరుగుదేశంగా భారత భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను అనుమతించబోమని శ్రీలంక స్పష్టం చేసింది. గత ఏడాది చైనా గూఢచార నౌక ఒకటి శ్రీలంక తీరంలో ఆగడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
‘రక్తంతో తడిసిన రైసీ చేతులు’.. ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అమెరికా
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా సంతాపం వ్యక్తం చేసింది. అయితే, ఈ సందర్భంగా ఆయనపై ఉన్న ఆరోపణలను గుర్తుచేసింది. -
అదే డేంజర్ బెల్!
ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగున్నర దశాబ్దాల నాటి హెలికాప్టర్. మరమ్మతులు, నిర్వహణకు సరైన విడిభాగాలు లేవు. ఇదేదో సరకు రవాణాకు ఉపయోగించే లోహవిహంగం కాదు.. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పయనిస్తున్న హెలికాప్టర్. -
మతబోధకుడి స్థాయి నుంచి అధ్యక్ష పీఠం వరకు
ఇబ్రహీం రైసీ.. ప్రస్తుత ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీకే కాదు.. అంతకుముందు అధినేతగా ఉన్న ఖొమైనీకీ సన్నిహితుడే. ఈ ఇద్దరి అధినేతల అండతోనే మతబోధకుడిగా ప్రస్థానం ప్రారంభించిన రైసీ అధ్యక్ష స్థానం వరకు ఎదిగారు. రైసీ సంస్కరణ వాది కాదు.. కరడుగట్టిన సంప్రదాయ వాది. -
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ ఇవ్వండి
ఇజ్రాయెల్-హమాస్ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా హమాస్, ఇజ్రాయెల్ నేతలకు అరెస్టు వారెంట్ జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ఐసీసీ) ప్రధాన ప్రాసిక్యూటర్ సోమవారం కీలక అభ్యర్థనలు చేశారు. -
శ్రీలంక ఆలయంలో సరయు నదీ జలాలతో కుంభాభిషేకం
శ్రీలంకలోని సీతా అమ్మన్ ఆలయానికి ఆదివారం నిర్వహించిన కుంభాభిషేకం కార్యక్రమంలో శ్రీలంక, భారత్, నేపాల్కు చెందిన వేల మంది భక్తులు పాల్గొన్నట్లు భారత హైకమిషన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. -
అసాంజేకు భారీ ఊరట
గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు సోమవారం లండన్ న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. -
‘కలుషిత రక్తం’ కుంభకోణంపై రిషి సునాక్ క్షమాపణలు
బ్రిటన్లో 1970ల్లో చోటుచేసుకున్న కలుషిత రక్తం కుంభకోణాన్ని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) కప్పిపుచ్చినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించి ప్రధానమంత్రి రిషి సునాక్ సోమవారం క్షమాపణలు తెలిపారు. -
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్సులోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. తక్షణం రంగంలోకి దిగిన ‘ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ’ ఘటన జరిగిన ప్రాంతాన్ని సోమవారం ఉదయం గుర్తించింది. -
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసినా.. అనేక మందితో లైంగిక కార్యకలాపాలు కొనసాగించిన ఓ సెక్స్ వర్కర్ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?
-
అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజినీర్
-
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి
-
లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు
-
‘కనీసం ఓటు వేయాలని అనిపించలేదా’.. తమ ఎంపీకి భాజపా షోకాజ్ నోటీసులు
-
‘ఫ్యామిలీస్టార్’కు నెగెటివ్ టాక్ ఇలా క్రియేట్ చేశారు: ఆనంద్ దేవరకొండ