నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
పరారీలో ఉన్న వ్యాపారవేత్త, ఐదేళ్లుగా లండన్ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తాజాగా మంగళవారం అక్కడి న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
లండన్: పరారీలో ఉన్న వ్యాపారవేత్త, ఐదేళ్లుగా లండన్ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తాజాగా మంగళవారం అక్కడి న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు విచారణకు గైర్హాజరయ్యే ముప్పు అధికంగా ఉందంటూ న్యాయమూర్తి ఆ పిటిషన్ను తిరస్కరించారు. భారత్లో అక్రమాలు, నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం కింద అభియోగాలను ఎదుర్కొంటున్న నీరవ్.. తనను భారత్కు అప్పగించే విషయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన కేసులో ఓటమి పాలయ్యారు. మరోవైపు, మంగళవారం లండన్లోని వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్స్ న్యాయస్థానంలో బెయిలు పిటిషన్లపై జరిగిన విచారణకు నీరవ్ హాజరు కాలేదు. అదే సమయంలో ఆయన కుమారుడు, ఇద్దరు కుమార్తెలు గ్యాలరీలో కనిపించారు. నీరవ్కు బెయిలు అభ్యర్థిస్తూ మూడున్నర సంవత్సరాల క్రితం బెయిలు పిటిషన్ దాఖలు చేశామని, చాలా సమయం గడిచినందున మళ్లీ బెయిలు పిటిషన్ దాఖలు చేయడానికి వీలుగా పరిస్థితుల్లో మార్పు వచ్చిందన్న ఆయన తరఫు న్యాయవాదుల బృందం చేసిన వాదనను న్యాయమూర్తి జాన్జానీ ఆమోదించారు. ‘‘అయితే బెయిలుకు వ్యతిరేకంగా గణనీయమైన కారణాలు ఉన్నట్లు నేను భావిస్తున్నాను. నీరవ్ మోదీ విచారణకు గైర్హాజరయ్యే ముప్పు గణనీయంగా ఉంది’’ అని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
‘బ్లూ ఆరిజిన్’ సంస్థ చేపట్టిన అంతరిక్ష ప్రయోగంలో తెలుగు వ్యక్తి గోపీచంద్ తోటకూర (Gopichand Thotakura) విజయవంతంగా రోదసీలోకి వెళ్లి వచ్చారు. -
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు ప్రమాదం..!
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. -
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిల ఆస్తుల విలువ కింగ్ చార్లెస్ III కంటే ఎక్కువని వెల్లడైంది. -
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
పంచన్ లామా ఆచూకీని చైనా ప్రకటించాలని అమెరికా మరోసారి డిమాండ్ చేసింది. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని కోరింది. -
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ భారీ ఉల్క కనువిందు చేసింది. ఇది నేలరాలే సమయంలో వచ్చిన వెలుగుకు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. -
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికలో బరిలో ఉన్న ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. -
రణరంగంగా తైవాన్ పార్లమెంటు
ఓ బిల్లుపై చర్చ సందర్భంగా తైవాన్ పార్లమెంటులో అధికార, విపక్ష ఎంపీలు పరస్పర దాడులకు దిగారు. ఒకరినొకరు ఎత్తిపడేసి.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. -
సింగపూర్లో మళ్లీ కొవిడ్ అలజడి
కొవిడ్-19 మహమ్మారి సింగపూర్లో మరోసారి కలకలం రేకెత్తిస్తోంది. ఈ నెల 5 నుంచి 11 మధ్య 25,900కుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యె కుంగ్ తెలిపారు. -
సంక్షిప్త వార్తలు (4)
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళుతున్న మినీ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఓ ఉమ్మడి కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు సహా 14 మంది మృతి చెందారు. -
కిర్గిజ్స్థాన్లో విదేశీ విద్యార్థులపై మూకదాడులు
కిర్గిజ్స్థాన్లోని భారత విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని బిష్కెక్లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగడంతో.. ఎవరూ బయటకు రావొద్దని సూచించింది.
తాజా వార్తలు (Latest News)
-
మోదీపై వ్యతిరేక ప్రచారం.. జైలుపాలైన ఉపాధ్యాయుడు
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు