S Jaishankar: జర్మనీ ఛాన్స్లర్ నోట.. భారత మంత్రి మాట..!
గతేడాది భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(S Jaishankar) స్లొవాకియాలో చేసిన వ్యాఖ్యలను ఐరోపా దేశాల పెద్ద నేతలు ఇప్పటికీ మర్చిపోలేదు. తాజాగా మ్యూనిక్లో జరిగిన సదస్సులో మళ్లీ అవి చర్చకు వచ్చాయి.
ఇంటర్నెట్డెస్క్: భారత (India) విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్(S Jaishankar) గతేడాది ఓ సదస్సులో ఐరోపా దేశాలను విమర్శిస్తూ ‘యూరోపియన్ మైండ్సెట్’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఆయా దేశాధినేతలు గుర్తించుకున్నారు. తాజాగా జర్మనీ(germany)లోని మ్యూనిక్లో జరిగిన రక్షణ సదస్సులో ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చకు వచ్చాయి. జర్మనీ ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ ఈ వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీనిలో ఓ సద్విమర్శ ఉందన్న విషయాన్ని అంగీకరించారు.
ఈ సందర్భంగా షోల్జ్ మాట్లాడుతూ ‘‘మైండ్సెట్లో మార్పు అవసరం. సమష్టి చర్యల విషయంలో ఉత్తర అమెరికా, ఐరోపా.. బయట దేశాల ప్రయోజానాలు, ఆందోళనలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతో కలిసి పెరుగుతున్న పేదరికం, ఆకలి, కొవిడ్ ప్రభావం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం వంటి సమస్యల పరిష్కారంపై పనిచేయాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు.
గతేడాది స్లొవాకియాలో జరిగిన ఓ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అడిగిన ఓ ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ‘‘ఐరోపా సమస్యలు మాత్రమే ప్రపంచ సమస్యలని.. ప్రపంచ సమస్యలు ఐరోపా సమస్యలు కాదని భావించే మైండ్సెట్ నుంచి ఐరోపా బయటకు రావాలి. అది మీ సమస్య అయితే మీదే.. మా సమస్య అయితే మాదే’’ అని తేల్చిచెప్పారు. అంతేకాదు.. ఉక్రెయిన్ యుద్ధం కంటే ముందే భారత్-చైనా సంబంధాల మధ్య నెలకొన్న పరిస్థితిని కూడా ప్రస్తావించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.