Jaishankar: దేశ ప్రయోజనాల కోసమే ఇంధనం కొనుగోలు:జైశంకర్
ఉక్రెయిన్పై యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి రష్యాలో పర్యటిస్తోన్న భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్.. ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక అంశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపైనా చర్చిస్తామని ఇరువురు నేతలు పేర్కొన్నారు.
మాస్కో: ఉక్రెయిన్లో సంక్షోభం (Ukraine Crisis) ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోన్న వేళ.. ఆ దేశంతో తిరిగి చర్చలు ప్రారంభించాలని రష్యాకు భారత్ మరోసారి సూచించింది. గత కొన్నేళ్లుగా కొవిడ్ మహమ్మారితో తీవ్ర సంక్షోభాలను చవిచూసిన ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ యుద్ధం పర్యవసానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడింది. ఉక్రెయిన్పై యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి రష్యాలో పర్యటిస్తోన్న భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్(Jaishankar).. ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపైనా చర్చిస్తామని ఇరువురు నేతలు పేర్కొన్నారు.
‘కొవిడ్ మహమ్మారి, ఆర్థిక ఒత్తిడులు, వాణిజ్య ఇబ్బందులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణించడానికి కారణమయ్యాయి. వీటికితోడు ఉక్రెయిన్ యుద్ధం పర్యవసానాలను ప్రధానంగా చూస్తున్నాం. దేశాల ప్రగతికి అడ్డుపడే ఉగ్రవాదం, వాతావరణ సమస్యలు వంటి శాశ్వత సవాళ్లు ఉండనే ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మదింపు చేయడంతోపాటు అంతర్జాతీయ పరిస్థితులపై చర్చించేందుకు సమావేశమయ్యాం. ఇరుదేశాలు ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడంలో ఇదో కీలక పరిణామం. సుదీర్ఘకాలంగా, స్థిరమైన బంధాన్ని కలిగి ఉన్న భారత్-రష్యాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు సహాయపడుతున్నాయి’ అని మాస్కో సమావేశంలో జైశంకర్ పేర్కొన్నారు. ఇక రష్యా నుంచి ఇంధనం కొనుగోలుపై స్పందించిన ఆయన.. తక్కువ ఆదాయ వనరులున్న భారత్ చౌక ధరలో లభ్యమయ్యే వనరులవైపు చూడక తప్పదన్నారు. ఈ క్రమంలో భారత్-రష్యాల బంధం తమకెంతో దోహదపడుతుందని.. దీన్ని మున్ముందు కొనసాగిస్తామని భారత విదేశాంగశాఖ మంత్రి స్పష్టం చేశారు.
ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇటువంటి సమయంలో మాస్కో నుంచి భారత్ ఇంధనం కొనుగోలును ముమ్మరం చేసింది. మరోవైపు, ఇది యుద్ధాలు చేసే శకం కాదని.. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ రష్యాకు సూచిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
చైనాలోని ఓ ఆసుపత్రిలో దుండగుడు కత్తులతో జరిపిన దాడిలో పలువురు చనిపోయారు. 20 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. -
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
Rafah crossing: రఫాపై దాడి కొనసాగిస్తున్న ఇజ్రాయెల్.. ఇక్కడి సరిహద్దు క్రాసింగ్ను తన ఆధీనంలోకి తీసుకుంది. -
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
India-Maldives: భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాన్ని సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. -
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా వేగానికి చెక్ రిపబ్లిక్ కోర్టు బ్రేకులు వేసింది. -
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
Sunita Williams: సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర వాయిదా పడింది. రాకెట్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. -
నేడు రోదసిలోకి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. -
అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెల్ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్.. రఫాపై దాడి ఖాయమని టెల్ అవీవ్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది. -
ట్రంప్నకు వెయ్యి డాలర్ల జరిమానా
హష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకుగాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. -
రష్యా నుంచి రాయబారిని వెనక్కు పిలిచిన జర్మనీ
రష్యాలోని తమ రాయబారి అలెగ్జాండర్ లాంబ్సడార్ఫ్ను వారం రోజలు పాటు వెనక్కు పిలిపించినట్లు జర్మనీ సోమవారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
శామ్సంగ్ కొత్త పవర్బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్లకు ఛార్జింగ్
-
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
-
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
-
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన