Donald Trump: ఆస్కార్ వేదికపై పరువు పోగొట్టుకొన్న ట్రంప్..!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ నోటి దురుసు సంగతి తెలిసిందే. ఈ సారి ఆయన ఆస్కార్ వ్యాఖ్యాతను విమర్శించారు. కానీ, సదరు వ్యాఖ్యాత ట్రంప్ పరువు తీశాడు.
ఇంటర్నెట్డెస్క్: ఆస్కార్ అవార్డుల (Oscars 2024) వేదికపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నవ్వుల పాలయ్యారు. ఈ వేడుకల వ్యాఖ్యాతను ఉద్దేశించి ఆయన పోస్టు చేసిన గంటలోనే ప్రతిస్పందన వచ్చింది. అవార్డుల ప్రదానోత్సవంపై ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. దీనిలో వ్యాఖ్యాత జిమ్మీను విమర్శించారు. ఈ విషయం వేడుకలు జరుగుతుండగానే అతడి దృష్టికి వచ్చింది.
ఇక ఉత్తమ సినిమా అవార్డు ప్రకటించే సమయంలో జిమ్మీ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇప్పుడే తన పనితీరుపై ఓ సమీక్ష అందిందని పేర్కొన్నాడు. ట్రంప్ పేరు చెప్పకుండా సోషల్ మీడియా పోస్టును చదువుతూ.. ‘‘ఆస్కార్ వేడుకల్లో జిమ్మీని మించిన చెత్త హోస్ట్ ఎవరూ లేరు. సాధారణ స్థాయి కంటే తక్కువ వ్యక్తి తనకు సాధ్యంకాని దాన్ని ప్రయత్నిస్తున్నట్లు ఉంది. అది ఎప్పటికీ జరగదు. ముందు అతడిని తొలగించి ఎవరైన చౌకబారు వ్యక్తితో భర్తీ చేయండి. అతడు కూడా వేదికను బలంగా చేయగలడు... బ్లా..బ్లా..బ్లా.. అని’’ రాసుకొచ్చారని పేర్కొన్నాడు.
నగ్నంగా ఆస్కార్ వేదికపైకి.. అతిథులకు షాకిచ్చిన రెజ్లర్ జాన్సీనా
ఇక దీనికి సమాధానంగా కిమ్మెల్ స్పందిస్తూ.. మీరు ఆ పోస్టును ఏ మాజీ అధ్యక్షుడు ట్రూత్ సోషల్లో రాసి ఉంటారో ఊహించగలరని అతిథులతో అన్నాడు. ఇక ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు ట్రంప్నకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత ‘‘మీ జైలు గడువు ఇంకా ముగియలేదా..?’’ అని వెటకారంగా ప్రశ్నించాడు. ఈ మాటకు అక్కడున్న ప్రేక్షకులు గొల్లున నవ్వారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే నాలుగు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన విచారణలు కూడా వేగంగా జరుగుతున్నాయి. మరో వైపు ట్రంప్ 2024 ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.