Nepal Plane Crash: నేపాల్ విమాన ప్రమాదం.. ప్రయాణికులంతా మృతి..!
నేపాల్లో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణికులెవరూ ప్రాణాలతో లేరని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విమాన శకలాలను గుర్తించిన అధికారులు.. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు
ఇప్పటివరకు 14 మృతదేహాలు లభ్యం
కాఠ్మాండూ: నేపాల్లో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణికులెవరూ ప్రాణాలతో లేరని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విమాన శకలాలను గుర్తించిన అధికారులు.. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 14 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ విమానంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో లేరని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
తారా ఎయిర్ సంస్థకు చెందిన చిన్న విమానం ఒకటి నిన్న కుప్పకూలిన విషయం తెలిసిందే. పొఖారా నుంచి జోమ్సోమ్ పర్యాటక ప్రాంతానికి బయల్దేరిన ఈ విమానం మార్గమధ్యంలో ఎయిర్ట్రాఫిక్ కంట్రోలర్తో సంబంధాలు కోల్పోయింది. మరో ఐదు నిమిషాల్లో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. ముస్తాంగ్ జిల్లాలోని పర్వత ప్రాంతాల్లో కుప్పకూలింది. ఘటన సమయంలో విమానంలో 22 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో నలుగురు భారత్లోని మహారాష్ట్రకు చెందినవారు.
కొండ భాగాన్ని ఢీకొనడంతో విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు వెల్లడించారు. విమానానికి సంబంధించిన శకలాలను ముస్తాంగ్లోని థసంగ్ పర్వత ప్రాంతాల్లో గుర్తించినట్లు నేపాల్ ఆర్మీ వెల్లడించింది. దీంతో వెనువెంటనే ఆ ప్రాంతానికి రెస్క్యూ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ నారాయణ్ సిల్వాల్ తెలిపారు.
ఇప్పటివరకు 14 మృతదేహాలను ఘటనాస్థలంలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల పరిధిలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడినట్లు పేర్కొన్నారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే ఈ విమానంలో ప్రయాణికులెవరూ బతికే అవకాశం లేదని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్