Prince Harry: తండ్రి కోరిక మేరకే వస్తున్నా.. 10 వరుసల ఆవల ప్రిన్స్ హ్యారీ సీటింగ్..!
బ్రిటన్ రాజుగా చార్లెస్-3(King Charles III)కి మే 6న పట్టాభిషేకం జరగనుంది. దీనికి ప్రిన్స్ హ్యారీ(Prince Harry) కూడా హాజరవుతున్నారు. అయితే వేడుక వేళ ఆయనకు తగిన ప్రాధాన్యం దక్కకపోవచ్చని తెలుస్తోంది.
లండన్: బ్రిటన్(Britain) రాజకుటుంబం గురించి ఇటీవల ప్రిన్స్ హ్యారీ(Prince Harry) వెల్లడించిన విషయాలు సంచలనాన్ని కలిగించాయి. అప్పటి నుంచి తన కుటుంబంతో సంబంధాలు బెడిసికొట్టాయి. ఈ క్రమంలో బ్రిటన్ రాజుగా చార్లెస్-3(King Charles III)కి వచ్చే నెల 6న పట్టాభిషేకం జరగనుంది. దీనికి ఆయన చిన్నకుమారుడు హ్యారీ హాజరవుతున్నారు. రాచరిక విధులను వదులుకొని అమెరికాలో స్థిరపడిన ఆయనకు ఈ వేడుకలో తగిన ప్రాధాన్యం దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఆయన రాజకుటుంబానికి 10 వరుసల ఆవల కూర్చుంటారని సమాచారం.
తాజాగా యూకే ట్రిప్లో హ్యారీ(Prince Harry) తన కుటుంబంతో రాజీ పడే అవకాశాలు ఉండకపోవచ్చని రాజకుటుంబ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ‘వారి మధ్య రాజీకి అవకాశాలు కనిపించడం లేదు. ఆయనకు విండ్సర్స్ నుంచి తగిన ఆదరణ లభించకపోవచ్చని నేను భావిస్తున్నాను. అయితే తన తండ్రి కోరిక మేరకు హ్యారీ ఆ వేడుకకు హాజరవుతున్నాడు’ అని తెలిపారు. ఈ పట్టాభిషేక కార్యక్రమాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. అయితే హ్యారీ.. పట్టాభిషేకం సమయంలో మాత్రమే అక్కడ ఉంటారని, కేవలం 24 గంటల్లో యూకే వచ్చి, తిరిగి వెళ్లిపోతారని సమాచారం.
క్వీన్ ఎలిజబెత్ II మరణం తర్వాత.. కింగ్ ఛార్లెస్ (King Charles III) ఆ బాధ్యతలను స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే, అధికారికంగా రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ.. సంప్రదాయంగా నిర్వహించే పట్టాభిషేకం (Coronation) మాత్రం మే 6న జరగనుంది. ఈ వేడుక కోసం లండన్లోని వెస్ట్మినిస్టర్ అబే ముస్తాబవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిల ఆస్తుల విలువ కింగ్ చార్లెస్ III కంటే ఎక్కువని వెల్లడైంది. -
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
పంచన్ లామా ఆచూకీని చైనా ప్రకటించాలని అమెరికా మరోసారి డిమాండ్ చేసింది. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని కోరింది. -
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ భారీ ఉల్క కనువిందు చేసింది. ఇది నేలరాలే సమయంలో వచ్చిన వెలుగుకు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. -
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికలో బరిలో ఉన్న ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. -
రణరంగంగా తైవాన్ పార్లమెంటు
ఓ బిల్లుపై చర్చ సందర్భంగా తైవాన్ పార్లమెంటులో అధికార, విపక్ష ఎంపీలు పరస్పర దాడులకు దిగారు. ఒకరినొకరు ఎత్తిపడేసి.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. -
సింగపూర్లో మళ్లీ కొవిడ్ అలజడి
కొవిడ్-19 మహమ్మారి సింగపూర్లో మరోసారి కలకలం రేకెత్తిస్తోంది. ఈ నెల 5 నుంచి 11 మధ్య 25,900కుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యె కుంగ్ తెలిపారు. -
సంక్షిప్త వార్తలు (4)
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళుతున్న మినీ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఓ ఉమ్మడి కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు సహా 14 మంది మృతి చెందారు. -
కిర్గిజ్స్థాన్లో విదేశీ విద్యార్థులపై మూకదాడులు
కిర్గిజ్స్థాన్లోని భారత విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని బిష్కెక్లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగడంతో.. ఎవరూ బయటకు రావొద్దని సూచించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?