Ukraine Crisis: ఉక్రెయిన్లో వ్యూహాత్మక నగరం.. వేర్పాటువాదుల హస్తగతం!
ఉక్రెయిన్ తూర్పు డొనెట్స్క్ రీజియన్లోని వ్యూహాత్మక పట్టణం ‘లిమాన్’ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా మద్దతుగల వేర్పాటువాద దళాలు శుక్రవారం ప్రకటించాయి. మాస్కో బలగాలతో కలిసి లిమాన్ సహా 220 స్థావరాలను విముక్తి చేయడంతోపాటు...
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్ తూర్పు డొనెట్స్క్ రీజియన్లోని వ్యూహాత్మక పట్టణం ‘లిమాన్’ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా మద్దతు కలిగిన వేర్పాటువాద దళాలు శుక్రవారం ప్రకటించాయి. మాస్కో బలగాలతో కలిసి లిమాన్ సహా 220 స్థావరాలను విముక్తి చేయడంతోపాటు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించాయి. ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు ఓలెక్సీ అరెస్టోవిచ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రష్యా సైన్యం తన దాడులను ముమ్మరం చేసిందన్న విషయాన్ని ఇది సూత్రప్రాయంగా నిరూపిస్తోందన్నారు.
డొనెట్స్క్ ప్రాంతానికి గవర్నర్గా వ్యవహరిస్తోన్న పావ్లో కిరిలెంకో సైతం ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. లిమాన్ పట్టణం ప్రస్తుతం రష్యా దళాల నియంత్రణలో ఉందని చెప్పారు. అయితే, ఉక్రెయిన్ సైన్యం కూడా ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల పట్టుసాధించినట్లు తెలిపారు. తూర్పు డొనెట్స్క్ ప్రాంతంలో ఉన్న ఈ పట్టణం.. ఉక్రెయిన్ ఆధీనంలోని క్రమాటోర్స్క్కు, సెవెరోడొనెట్స్క్కు మధ్యలో ఉంటుంది. కీవ్ నియంత్రణలో ఉన్న తూర్పు నగరాలకు ఇక్కడినుంచి దారి వెళ్తుంది. ఈ నేపథ్యంలో దీన్ని కీలక ప్రాంతంగా భావిస్తారు. ఇది ప్రధాన రైల్వే హబ్ కూడా.
డాన్బాస్లో రష్యా బలగాల స్పష్టమైన పురోగతి: బోరిస్ జాన్సన్
రష్యా బలగాలు తూర్పు ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతంలో క్రమంగా స్పష్టమైన పురోగతి సాధిస్తున్నాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. స్వయంగా పుతిన్తోపాటు రష్యా మిలిటరీకీ చాలా నష్టం వాటిల్లుతున్నా.. డాన్బాస్లో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్లు శుక్రవారం ఓ వార్తా సంస్థకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కు మల్టీపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్లతో సహా మరింత సైనిక సాయం అవసరమని అభిప్రాయపడ్డారు. ‘ఈ సంక్షోభం ముగియాలంటే ఒకటే దారి. అదేంటంటే.. ఉక్రెయిన్లో డీ-నాజిఫికేషన్ పూర్తయ్యింది.. ఇక గౌరవప్రదంగా వెనక్కి వెళ్లొచ్చని పుతిన్ అంగీకరించడమే. దీనర్థం ఉక్రెయిన్లో నాజీలు ఉన్నారనే మాస్కో వాదనకు మద్దతు ఇచ్చినట్లు కాదు’ అని బోరిస్ వ్యాఖ్యానించారు. సైనిక చర్య ముగింపు విషయంలో పుతిన్కు రాజకీయ వ్యూహాలూ ఉన్నట్లు భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్